Mangaluru Autorickshaw Blast: మంగళూర్ ఆటో రిక్షా పేలుడులో ఉగ్రకోణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mangaluru Autorickshaw Blast: మంగళూరు ఆటోరిక్షా పేలుడు కేసులో ‘‘యాక్ట్ ఆఫ్ టెర్రర్’’గా పేర్కొన్నారు కర్ణాటక పోలీసులు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మంగళూర్ నగరంలో శనివారం ఆటోరిక్షాలో పేలుడు సంభవించింది. అయితే ఇది ప్రమాదవశాత్తు పేలిన సంఘటన కాదని.. తీవ్ర నష్టం కలిగించే ఉద్దేశం ఇందులో ఉందని రాష్ట్ర డీజీపీ ప్రవీణ్ సూద్ ఆదివారం అన్నారు. ఇందులో ఉగ్రకుట్ర ఉన్నట్లుగా ఆయన ధృవీకరించారు. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలకు కర్ణాటక పోలీసులు సహకరిస్తున్నారని ఆ రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు.
మంగళూర్ లో నిన్న జరిగిన పేలుడుపై రాష్ట్ర పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆటోరిక్షాలో ‘‘ బ్యాటరీలతో కాలిపోయిన ప్రెషర్ కుక్కర్’’ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రోడ్డు, నిర్మాణ పనులు జరుగుతన్న ప్రదేశంలో ఆటో రిక్షా ఆగిపోయిన సమయంలో పేలుడు సంభవించడంతో డ్రైవర్ తో పాటు మరో ప్రయాణికుడికి తీవ్రగాయాలు అయ్యాయి. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ బృందం ఘటనాస్థలికి చేరుకుని ఘటనకు గల కారణాలను అన్వేషించింది. ముందుగా దీన్ని ప్రమాదవశాత్తుగా జరిగిన ఘటనగా భావించారు. ఆ తరువాత ఉగ్రకోణం ఉందని పోలీసులు నిర్థారణకు వచ్చారు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
Read Also: Jammu Kashmir: కాశ్మీర్ లోయలో ఎన్కౌంటర్.. నాన్ లోకల్స్ని చంపుతున్న ఉగ్రవాది హతం
లొకేషన్ లోని సీసీటీవీ విజువల్స్ పరిశీలించిన తర్వాత పోలీసులు ఉగ్రకుట్రగా అనుమానిస్తున్నారు. చిన్న పేలుడు సంభవించిన తర్వాత ఆటోరిక్షాకు మంటలు అంటుకున్నట్లు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు చికిత్స పొందుతున్నారు. అయితే ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని నగర పోలీస్ కమిషనర్ ఎన్ శశికుమార్ తెలిపారు.
ఈ ఘటనకు ముందు గత నెల దీపావళికి ముందు తమిళనాడు కోయంబత్తూర్ లో ఓ గుడి సమీపంలో కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు మరణించారు. ఇది స్పష్టంగా ఉగ్రదాడిగా తర్వాత తేలింది. ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుపై తమిళనాడు సర్కార్, బీజేపీ పార్టీల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకున్నాయి.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!