UTTAR PRADESH: రాజకీయ దుమారంగా మారిన “కన్వర్ యాత్ర” రూల్స్.. ‘‘యాంటీ ముస్లిం’’ అంటూ విమర్శలు..
- రాజకీయ దుమారం రేపిన ‘కన్వర్ యాత్ర’ రూల్స్..
- యాంటీ ముస్లిం అంటూ ప్రతిపక్షాల విమర్శలు..
- ప్రభుత్వ తీరుపై అసదుద్దీన్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UTTAR PRADESH: ఉత్తర్ ప్రదేశ్లో శివభక్తులు చేసే ‘కన్వర్ యాత్ర’కు ముజఫర్ నగర్ పోలీసులు పెట్టిన రూల్స్ ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రాజేశాయి. యాత్రా మార్గంలో తినుబండారాల విక్రేతలు తమ పేర్లను తప్పకుండా ప్రదర్శించాలని యూపీ పోలీసులు ఆదేశించారు. అయితే, దీనిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దక్షిణాఫ్రికాలోని ‘వర్ణ వివక్ష’, హిట్లర్ విధానాలుగా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. శివ భక్తులు వార్షిక తీర్థయాత్ర అయిన కన్వర్ యాత్ర జూలై 22న ప్రారంభం అవుతోంది.
మతపరమైన ఊరేగింపులో ఎలాంటి గందరగోళం ఏర్పడకుండా ఉండేందుకు మార్గంలోని అన్ని ఫుడ్ స్టాల్స్ వాటి యజమానుల పేరును ప్రముఖంగా ప్రదర్శించాలని ముజఫర్ నగర్ పోలీసులు ఆదేశించారు. కన్వర్ యాత్రకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ‘‘ మా పరిధిలోని 240 కి.మీలోని అన్ని తినుబండారాలు, హోటళ్లు, దాబాలు మరియు టేలాలు (రోడ్డు పక్కన బండ్లు) వాటి యజమానులు లేదా దుకాణాన్ని నడుపుతున్న వారి పేర్లను ప్రదర్శించాలని ఆదేశించబడింది. కాన్వారియాల్లో ఎలాంటి గందరగోళం లేకుండా, భవిష్యత్తులో ఎలాంటి ఆరోపణలు రాకుండా శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ప్రతీ ఒక్కరు దీనిని ఆచరించాలి’’ అని జిల్లా ఎస్పీ అభిషేక్ సింగ్ అన్నారు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: Encounter: గడ్చిరోలి జిల్లాలో మూడేళ్లలో 80 మంది మావోయిస్టుల హతం..
ముస్లిం యజమానుల దుకాణాల్లో యాత్రికులు ఏం కొనకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ‘‘ ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఆదేశం ప్రకారం.. ప్రతి ఫుడ్ షాప్ యజమాని తన పేరును బోర్డుపై పెట్టాలి. తద్వారా కన్వర్ యాత్రికులు ముస్లిం దుకాణాల్లో ఏం కొనకూడదు. దీనిని హిట్లర్ వర్ణ వివక్షగా పిలుస్తారు. ‘‘జూడెన్ బాయ్కాట్’ అని పిలుస్తారు’’ అంటూ ఓవైసీ ట్వీట్ చేశారు.
ప్రముఖ బాలీవుడ్ పాటల రచయిత్ జావేద్ అక్తర్ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ‘‘ముజఫర్నగర్ యుపి పోలీసులు సమీప భవిష్యత్తులో ఒక నిర్దిష్ట మతపరమైన ఊరేగింపు మార్గంలో అన్ని దుకాణాలు రెస్టారెంట్లు మరియు వాహనాలు కూడా వాటి యజమాని పేరును ప్రముఖంగా మరియు స్పష్టంగా చూపించాలని ఆదేశాలు ఇచ్చారు. ఎందుకు?. నాజీ జర్మనీలో కొన్ని దుకాణాలు, ఇళ్లకు ప్రత్యేకమైన గుర్తు పెట్టేవారు’’ అని ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనిపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో యూపీ పోలీసులు దీని వెనక ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పారు. భక్తుల సౌలభ్యం కోసమే అని వెల్లడించారు
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!