Kangana Ranaut: మేకప్ లేకపోతే.. అసలు కంగనా రనౌత్ను ఎవరు గుర్తుపట్టరు: హిమాచల్ప్రదేశ్ మంత్రి
- బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పై మంత్రి జగన్ సింగ్ నేగి హాట్ కామెంట్స్..
- హిమాచల్ లో వరదలు వచ్చిన టైంలో కంగనా మేకప్ పోతుందనే పర్యటించలేదు..
- కంగనా రనౌత్ మేకప్ పోతే ఆమెను ఎవరు గుర్తు పట్టరు: మంత్రి జగత్ సింగ్ నేగీ
Kangana Ranaut: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండీ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్పై ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి జగత్ సింగ్ నేగి హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా జగత్ సింగ్ కంగాన అంశాన్ని ప్రస్తావించారు. ‘జూన్ చివర్లో ముంచెత్తిన వర్షాలు, వరదలతో మన రాష్ట్రం అతలాకుతలమైపోయింది. రాజకీయ నేతలంతా వరద ప్రభావితకాలంలోనే పర్యటించి బాధితులను ఓదార్చారు. ఇక, కంగనా ప్రాతినిధ్యం వహిస్తున్న మండీ నియోజకవర్గం కూడా వరదలో చిక్కుకుపోయిందన్నారు. కానీ, ఆ సమయంలో కంగనా పర్యటించలేదు.. ఇప్పుడు వర్షాలు తగ్గిపోయిన తర్వాత తీరిగ్గా పర్యటిస్తున్నారని విమర్శించారు. వర్షాలు, వరదల సమయంలో ఆమె బయటకు రాదు.. ఎందుకంటే వర్షంలో తడిస్తే ఆమె వేసుకున్న మేకప్ పోతుంది.. కాబట్టి మేకప్ లేకుంటే కంగనను ప్రజలు ఎవరూ గుర్తుపట్టలేరు.. తమ ఎదురుగా ఉన్నది కంగననా? లేక ఆమె తల్లినా? అనేది కూడా ఎవరూ పోల్చుకోలేరు అని మంత్రి జగత్ సింగ్ అన్నారు.
Read Also: Duleep Trophy 2024: ఇండియా-ఎలో 10 మంది టీమిండియా ప్లేయర్స్.. తెలుగోడికి దక్కని చోటు!
Also Read
కాగా, ఇటీవేల హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వరదలు వచ్చాయి. ఈ వర్షాల వల్ల దాదాపు 153 మంది చనిపోగా.. సుమారు రూ.1271 కోట్ల మేర నష్టం జరిగింది. దీంతో, వరద ప్రభావిత ప్రాంతాన్ని ఆగష్టులో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సందర్శించి.. బాధితులను పరామర్శించారు. ఆ ఫొటోలను ఎక్స్ వేదికగా కంగనా పోస్ట్ చేసింది. ఆ ఫోటోలపై హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నేత జగత్ సింగ్ నేగి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
People have lost everything, in the vastness of that loss I feel immense pain and grief. pic.twitter.com/Mfh1Gg3YUq
— Kangana Ranaut (@KanganaTeam) August 6, 2024
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో