Maharashtra Political Crisis: ఉద్ధవ్ ఠాక్రేతో శరద్ పవార్ కీలక సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో పాటు డిప్యూటీ సీఎం అజిత్ పవార్, రాష్ట్ర కేబినెట్ మంత్రి జయంత్ పాటిల్, పార్టీ నేత ప్రఫుల్ పటేల్ ముంబైలోని సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతో శ్రీకి వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి చర్చించారు. శివసేన నుంచి ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారిపోతుండటంతో రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించినట్లు సమాచారం.
సమావేశం నేపథ్యంలో మాతోశ్రీ ముందు పెద్ద ఎత్తున శివసేన కార్యకర్తలు గుమిగూడి, ఉద్ధవ్ ఠాక్రేకు మద్దతుగా నినాదాలు చేశారు. ఇప్పటికే పలు చోట్ల శివసేన కార్యకర్తలు రెబెల్ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేశారు. వారి బ్యానర్లను చించేశారు. దీంతో మహారాష్ట్ర వ్యాప్తంగా శివసేన కార్యకర్తలు ఏదైనా అల్లర్లకు పాల్పడే అవకాశం ఉండటంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయింది. ముఖ్యంగా ముంబైలో హై అలెర్ట్ ప్రకటించారు.
Also Read
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
మరోవైపు శివసేన తన పార్టీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యేలు 16 మందిపై అనర్హత వేటు వేసింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై చట్టపరమైన అభిప్రాయం కోరేందుకు మహారాష్ట్ర అడ్వకేట్ జనరల్ అశుతోష్ కుంభకోనిని అసెంబ్లీ సెక్రటేరియట్ పిలిచింది. రాజ్యాంగ పరంగా, చట్టపరంగా ఏ విధంగా ముందుకు వెళ్లవచ్చనే అంశంపై చర్చించనున్నారు.
ఇదిలా ఉంటే రేపు శివసేన పార్టీ అత్యున్నత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చింది. రేపు మధ్యాహ్నం 1 గంటకు సేన భవన్లో శివసేన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఉద్దవ్ ఠాక్రే పాల్గొగనున్నారు.
తాజావార్తలు
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!