Tirupati: భార్యను కిరాతకంగా హత్య చేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్న భర్త.. కారణం ఏంటి..?
- మంగళం బొమ్మల క్వార్టర్స్లో జరిగిందీ ఘటన
- ఉషకు లోకేశ్వర్తో 15 ఏళ్ల క్రితం
- ఉష, లోకేశ్వర్ దంపతులకు ఇద్దరు పిల్లలు
- కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు
- ఉషపై అనుమానంతో లోకేశ్వర్ తరచూ గొడవ
- మద్యం మత్తులో ఉషను వేధించేవాడు
- జల్సాలకు డబ్బులు కావాలని వేధింపులు
- కొంతకాలం నుంచి తల్లిదండ్రులతో ఉంటున్న ఉష
- కేసు సంబంధించి 24వ తేదీన విచారణ
- కంపెనీ బస్సు కోసం వెళుతుండగా కత్తివేటు
- కత్తితో ఉష గొంతు కోసి వెళ్లిపోయిన లోకేశ్వర్
- ఇంటికి వెళ్లి ఉరేసుకుని చనిపోయిన లోకేశ్వర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనుమానం పెనుభూతమైంది. దీంతో భార్యను అతి కిరాతకంగా చంపేశాడు ఓ భర్త. తిరుపతి మంగళం బొమ్మల క్వార్టర్స్ లో జరిగిన ఘటన కలకలం సృష్టించింది. ఆ తర్వాత అతడు కూడా ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో పిల్లలు అనాథలయ్యారు. బొమ్మల క్వార్టర్స్కు చెందిన ఉషకు.. గంగాధర నెల్లూరు మండలం ఠాణాకు చెందిన లోకేశ్వర్తో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరూ సమీప బంధువులు. ఉషా, లోకేశ్వర్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదట్లో కాపురం సజావుగానే కొనసాగింది. ఐతే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి.
READ MORE: AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్లో 40 మంది నిందితులు.. మొత్తం లిస్ట్ ఇదే..
Also Read
- Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
ఉష కరకంబాడిలోని అమర రాజా ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. BSNLలో కాంట్రాక్ట్ కింద టెక్నీషియన్గా పని చేస్తున్న లోకేశ్వర్ భార్యతో నిత్యం గొడవ పెట్టుకుంటున్నాడు. ఉషపై అనుమానంతో లోకేశ్వర్ తరచూ గొడవపడుతుండడంతో భరించలేక పోయింది. పెళ్లి జరిగినప్పటి నుంచి మద్యం మత్తులో ఉషను వేధించేవాడు భర్త లోకేశ్వర్. ఏ పని చేయకుండా జల్సాలకు డబ్బులు కావాలని తరచూ భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. అతని వేధింపులు, అనుమానం భరించలేక కొంతకాలం క్రితం ఉష ఇంటి నుంచి వెళ్లిపోయి తన తల్లితండ్రులతో ఉంటోంది.
READ MORE: MP Mithun Reddy Arrested: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్రెడ్డి అరెస్ట్..
ఆ తర్వాత భర్తతో విడిపోవాలని కోర్టును ఆశ్రయించింది. అయినా లోకేష్ వేధింపులు ఎక్కువ కావడంతో స్థానిక దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఉష. ఈ కేసు సంబంధించి 24వ తేదీన విచారణ ఉంది. దీంతో ఉషను హత్య చేయాలని భావించిన లోకేష్ పక్కా ప్లాన్ వేశాడు. ఉదయం 5 గంటల సమయంలో డ్యూటీకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఉష.. కంపెనీ బస్సు కోసం వెళుతుండగా.. భర్త లోకేశ్వర్ అకస్మాత్తుగా ఆమెపై దాడి చేశాడు. కత్తితో దాడి చేసి చంపాడు. అప్పటివరకు మాటు వేసి భార్య రాక కోసం వెయిట్ చేసిన లోకేశ్వర్.. ఉషను వెంబడించి కత్తితో గొంతు కోసి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఉష చనిపోయిన తరువాత.. నేరుగా ఇంటికి వెళ్లి తాడుతో ఉరివేసుకొని లోకేశ్వర్ కూడా సూసైడ్ చేసుకున్నాడు.. ఇలా ఉష హత్యకు గురికాగా.. లోకేశ్వర్ ఆత్మహత్య చేసుకోని ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో పిల్లలు మాత్రం అనాథలుగా మిగిలిపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తిరుచానూరు పోలీసులు డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఆమె సంపాదన కోసం నిత్యం నరకం చూపించేవాడని.. ప్రతి చిన్న విషయానికి అనుమానంతో వేధించేవాడని ఉష తండ్రి అవేదన వ్యక్తం చేశాడు. విడాకుల వరకు వచ్చిన భార్యాభర్తలు ఇద్దరికి సర్దిచెప్పి సంసారం నిలబెట్టాలనుకున్నామని, అయితే ఇలాంటి ఘాతుకానికి పాల్పడుతాడని ఊహించలేదని ఆ తండ్రి కన్నీటిపర్యంతమయ్యారు.
తాజావార్తలు
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
-
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
-
Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!