Encounter: గడ్చిరోలి జిల్లాలో మూడేళ్లలో 80 మంది మావోయిస్టుల హతం..
- 2021 నుంచి ఇప్పటి వరకు 80 మంది మావోయిస్టులను మట్టుబెట్టిన పోలీసులు
- 102 మంది మావోయిస్టుల అరెస్ట్
- లొంగిపోయిన 29 మంది నక్సలైట్లు
- తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ పై పోలీసుల ప్రకటన విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మూడేళ్లలో 80 మంది మావోయిస్టుల హతమయ్యారు. 2021 నుంచి ఇప్పటి వరకు 80 మంది మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారు. 102 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. 29 మంది మావోయిస్టులు లొంగిపోయారు. గడ్చిరోలి జిల్లా పోలీసుల పనితీరుపై ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ పై పోలీసుల ప్రకటన విడుదల చేశారు. నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో
12 మంది మావోయిస్టులు హతమయిన విషయం తెలిసిందే. రాబోయే నక్సల్ వీక్ (28 జూలై-03 ఆగస్టు) నేపథ్యంలో విధ్వంసక కార్యకలాపాలకు మావోయిస్టుల ప్రయత్నాన్ని గడ్చిరోలి పోలీసులు అడ్డుకున్నారు. ఐదుగురు ఏసీఎం (ఏరియా కమిటీ సభ్యుడు)తో పాటు డీవీసీఎం (డివిజనల్ కమిటీ సభ్యుడు) స్థాయి ముగ్గురు సీనియర్ కేడర్లు, అలాగే నలుగురు దళం సభ్యులు చనిపోయారు. మహారాష్ట్ర ప్రభుత్వం మొత్తం నగదు రివార్డు రూ.86 లక్షలు ప్రకటించింది.
READ MORE: Jammu Kashmir: కుప్వారాలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం..
Also Read
ఘటనా స్థలంలో పోలీసులు ఏడు ఆటోమేటిక్ ఆయుధాలు సహా 11 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎదురుకాల్పులతో, కోర్చి-తిపగడ్ అలాగే చట్గావ్-కసన్సూర్ ఎల్ వోఎస్ (LOS) మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. రాబోయే నక్సల్స్ వారోత్సవం (28వ తేదీ) నేపథ్యంలో విధ్వంసకర కార్యకలాపాలు నిర్వహించే లక్ష్యంతో 12 నుంచి 15 మంది కోర్చి-తిపగడ్ & చత్గావ్-కసన్సూర్ ఉమ్మడి LOS సభ్యులు వందోలి గ్రామంలోని ఛత్తీస్గఢ్ సరిహద్దు సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిది చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సమాచారం నిన్న ఉదయం పోలీసులకు అందింది. దీని ప్రకారం.. డీవైఎస్పీ (ఆపరేషన్స్) విశాల్ నాగర్గోజే నేతృత్వంలోని మావోయిస్టు వ్యతిరేక సి-60 స్క్వాడ్లోని ఏడు యూనిట్లను వెంటనే ఆ ప్రాంత శోధన కోసం పంపారు. బృందాలు ఏరియా సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా, మావోయిస్టులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. వీరికి సీ-60 బృందాలు గట్టి బదులిచ్చాయి. చివరకు పోలీసుల ఒత్తిడిని గమనించిన మావోయిస్టులు దట్టమైన అడవిలోకి పారిపోయారు. ఎదురుకాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో వెతకగా ఏడుగురు మగ, ఐదుగురు మహిళా మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతి చెందిన మావోయిస్టులను గుర్తించారు. ప్రస్తుతం గడ్చి రోలి ఆసుపత్రి మార్చురిలో మావోయిస్టుల మృత దేహాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
-
Kalki 2898 AD : ప్రభంజనం.. ఏకంగా రెండు జాతీయ అవార్డులు కైవసం!
-
Toxic: కియారాని వెనకేసుకొస్తున్న బ్రిటిష్ నటుడు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!