Mamata Banerjee: ‘సర్’పై పోరాటానికి మమత ప్లాన్.. వచ్చే వారం ఢిల్లీ కేంద్రంగా..!
- ‘సర్’పై పోరాటానికి మమత ప్లాన్
- వచ్చే వారం ఢిల్లీ కేంద్రంగా కవాతు
- సుప్రీంకోర్టులో స్వయంగా వాదించే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా పోరాటానికి సిద్ధమవుతున్నారు. ‘‘SIR’’పై కేంద్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని మమత నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ వచ్చే వారం ఢిల్లీలో భారీ కవాతు నిర్వహించేందుకు ప్రణాళిక రచించినట్లు వర్గాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి: Bihar: నితీష్ సర్కార్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వోద్యోగులపై సోషల్ మీడియా బ్యాన్
Also Read
- POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
- India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
- India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
త్వరలోనే బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రత్యేక సర్వే నిర్వహించింది. దీంతో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించింది. అప్పటి నుంచి ఎన్నికల సంఘానికి… కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఎంసీ విమర్శలు చేస్తోంది. అక్రమంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ఆరోపించింది. ఇక ఈ కేసు వచ్చే వారం సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ లేదా సుప్రీంకోర్టు, జంతర్ మంతర్ వరకు మమతా బెనర్జీ ర్యాలీలు నిర్వహించే అవకాశం ఉందని వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇది కూడా చదవండి: UK-China: 10 ఒప్పందాలపై యూకే-చైనా సంతకాలు.. దేనికి సంకేతాలు!
ఫిబ్రవరి 2న సాయంత్రం 4 గంటలకు మమతా బెనర్జీకి.. ఇద్దరు సహచరులతో ప్రధాన ఎన్నికల కమిషనర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1 సాయంత్రం లేదా ఫిబ్రవరి 2న తెల్లవారుజామున మమత ఢిల్లీకి చేరుకుంటారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో SIR సమస్యను రాజకీయంగా ఉపయోగించుకోవడానికి మమతా బెనర్జీ మాస్టర్ ప్లాన్ చేస్తున్నారని వర్గాలు చెబుతున్నాయి. పెద్ద ఎత్తున జనసముహాన్ని కూడబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక సుప్రీంకోర్టు వచ్చే వారం SIR అంశాన్ని విచారించే అవకాశం ఉంది. విచారణ సమయంలో మమతా బెనర్జీ కూడా హాజరు కావచ్చని ఊహాగానాలు ఉన్నాయి. మమతా బెనర్జీ న్యాయవాది కాబట్టి స్వయంగా వాదించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
-
Toxic : టాక్సిక్ రిలీజ్ ఉన్నట్టా? లేనట్టా?
-
POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
-
Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!