Sanjay Raut: ఎమ్మెల్యేల నిర్ణయం అదే అయితే కూటమి నుంచి వైదొలగడానికి సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ‘మహా’ మలుపులు తిరుగుతోంది. శివసేనలో చీలిక రావడంతో అక్కడ మహా వికాస్ అఘాడీ ఉమ్మడి సర్కార్ కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే తన మద్దతు ఎమ్మెల్యేలతో అస్సాం రాజధాని గౌహతిలో మకాం వేశారు. తమకు ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వంపై నమ్మకం లేదని లేఖ కూడా విడుదల చేశారు ఎమ్మెల్యేలు. శివసేన నాయకుడు ఏక్ నాథ్ షిండే, సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై సంచలన ఆరోపణలు చేశారు. తమకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని.. ఎమ్మెల్యేల మనోభావాలను పట్టించుకోలేదని సంచనల వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే ఈ అంశంపై శివసేన కీలక నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా సీఎంతో చర్చించాలని.. ఎమ్మెల్యేల అభీష్టం మహా వికాస్ అఘాడీ నుంచి వైదొలగడమే అంటే అందుకు సిద్ధంగా ఉన్నామని.. అయితే వారు గౌహతి నుంచి కాకుండా ముంబై వచ్చి సీఎంతో చర్చించాలని సూచించారు. ఉద్ధవ్ ఠాక్రే మళ్లీ సీఎం అధికార నివాసం ‘ వర్ష బంగ్లా’కు తిరిగి వస్తారని సంజయ్ రౌత్ ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఉన్నారని, గౌహతిలో ఉన్న ఎమ్మెల్యేల్లో 18 మంది కూడా తమతో టచ్ లో ఉన్నారని శివసేన ఎంపీ వినాయక్ రౌత్ అన్నారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ఇదిలా ఉంటే ప్రస్తుతం తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే క్యాంప్ లో మొత్తం 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో 35 మంది ఎమ్మెల్యేలు శివసేనకు సంబంధించిన వారు కాగా.. మరో ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా రాజధాని గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్ లో క్యాంప్ పెట్టారు. అయితే ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన ప్రభుత్వం కూలిపోకుండా, బీజేపీ చేతిలోకి అధికారం వెళ్లకుండా శరద్ పవార్ మంతనాలు సాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!