Bihar: నితీష్ సర్కార్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వోద్యోగులపై సోషల్ మీడియా బ్యాన్
- బీహార్లో నితీష్ సర్కార్ సంచలన నిర్ణయం
- ప్రభుత్వోద్యోగులపై సోషల్ మీడియా బ్యాన్
- రూల్స్ మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియా వాడకంపై కఠిన ఆంక్షలు విధించింది. ఇక డిజిటల్ ప్లాట్ఫామ్ల్లో అనుచిత వ్యాఖ్యలు లేదా దురుసుగా ప్రవర్తించే ప్రభుత్వ ఉద్యోగులపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
ఇది కూడా చదవండి: Trump Video: ఆమె అందం చూసే అతడికి పదవి ఇచ్చా.. ట్రంప్ హాట్ కామెంట్స్
Also Read
- Ivolga high-speed train: భారత్కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
- BRICS: మోడీ విందుకు జిన్పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
- Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్పింగ్ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
ఇకపై అనుమతి లేకుండా ఖాతాలను సృష్టించడం, రీల్స్ చేయడం, ప్రత్యక్ష ప్రసారం చేయడం, ఏదైనా పాలసీపై వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తపరచడంపై పూర్తిగా నిషేధం విధించింది. ఒకవేళ ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సోషల్ మీడియా ఖాతాను సృష్టించే ముందు సంబంధిత అధికారి నుంచి అనుమతి పొందడం తప్పనిసరి చేసింది. అనామక లేదా నకిలీ ఖాతాలను ఉపయోగించడంపై కూడా పూర్తిగా నిషేధం విధించింది. ఒకవేళ ఉల్లంఘనలకు పాల్పడితే మాత్రం శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: UP: యానిమల్ పేరుతో భర్త సరదాగా పరిహాసం.. భార్య ఏం చేసిందంటే..!
సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడానికి బీహార్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మధ్య సోషల్ మీడియా కేసులు ఎక్కువ కావడంతో మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్, ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్ల్లో అనుచిత వ్యాఖ్యలు చేసే లేదా దురుసుగా ప్రవర్తించే ప్రభుత్వ ఉద్యోగులపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రతిష్టను కాపాడటానికి ఈ నియమం అవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కేబినెట్ మార్గదర్శకాల ప్రకారం.. బీహార్లోని ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సోషల్ మీడియా ఖాతాను సృష్టించే ముందు వారి సంబంధిత అధికారి నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. విధుల్లో ఉన్నప్పుడు కంటెంట్ను సృష్టించడం కచ్చితంగా నిషేధించబడింది. విధి నిర్వహణలో ఉన్నప్పుడు పనికి లేదా కార్యాలయానికి సంబంధించిన కంటెంట్ను సృష్టించడం కూడా కచ్చితంగా నిషేధించారు. ‘‘ఏదైనా రకమైన రీల్, వీడియో, ఫొటో లేదా ప్రత్యక్ష సంభాషణను ప్రసారం చేయడం నిబంధనలను నేరుగా ఉల్లంఘించినట్లుగా పరిగణించబడుతుంది. ఇటువంటి వీడియోలు తరచుగా ప్రతికూల సందేశాన్ని పంపుతాయని.. కార్యాలయ గోప్యతను ఉల్లంఘిస్తాయి..’’ అని ప్రభుత్వం చెబుతోంది.
ప్రభుత్వ విధానాలు, పథకాలు లేదా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు నిర్ణయాలపై ఏ ఉద్యోగి కూడా తమ వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ చర్యను క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణిస్తారు. దీనిని సర్వీస్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. కఠినమైన శిక్ష విధించబడుతుంది.
తాజావార్తలు
-
UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
-
Varanasi Set Leak: ‘వారణాసి’కి లీక్ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
-
Ivolga high-speed train: భారత్కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్లో చిరంజీవి, రామ్చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!