Madhya Pradesh HC: “లివ్-ఇన్ రిలేషన్ షిప్” బ్రేకప్ తర్వాత మహిళ విషయంలో సంచలనాత్మక తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh HC: మధ్యప్రదేశ్ హైకోర్టు లివ్-ఇన్ రిలేషన్ షిప్పై సంచలనాత్మక తీర్పును వెల్లడించింది. చట్టబద్ధంగా వివాహం కాకున్నా, పురుషుడితో చాలా కాలం పాటు జీవించిన స్త్రీకి, విడిపోయిన తర్వాత భరణం పొందేందుకు అర్హురాలే అని తీర్పునిచ్చింది. లివ్ ఇన్ రిలేషన్లో మహిళల హక్కుల్ని గుర్తించే దిశగా హైకోర్టు ముందడుగు వేసింది. ఇద్దరి మధ్య సహజీవనం ఉన్నట్లు రుజువైతే భరణాన్ని తిరస్కరించలేమని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు ఉదహరిస్తూ.. స్త్రీ,పరుషులు భార్యభర్తలుగా జీవిస్తున్నారని నిర్థారణ అయిందని, రిలేషన్లో పిల్లలు పట్టుకను పరిగణలోకి తీసుకుని న్యాయస్థానం మహిళకు భరణం పొందే హక్కు ఉందని ధ్రువీకరించింది. సహజీవనంలో ఉన్న మహిళకు నెలవారీ భత్యం రూ. 1500 చెల్లించాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన తరుణంలో హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది.
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
Read Also: PM Modi: యుపి ర్యాలీలో “ఫ్లాప్ ఫిల్మ్” అంటూ వారి పై వ్యాఖ్యలు చేసిన పీఎం మోడీ..!
బాలాఘాట్కి చెందిన శైలేష్ బోప్చే అనే వ్యక్తి మహిళ ఆరోపణలపై ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తన భార్యగా చెప్పుకుంటున్న మహిళ, ఆలయంలో వివాహం చేసుకున్నట్లు రుజువు చేయలేకపోయిందని బోప్చే కోర్టుకు చెప్పాడు. ఈ కేసులో మహిళ చట్టబద్ధంగా అతని భార్య కాదని సీఆర్పీసీలోని సెక్షన్ 125 కింద మెయింటనెన్స్ మొత్తాన్ని డిమాండ్ చేయలేదని బోప్చే తరుపు న్యాయవాది వాదనల్ని వినిపించారు. అయితే, జస్టిస్ జీఎస్ అహ్లువాలియాతో కూడిన సింగ్ బెంజ్ మహిళ కొంత కాలం సదరు వ్యక్తితో కలిసి జీవించిందనే వివరాలను గుర్తించింది. దీంతో ఆమె భరణానికి అర్హురాలే అని తీర్పు చెప్పింది.
ఇటీవల కాలం సమాజంలో లివ్ ఇన్ రిలేషన్ కేసుల పెరుగుతున్న తరుణంలో, ఇలాంటి సంబంధాల్లో మహిళల హక్కులను గుర్తించేందుకు ఈ తీర్పు ముందడుగుగా ఉపయోగపడనుంది. పెళ్లి కాకున్నా కొంత కాలం పాటు పురుషుడు, స్త్రీ కలిసి ఉండీ, ఆ తర్వాత విడిపోతే సదరు మహిళ హక్కుల విషయం ప్రశ్నార్థకంగా ఉండేది. అయితే, తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు వారికి కూడా హక్కుల్ని కల్పిస్తున్నట్లు సూచిస్తోంది. మరోవైపు ఈ ఏడాది ఉత్తరాఖండ్ తీసుకువచ్చిన యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు కూడా లివ్ రిలేషన్ విషయంలో రిజస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొంది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..