Mamata Banerjee: సిగ్గుపడాలి.. పాలకులే హంతకులుగా మారారు.. బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
- పాలకులే హంతకులుగా మారారు
- బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
- అభిషేక్ బెనర్జీపై దాడి చేసిన ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాలకులే హంతకులుగా మారారని.. బెంగాల్ బీజేపీ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనార్పూర్లో మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడిపై ఎక్స్లో స్పందిస్తూ ఫైరయ్యారు. ‘‘వారు సిగ్గుపడాలి.. పాలకులు హంతకులుగా మారారు. బీజేపీకి సిగ్గుచేటు.’’ అని పేర్కొన్నారు.
ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లలో గాయపడిన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. ఈ సమయంలో
సోనార్పూర్లో అభిషేక్పై దాడి జరిగింది. గ్రామస్తులు ఇష్టానురీతిగా దాడి చేశారు. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో అభిషేక్ బెనర్జీ హెల్మెట్ ధరించి అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపింది. ఈ ఘటనకు ప్రభుత్వం సిగ్గుపడాలని మమతా బెనర్జీ విమర్శించారు. బీజేపీ మద్దతు ఉన్న దుండగులు దారుణంగా దాడి చేసినప్పటికీ… మా జాతీయ ప్రధాన కార్యదర్శి వెనకడుగు వేయలేదని.. పైగా ఆ కుటుంబానికి అండగా నిలిచారని టీఎంసీ తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది. మమతా బెనర్జీ ఈ ట్వీట్ను రీట్వీట్ చేసి ప్రకటన విడుదల చేశారు.
Also Read
- Jitendra Singh: అమిత్ షా కాల్పులకు ఆదేశాలు ఇవ్వరు, మెజిస్ట్రేట్ ఇస్తారు: కేంద్రం క్లారిటీ..
- Price Hike from August 1: ఆగస్టు 1 నుంచి ధరల మోత.. నూనె, సబ్బు, టీవీ, ఫ్రిజ్ నుంచి కార్ల వరకు పెరగనున్న ధరలు..!
- Lok sabha: ఎయిరిండియా ప్రమాద దర్యాప్తుపై కేంద్రం కీలక ప్రకటన
- Kiren Rijiju: ‘‘రాహుల్ గాంధీ హత్య చేశారని నేను కూడా చెప్పొచ్చు’’.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..
“దొంగ.. దొంగ” అంటూ బీజేపీ నినాదాలు
పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లా సోనార్పూర్లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండలో గాయపడిన బాధితులను పరామర్శించడానికి వెళ్లిన తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ (టీఎంసీ) ఎంపీ అభిషేక్ బెనర్జీపై శనివారం కొందరు దాడి చేశారు. డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యుడిగా ఉన్న బెనర్జీపై రాళ్లు, గుడ్లు విసిరారు. అంతేకాకుండా, కొందరు వ్యక్తులు ఆయనపై చెంపదెబ్బ కొట్టడానికి ప్రయత్నించి, కాళ్లతో తన్నారు. పార్టీలో నంబర్ 2గా పరిగణించే ఆయనపై ఈ దాడి జరగడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.
ఇదే సమయంలో అక్కడ పెద్ద ఎత్తున మోహరించిన భారతీయ జనతా పార్టీ (BJP) కార్యకర్తలు టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీని టార్గెట్ చేస్తూ తీవ్ర నిరసనలకు దిగారు. ఆయనను ఉద్దేశించి “దొంగ.. దొంగ” (చోర్.. చోర్) అంటూ గట్టిగా నినాదాలు చేస్తూ ముట్టడించే ప్రయత్నం చేశారు. మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడైన అభిషేక్ బెనర్జీపై నడిరోడ్డుపై దాడి జరగడం, అదే సమయంలో బీజేపీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించడంతో సోనార్పూర్లో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. టీఎంసీ, బీజేపీ కార్యకర్తల పోటాపోటీ చర్యలతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు.
#WATCH | Sonarpur, West Bengal: TMC MP Abhishek Banerjee was attacked during his visit to Sonarpur to meet the post-poll violence victims' families
He says, "It's all BJP-sponsored. Look what they have done. This is their example of democracy. It hasn't even been a month,… pic.twitter.com/UXM9dzsb4U
— ANI (@ANI) May 30, 2026
West Bengal | On the attack on the party MP Abhishek Banerjee, TMC Chairperson Mamata Banerjee tweets, "Rulers became killers- shame on you BJP." https://t.co/MIZUJSZi3y pic.twitter.com/sBQZj1qZjd
— ANI (@ANI) May 30, 2026
తాజావార్తలు
-
Jitendra Singh: అమిత్ షా కాల్పులకు ఆదేశాలు ఇవ్వరు, మెజిస్ట్రేట్ ఇస్తారు: కేంద్రం క్లారిటీ..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి FIRలో సంచలన విషయాలు..
-
PoK Protest: వారు కూడా భారత్ లాంటి శత్రువులే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Sandhya Theatre Stampede Case: తొక్కిసలాట కేసు: నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు
-
Price Hike from August 1: ఆగస్టు 1 నుంచి ధరల మోత.. నూనె, సబ్బు, టీవీ, ఫ్రిజ్ నుంచి కార్ల వరకు పెరగనున్న ధరలు..!
ట్రెండింగ్
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!