Kolkata Doctor Murder Case: పోలీసులు లంచం ఇస్తామన్నారు.. జూనియర్ డాక్టర్ ఫ్యామిలీ సంచలన ఆరోపణలు
- కోల్కతా జూనియర్ వైద్యురాలిపై హత్యాచార కేసులో మరో మలుపు..
- ఈ కేసు దర్యాప్తులో పోలీసులు అక్రమాలకు పాల్పడ్డారంటూ మృతురాలి తండ్రి ఆరోపణలు..
- ఓ పోలీసు అధికారి మాకు డబ్బులు ఆఫర్ చేశారు: వైద్యురాలి తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Doctor Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్కతా జూనియర్ వైద్యురాలిపై హత్యాచార, హత్య కేసు మరో మలుపు తీసుకుంది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు అక్రమాలకు పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు చేశారు బాధితురాలి తల్లిదండ్రులు.. కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ట్రై చేశారని.. హడావుడిగా తమ కుమార్తె దహన సంస్కారాలు పూర్తి చేయించారని పేర్కొన్నారు. తమకు లంచం కూడా ఇచ్చేందుకు ట్రై చేశారని తెలిపారు.
Read Also: Kangana Ranaut: మేకప్ లేకపోతే.. అసలు కంగనా రనౌత్ను ఎవరు గుర్తుపట్టరు: హిమాచల్ప్రదేశ్ మంత్రి
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ఇక, డాక్టర్ పై హత్యాచార ఘటనకు సంఘీభావంగా బుధవారం రాత్రి కోల్కతాలో జరిగిన నిరసనల్లో బాధితురాలి తల్లిదండ్రులు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మృతురాలి తండ్రి మాట్లాడుతూ.. ‘‘ప్రజలకు వాస్తవాలు తెలియకుండా కేసును అణగదొక్కేందుకు పోలీసులు ఫస్ట్ నుంచి ట్రై చేశారు.. మృతదేహాన్ని చూసేందుకు కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదు.. పోస్ట్మార్టం పూర్తయ్యేంత వరకు పోలీస్ స్టేషన్లోనే ఉంచారు.. ఆ తర్వాత డెడ్ బాడీని మాకు అప్పగించే సమయంలో.. ఓ సీనియర్ పోలీసు అధికారి మా దగ్గరకు వచ్చి డబ్బులు ఆఫర్ చేయగా.. తాము దాన్ని తిరస్కరించామని ఆయన వెల్లడించారు.
Read Also: Delhi : లోపల వైఫై, జీపీఎస్, సీసీటీవీ..ఢిల్లీలోని సామాన్య ప్రజల కోసం స్పెషల్ బస్సు సర్వీసు
కాగా, ఈ కేసుపై తొలుత కోల్కతా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే, దర్యాప్తు టైంలో వారు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే కేసును కోల్కతా హైకోర్టు సీబీఐకి అప్పజేప్పింది. ప్రస్తుతం దీనిపై సీబీఐ ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్ సహా ఘటన చోటు చేసుకున్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్తో పాటు మరి కొందరికి పాలీగ్రాఫ్ టెస్టులు చేసి అరెస్ట్ చేసింది.
తాజావార్తలు
-
Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
-
Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
-
Nagarjuna: భట్టి మాటలతో ఆలోచనలో పడి పళ్ళ బురుసు సినిమా చేశాం
-
Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
-
CGST Superintendent: రూ.50 వేలు లంచం.. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!