Mangaluru Autorickshaw Blast: మంగళూర్ ఆటో రిక్షా పేలుడులో ఉగ్రకోణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mangaluru Autorickshaw Blast: మంగళూరు ఆటోరిక్షా పేలుడు కేసులో ‘‘యాక్ట్ ఆఫ్ టెర్రర్’’గా పేర్కొన్నారు కర్ణాటక పోలీసులు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మంగళూర్ నగరంలో శనివారం ఆటోరిక్షాలో పేలుడు సంభవించింది. అయితే ఇది ప్రమాదవశాత్తు పేలిన సంఘటన కాదని.. తీవ్ర నష్టం కలిగించే ఉద్దేశం ఇందులో ఉందని రాష్ట్ర డీజీపీ ప్రవీణ్ సూద్ ఆదివారం అన్నారు. ఇందులో ఉగ్రకుట్ర ఉన్నట్లుగా ఆయన ధృవీకరించారు. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలకు కర్ణాటక పోలీసులు సహకరిస్తున్నారని ఆ రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు.
మంగళూర్ లో నిన్న జరిగిన పేలుడుపై రాష్ట్ర పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆటోరిక్షాలో ‘‘ బ్యాటరీలతో కాలిపోయిన ప్రెషర్ కుక్కర్’’ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రోడ్డు, నిర్మాణ పనులు జరుగుతన్న ప్రదేశంలో ఆటో రిక్షా ఆగిపోయిన సమయంలో పేలుడు సంభవించడంతో డ్రైవర్ తో పాటు మరో ప్రయాణికుడికి తీవ్రగాయాలు అయ్యాయి. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ బృందం ఘటనాస్థలికి చేరుకుని ఘటనకు గల కారణాలను అన్వేషించింది. ముందుగా దీన్ని ప్రమాదవశాత్తుగా జరిగిన ఘటనగా భావించారు. ఆ తరువాత ఉగ్రకోణం ఉందని పోలీసులు నిర్థారణకు వచ్చారు.
Also Read
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
- Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
- SC ST Atrocities Act: బాంబే హైకోర్టు సంచలన తీర్పు.. ఇస్లాంలోకి మారితే SC/ST ఎట్రాసిటీ యాక్ట్ వర్తించదు!
Read Also: Jammu Kashmir: కాశ్మీర్ లోయలో ఎన్కౌంటర్.. నాన్ లోకల్స్ని చంపుతున్న ఉగ్రవాది హతం
లొకేషన్ లోని సీసీటీవీ విజువల్స్ పరిశీలించిన తర్వాత పోలీసులు ఉగ్రకుట్రగా అనుమానిస్తున్నారు. చిన్న పేలుడు సంభవించిన తర్వాత ఆటోరిక్షాకు మంటలు అంటుకున్నట్లు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు చికిత్స పొందుతున్నారు. అయితే ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని నగర పోలీస్ కమిషనర్ ఎన్ శశికుమార్ తెలిపారు.
ఈ ఘటనకు ముందు గత నెల దీపావళికి ముందు తమిళనాడు కోయంబత్తూర్ లో ఓ గుడి సమీపంలో కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు మరణించారు. ఇది స్పష్టంగా ఉగ్రదాడిగా తర్వాత తేలింది. ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుపై తమిళనాడు సర్కార్, బీజేపీ పార్టీల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకున్నాయి.
తాజావార్తలు
-
IND vs ENG: సిక్సర్ల వేటలో జోస్ బట్లర్కు సవాల్ విసురుతున్న అభిషేక్ శర్మ.. టాప్-5 బ్యాటర్ల లిస్ట్ ఇదే!
-
Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
-
Alpha Movie Remunerations: హీరోల రేంజ్లో ఆలియా రెమ్యూనరేషన్.. అక్షరాల ఎన్ని కోట్లో తెలుసా?
-
TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!
-
Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
ట్రెండింగ్
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!