Delhi: ప్రధాని మోడీని కలిసిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్.. కేబినెట్ కూర్పుపై చర్చ
- ప్రధాని మోడీని కలిసిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్
- కేబినెట్ కూర్పుపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హస్తిన పర్యటనలో బిజిబిజీగా గడుపుతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. బుధవారం కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీని కలిశారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ను కలిశారు. ఇక గురువారం మధ్యాహ్నం ప్రధాని మోడీని కలిశారు. ఈ సందర్భంగా కేబినెట్ కూర్పుపై చర్చించారు.
ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడినా.. రాజకీయ పరిస్థితులు మాత్రం ఇంకా సద్దుమణగలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 12 రోజులకు ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి వరకు ముఖ్యమంత్రి పదవిపై మహాయుతి కూటమిలో తీవ్ర పంచాయితీ జరిగింది. చివరికి బీజేపీనే.. ఆ పీఠాన్ని దక్కించుకుంది. దేవేంద్ర ఫడ్నవిస్… సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణం చేశారు. అయిష్టంగానే ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసినట్లు తెలుస్తోంది.
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
ప్రస్తుతం ఫడ్నవిస్ కేబినెట్ కూర్పు చేస్తున్నారు. ఇందుకు హైకమాండ్ పెద్దలను కలిసేందుకు బుధవారం హస్తినకు వెళ్లారు. బుధవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్కర్ను కలిశారు. అమిత్ షాతో మంత్రివర్గంపై చర్చించారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ కూడా ఢిల్లీలోనే మకాం వేశారు. శివసేన నేత షిండే మాత్రం హస్తినకు వెళ్లలేదు. ముంబైలోనే ఉన్నారు. అయితే శివసేన హోంమంత్రి పదవిని ఆశిస్తున్నట్లుగా సమాచారం. కానీ హోంశాఖను ఇచ్చేందుకు ఫడ్నవిస్ సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది. హోంశాఖను తన దగ్గరే పెట్టుకోవాలని ఫడ్నవిస్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివసేన గుర్రుగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే మంత్రి పదవులపై బీజేపీ, ఎన్సీపీ ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. శివసేన విషయంలోనే ఇంకా పంచాయితీ తెగనట్లుగా కనిపిస్తోంది. బీజేపీకి 22, శివసేనకు 11, ఎన్సీపీకి 10 మంత్రి పదవులు కేటాయించినట్లు సమాచారం. మొత్తం మహారాష్ట్రలో గరిష్టంగా 43 మంది మంత్రులు ఉండే అవకాశం ఉంది. అయితే శివసేన కీలకమైన ఫోర్ట్పోలియోను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అవి ఇచ్చేందుకు మాత్రం ఫడ్నవిస్ నిరాకరిస్తున్నట్లు సమాచారం. దీంతోనే మహాయుతిలో మరోసారి తీవ్ర పంచాయితీ సాగుతోంది. హోంశాఖతో పాటు రెవెన్యూను తన దగ్గరే ఉంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. శివసేనకు అర్బన్ డెవలప్మెంట్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇక ఎన్సీపీకి మాత్రం ఫైనాన్స్ కేటాయించే అవకాశం ఉంది.
డిసెంబర్ 16 నుంచి మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సమావేశాలకు రెండు రోజుల ముందే మంత్రివర్గ విస్తరణ చేయాలని ఫడ్నవిస్ భావిస్తున్నారు. డిసెంబర్ 14నే ఈ కార్యక్రమం ముగించాలని అనుకుంటున్నారు. కానీ ఫోర్ట్పోలియోపై పంచాయితీ తెగకపోవడంతో ఇది మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మహాయుతి భారీ విజయాన్ని నమోదు చేసింది. బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీ 41, కాంగ్రెస్ 16, ఉద్ధవ్ థాక్రే 20, శరద్ పవార్ పార్టీ 10 స్థానాలు గెలుచుకుంది. డిసెంబర్ 5న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!