Shehla Rashid: ఒకప్పుడు మోడీ విమర్శకురాలు..ఇప్పుడు ‘‘భారతీయులుగా పుట్టడం అదృష్టం’’ అంటూ ప్రధానిపై ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shehla Rashid: జేఎన్యూ మాజీ విద్యార్థి నాయకురాలు, ఒకప్పుడు నరేంద్రమోడీని తీవ్రంగా విమర్శించే విమర్శకురాల, ఇప్పుడు ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించింది. షెహ్లా రషీద్, ఇజ్రాయిల్-పాలస్తీనా సంఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో భారతీయులుగా పుట్టినందుక చాలా అదృష్టవంతులమని వ్యాఖ్యానించారు. దీర్ఘకాలిక శాంతి, భద్రతకు భరోసా ఇచ్చినందుకు ప్రధాని మోడీ, భారత సైన్యానికి, కేంద్రమంత్రి అమిత్ షాలను ఆమె ప్రశంసించారు.
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం వేళ, గాజా ప్రాంతంలో మానవతా సంక్షోభం ఏర్పడింంది. ఉత్తర గాజాను 24 గంటల్లో విడిచిపోవాలని ఇజ్రాయిల్ హెచ్చరించిన నేపథ్యంలో దక్షిణం వైపు లక్షలాది మంది తరలివెళ్తున్నారు. ఈ పరిస్థితి తీవ్ర మానవ సంక్షోభానానికి కారణమైంది.
Also Read
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
- Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
- Suitcase Torso Case: సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
Read Also: Putin: ఇజ్రాయిల్కు తనను తాను రక్షించుకునే హక్కు ఉంది.. పుతిన్ కీలక వ్యాఖ్యలు..
‘‘మధ్యప్రాచ్యంలో జరుగుతున్న సంఘటనలు చూస్తే భారతీయులుగా మనం ఎంత అదృష్టవంతులమో ఈ రోజు నేను గ్రహించాను. భారత సైన్యం, భద్రతా దళాలు మన భద్రత కోసం తమ సర్వస్వం త్యాగం చేశారు. ప్రధాని మోడీ, భారతసైన్యం, హోంమంత్రి అమిత్ షాలకు థాంక్స్, కాశ్మీర్కి శాంతి చేకూరుతుంది’’ అంటూ షెహ్లా రషీద్ ట్వీట్ చేశారు. మిడిల్ ఈస్ట్ సంక్షోభంలో చూసినట్లుగా భద్రత లేకుండా శాంతి అసాధ్యం, కాశ్మీర్ లో దీర్ఘకాలిక శాంతి, భద్రతలకు కోసం భారత్ సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ధైర్యసాహసాలు, ఎన్నో త్యాగాలు చేశారని ఆమె పోస్టులో వెల్లడించారు.
ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ పాటు మరికొందరు తుక్డే-తుక్డే గ్యాంగ్ గా ముద్రపడ్డారు. ఫ్రీకాశ్మీర్ అంటూ ఢిల్లీలోని జేఎన్ యూనివర్సిటీలో నినదించారు. ఆ సమయంలో 2016లో షెహ్లా రషీద్ తొలిసారిగా వార్తల్లో నిలిచారు. కాశ్మీర్ లో సాయుధబలగాలు ఇళ్లను దోచుకుని భయాందోళనలకు గురిచేస్తున్నాయని ఆరోపిస్తూ 2019లో ఆమె ట్వీట్ చేసింది. దీంతో ఆమెపై కేసు నమోదైంది.
ఈ ఏడాది ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తల నుంచి తన పేరును ఉపసంహరించుకున్నారు షెహ్లా రషీద్. కాశ్మీర్ లో మానవహక్కులు మెరుగుపడ్డాయని, ప్రస్తుతం ప్రభుత్వం ప్రజలను రక్షిస్తోందని గతంలో షెహ్లా రషీద్ అన్నారు.
https://twitter.com/Shehla_Rashid/status/1713085727892983875
తాజావార్తలు
-
Ajith Kumar: యూరప్ ఎండ్యూరెన్స్ రేస్లో ప్రమాదం.. అదుపుతప్పి మరో కారును వేగంగా ఢీకొట్టిన అజిత్!
-
Shubman Gill Record: శుభ్మన్ గిల్ అరుదైన రికార్డు.. సచిన్, సెహ్వాగ్ తర్వాత..!
-
Vivo V70 Lite 4G: వివో V70 Lite 4G వచ్చేసింది.. 8100mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
-
Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
-
Toxic Advance Booking: రిలీజ్కు ముందే యష్ ‘టాక్సిక్’ రికార్డు.. ‘ధురందర్’ను దాటేసిన బుకింగ్స్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!