Raebareli: యూపీలో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్ర.. రాయ్బరేలీలో ట్రాక్పై ఇసుక కుప్ప
- యూపీలో రైలు పట్టాలపై ఇసుక కుప్ప..
- అప్రమత్తమైన లోకో పైలట్ ట్రైన్ ను నిలిపివేసిన వైనం..
- ఘటనపై విచారణ చేస్తున్న ఖీరూన్ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raebareli: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పట్టాలు తప్పించేందుకు కుట్రలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన రాయ్బరేలీ జిల్లాలో జరిగింది. ఖీరూన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రఘురాజ్ సింగ్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఇసుక కుప్పను చూసిన ప్యాసింజర్ రైలు లోకో పైలట్ వెంటనే నిలిపివేశాడు. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. ఖీరోన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దేవేంద్ర భడోరియా మాట్లాడుతూ.. డంపర్ నుంచి రైల్వే ట్రాక్పై ఇసుక పోశారని, దానిని తొలగించిన తర్వాత రైలు వెళ్లిందన్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుంది. స్థానికంగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.. దీంట్లో భాగంగా మట్టిని రవాణా చేసే పని రాత్రిపూట జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే ఓ డ్రైవర్ డంపర్ నుంచి ఇసుకను రైల్వే ట్రాక్పై పోసి అక్కడి నుంచి పారిపోయాడన్నారు. ఇది జరిగిన కొసేపటికే రాయ్ బరేలీ- రఘురాజ్ సింగ్ స్టేషన్ మధ్య నడుస్తున్న షటిల్ రైలు ఈ రూట్లో వచ్చిందని పోలీసులు వెల్లడించారు.
Read Also: Suryakumar Yadav: అది పెద్ద తలనొప్పి అయ్యింది: సూర్యకుమార్
Also Read
ఇక, ఆ రైలు లోకో పైలట్ రైల్వే ట్రాక్పై మట్టిని గమనించి.. రైలును ఆపాడని ఖోరోన్ పోలీస్ ఇన్ స్పెక్టర్ దేవేంద్ర భడోరియా చెప్పుకొచ్చారు. లోకో పైలట్ అలర్ట్ కావడంతో పెను ప్రమాదం తప్పింది.. రైల్వే ట్రాక్పై మట్టిని తొలగించిన తర్వాత రైలు నెమ్మదిగా ముందుకు వెళ్లిందన్నారు. ఈ టైంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి వచ్చారు. గేట్మెన్ మాట్లాడుతూ రైలు వేగం తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పింది.. ఒకవేళ వేగం ఎక్కువగా ఉంటే రైలు పట్టాలు తప్పేది అన్నారు. పోలీసులు ఈ ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారని చెప్పుకొచ్చారు.
#रायबरेली के खीरों क्षेत्र में रेलवे ट्रैक पर मिट्टी का ढेर मिलने से ट्रेन के ड्राइवर ने सतर्कता दिखाते हुए समय रहते ट्रेन को रोक दिया, जिससे एक बड़ा हादसा टल गया। जानकारी के अनुसार, डंपर से ट्रैक पर मिट्टी गिर जाने का दावा किया जा रहा है। पुलिस और रेलवे प्रशासन ने मौके पर… pic.twitter.com/Mn05EmrZV9
— UttarPradesh.ORG News (@WeUttarPradesh) October 7, 2024
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!