Bihar: నితీష్ సర్కార్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వోద్యోగులపై సోషల్ మీడియా బ్యాన్
- బీహార్లో నితీష్ సర్కార్ సంచలన నిర్ణయం
- ప్రభుత్వోద్యోగులపై సోషల్ మీడియా బ్యాన్
- రూల్స్ మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియా వాడకంపై కఠిన ఆంక్షలు విధించింది. ఇక డిజిటల్ ప్లాట్ఫామ్ల్లో అనుచిత వ్యాఖ్యలు లేదా దురుసుగా ప్రవర్తించే ప్రభుత్వ ఉద్యోగులపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
ఇది కూడా చదవండి: Trump Video: ఆమె అందం చూసే అతడికి పదవి ఇచ్చా.. ట్రంప్ హాట్ కామెంట్స్
Also Read
- Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
- Kapil Sibal: భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
ఇకపై అనుమతి లేకుండా ఖాతాలను సృష్టించడం, రీల్స్ చేయడం, ప్రత్యక్ష ప్రసారం చేయడం, ఏదైనా పాలసీపై వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తపరచడంపై పూర్తిగా నిషేధం విధించింది. ఒకవేళ ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సోషల్ మీడియా ఖాతాను సృష్టించే ముందు సంబంధిత అధికారి నుంచి అనుమతి పొందడం తప్పనిసరి చేసింది. అనామక లేదా నకిలీ ఖాతాలను ఉపయోగించడంపై కూడా పూర్తిగా నిషేధం విధించింది. ఒకవేళ ఉల్లంఘనలకు పాల్పడితే మాత్రం శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: UP: యానిమల్ పేరుతో భర్త సరదాగా పరిహాసం.. భార్య ఏం చేసిందంటే..!
సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడానికి బీహార్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మధ్య సోషల్ మీడియా కేసులు ఎక్కువ కావడంతో మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్, ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్ల్లో అనుచిత వ్యాఖ్యలు చేసే లేదా దురుసుగా ప్రవర్తించే ప్రభుత్వ ఉద్యోగులపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రతిష్టను కాపాడటానికి ఈ నియమం అవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కేబినెట్ మార్గదర్శకాల ప్రకారం.. బీహార్లోని ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సోషల్ మీడియా ఖాతాను సృష్టించే ముందు వారి సంబంధిత అధికారి నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. విధుల్లో ఉన్నప్పుడు కంటెంట్ను సృష్టించడం కచ్చితంగా నిషేధించబడింది. విధి నిర్వహణలో ఉన్నప్పుడు పనికి లేదా కార్యాలయానికి సంబంధించిన కంటెంట్ను సృష్టించడం కూడా కచ్చితంగా నిషేధించారు. ‘‘ఏదైనా రకమైన రీల్, వీడియో, ఫొటో లేదా ప్రత్యక్ష సంభాషణను ప్రసారం చేయడం నిబంధనలను నేరుగా ఉల్లంఘించినట్లుగా పరిగణించబడుతుంది. ఇటువంటి వీడియోలు తరచుగా ప్రతికూల సందేశాన్ని పంపుతాయని.. కార్యాలయ గోప్యతను ఉల్లంఘిస్తాయి..’’ అని ప్రభుత్వం చెబుతోంది.
ప్రభుత్వ విధానాలు, పథకాలు లేదా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు నిర్ణయాలపై ఏ ఉద్యోగి కూడా తమ వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ చర్యను క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణిస్తారు. దీనిని సర్వీస్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. కఠినమైన శిక్ష విధించబడుతుంది.
తాజావార్తలు
-
Peddi Breakeven Target : రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
-
Job News: ఏడాదికి రూ.55 లక్షల భారీ ప్యాకేజీ.. నోటిఫికేషన్ ఔట్.. ఇలా అప్లై చేసుకోండి!
-
Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!