Mallikarjun Kharge: మోడీ ప్రభుత్వం పేదోళ్ల కడుపు కొట్టింది.. పోరాడాలని మల్లిఖార్జున ఖర్గే పిలుపు
- మోడీ ప్రభుత్వం పేదోళ్ల కడుపు కొట్టింది
- ఐక్యం కావాల్సిన సమయం వచ్చింది
- పోరాడాలని కాంగ్రెస్ శ్రేణులకు ఖర్గే పిలుపు
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చి కోట్లాది మంది పేదోళ్ల కడుపు కొట్టిందని మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ధ్వజమెత్తారు. ఢిల్లీలోని ఇందిరా భవన్లో మలికార్జున ఖర్గే నేతృత్వంలో సీడబ్ల్యూసీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో ఉపాధి హామీ చట్టం పేరు మార్పుపై ప్రధానంగా చర్చించారు.

Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
ఈ సందర్భంగా మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘‘పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మోడీ ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకాన్ని రద్దు చేసి కోట్లాది మంది పేద, బలహీన వర్గాల ప్రజలను నిస్సహాయులను చేసింది. మోడీ ప్రభుత్వం పేదల కడుపుపై కొట్టడమే కాకుండా వారి వీపు వెనుక పొడిచింది. ఎంజీఎన్ఆర్ఈజీఏను రద్దు చేయడం జాతిపిత మహాత్మా గాంధీకి అవమానం. సోనియా గాంధీ ఇటీవల రాసినట్లుగా ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం అందరి ఆశయాన్ని సాకారం చేసింది. పని చేసే రాజ్యాంగ హక్కును అమలు చేసింది. ఇప్పుడు ఈ పథకాన్ని సమాధి చేశారు. ఇది రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలోని కోట్లాది మంది శ్రామిక ప్రజలపై ఆర్థిక, మానవ పరిణామాలను కలిగిస్తుంది. మనందరినీ రక్షించే హక్కులను కాపాడుకోవడానికి ఇప్పుడు గతంలో కంటే ఎక్కువగా ఐక్యమవ్వడం అత్యవసరం.’’ అని అన్నారు.

ఈ సమావేశానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు పాటు ఇతర సీనియర్ నేతలు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు హాజరయ్యారు. శశిథరూర్ కూడా హాజరు కావడం ప్రత్యేక ఎట్రాక్షన్గా నిలిచింది.
ఇది కూడా చదవండి: Jabalpur: జబల్పూర్ అగ్రి వర్సిటీలో దారుణం.. యువతిపై గ్యాంగ్రేప్
ఇదిలా ఉంటే ఆదివారం (డిసెంబర్ 28) కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం. ఈ సందర్భంగా
దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ చిత్రపటాలతో మండల, గ్రామస్థాయిల్లో పీసీసీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ‘‘పని చేసే హక్కు, శ్రమ గౌరవం, సమాజిక న్యాయం’’ పేరుతో ఆందోళనలు, నిరసనలు తెలపనున్నారు. ఉపాధి హామీ పథకం పేరును ‘జీ రామ్ జీ’గా మార్చారు. అప్పుడే కేంద్ర నిర్ణయాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్ నిరసన తెలిపింది. రేపు దేశ వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.
Delhi | In his opening remarks at the Congress Working Committee Meeting, Congress National President Mallikarjun Kharge says, "In the recent winter session of Parliament, the Modi government has abolished MGNREGA, leaving millions of poor and vulnerable people helpless. The Modi… pic.twitter.com/wcK3CcMjID
— ANI (@ANI) December 27, 2025
#WATCH | Delhi | Congress MP Shashi Tharoor arrives at the All India Congress Committee (AICC) Headquarters in Indira Bhawan to attend the Congress Working Committee (CWC) meeting. pic.twitter.com/SKZhFmgwyz
— ANI (@ANI) December 27, 2025
#WATCH | Delhi | Congress Working Committee (CWC) meeting ongoing at the All India Congress Committee (AICC) Headquarters in Indira Bhawan. pic.twitter.com/poDXmcfouT
— ANI (@ANI) December 27, 2025
#WATCH | Delhi | Congress National President Mallikarjun Kharge greets Congress Parliamentary Party Chairperson Sonia Gandhi and Lok Sabha LoP Rahul Gandhi outside the All India Congress Committee (AICC) Headquarters in Indira Bhawan. They enter the building together to attend… pic.twitter.com/CZPzaj4zCe
— ANI (@ANI) December 27, 2025
#WATCH | Delhi | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi arrives at the All India Congress Committee (AICC) Headquarters in Indira Bhawan to attend the Congress Working Committee (CWC) meeting. pic.twitter.com/DbrlO1td5c
— ANI (@ANI) December 27, 2025
తాజావార్తలు
-
Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
-
West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
-
Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Minumula Payasam Recipe: నడుము నొప్పికి చెక్.. 60 ఏళ్లలోనూ ఉక్కులాంటి బలం ఇచ్చే ‘మినుముల పాయసం’!
-
AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!