Kiren Rijiju: హిందువులు మెజారిటీ కాబట్టే, మైనారిటీలు సురక్షితంగా ఉన్నారు..
- భారతదేశం సెక్యులర్ దేశం, అందుకే మైనారిటీలు ఇష్టం..
- హిందువులు మెజారిటీ కాబట్టే, మైనారిటీలు సురక్షితం..
- కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiren Rijiju: భారతదేశం సెక్యులర్ దేశమని, ఈ దేశంలో మైనారిటీలు అత్యంత సురక్షితంగా ఉంటున్నారని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. హిందువులు మెజారిటీగా ఉండటం కారణంగానే మైనారిటీలు సంపూర్ణ స్వేచ్ఛ, రక్షణ పొందుతున్నారని చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో నుంచి ఒక్క మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి కూడా వలస వెళ్లడాన్ని నేను ఎప్పుడూ చూడలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, దాని వావపక్ష ఎకోసిస్టమ్ మైనారిటీలను చంపుతున్నారని, కొడుతున్నారని, దేశంలో వారు సురక్షితంగా లేరని నిరంతరం తప్పుడు ప్రచారాన్ని చేస్తుందని ఆరోపించారు. ఇలాంటి కథనాలు దేశానికి సాయం చేయవని ఆయన అన్నారు.
Read Also: Tirupati: భార్యను కిరాతకంగా హత్య చేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్న భర్త.. కారణం ఏంటి..?
Also Read
దేశంలో మైనారిటీ, మెజారిటీకి చెందిన వారెవరైనా కూడా చట్టం, రాజ్యాంగం ముందు అంతా సమానమే అని చెప్పారు. మెజారిటీ వర్గానికి ఏం లభిస్తుందో, మైనారిటీలకు కూడా అదే లభిస్తుందని తాను స్పష్టంగా చెప్పగలనని రిజిజు అన్నారు. కొన్ని సందర్భాల్లో మైనారిటీలకే కొన్ని విషయాలు లభిస్తాయని, మెజారిటీలకు లభించవని చెప్పారు. టిబెట్, మయన్మార్, శ్రీలంక, బంగ్లాదేశ్లో మైనారిటీలపై హింస జరిగినప్పుడు వారంతా భారత్పై నమ్మకంతో ఇక్కడి వచ్చి ఆశ్రయం పొందాలని కోరుకుంటారని అన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో ప్రతీ గిరిజన సమూహం, మైనారిటీలు తమ సొంత దేశంలోనే అన్యాయాలకు గురవుతున్నారని, కానీ దేశంలో హిందూ సమాజంలో లౌకిక స్వభావం సహనాన్ని కలిగి ఉందని చెప్పారు. అందుకే భారత్ ప్రతీ మైనారిటీ సమాజానికి ఇష్టమయ్యే ప్రాంతమని చెప్పారు.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
WhatsApp: మెటాకు కేంద్రం షాక్.. కొత్త ఫీచర్ నిలిపివేయాలని ఆదేశం
-
Blood Sugar Test Timing: తిన్న ఎంతసేపటి తర్వాత షుగర్ చెక్ చేయాలి? చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే!
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Sanae Takaichi: ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
ట్రెండింగ్
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!