Kerala Neet Exam Issue: నీట్ వివాదం.. ఐదుగురు అరెస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పరీక్ష రాయడానికి వెళ్లిన వారిని చెక్ చేసి పరీక్ష రాసేందుకు లోనికి అనుమతించడం ఏ పాఠశాలఅయినా చేయాల్సిన పని అదిరూల్. కానీ కొల్లాం జిల్లా ఆయుర్లోని మార్థోమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పాఠశాల యాజమాన్యం చేసిన పని దేశంలోనే సంచలనంగా మారింది. సభ్య సమాజం సిగ్గు పడేలా చేసింది. జూలై ఆదివారం (17న) జరిగిన నీట్ పరీక్షలో విధ్యార్థినులపై దారుణంగా ప్రవర్తించింది. నీట్ విధ్యార్థినులను చెక్ చేయడమే కాకుండా లోదుస్తులు (బ్రా)ను తీసేయాలని పేర్కొంది. దీంతో విధ్యార్థులు షాక్ తిన్నారు. లోదుస్తులు ఎందుకు తీయాలని ప్రశ్నించగా.. తీస్తేనే పరీక్ష రాసేందుకు అనుమతిస్తామనడంతో.. గత్యంతరం లేక లోదుస్తులను తీసి పరీక్ష రాసేందు లోనికి వెళ్ళాల్సి వచ్చింది. అయితే పరీక రాసేప్పుడు విధ్యార్థినులు తమ కురులను ముందుకు వేసుకుని రాయాల్సి వచ్చింది. మరి కొందరు విద్యార్థులైతే కన్నీటితో పరీక్షను రాసారు. పరీక్ష రాసి బయటకు వచ్చిన విద్యార్థినులు తల్లిదండ్రులను ఈ విషయం తెలుపడంతో.. ఇదికాస్త వివాదాస్పదమైన నేపథ్యంలో.. నేషన్ టెస్టింగ్ ఏజెన్సీ చర్యలకు ఉపక్రమించింది. వివిధ మీడియా కథనాల ద్వారా తమకు సమాచారం అందిందని, ఈనేపథ్యంలో.. కమిటీ ఏర్పాటు చేసినట్లు, కమిటీ సభ్యులు కొల్లంను సదంర్శించి నివేదిక రూపొందిస్తారని, దాని ఆధారంగా తుది చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యాశాఖ తెలిపింది.
read also: Godavari Floods: వరద కష్టం పోయింది.. బురద కష్టం మిగిలింది..
Also Read
- CM Vijay: సీఎం విజయ్ చేతిలో విరాట్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫొటో..
- Abhijit Dipke: "నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు".. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
- Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
- CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
కాగా.. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని కాళాశాల యాజమాన్యం వివరణ ఇచ్చింది. బయోమెట్రిక్ తనిఖీలు చేసి బాధ్యత ఏజెన్సీ లదేనని తెలిపింది. అయితే ఇది ఇలా వుండగా ఆదివారం పరీక్ష పూర్తయిన అనంతరం పెద్దమొత్తంలో లోదుస్తులను ఓఅట్టపెట్టెలో కళాశాల సిబ్బంది బయటకు పెడేసినట్లు కొందరు విద్యార్థులు తెలిపారు. అయితే ఈ ఘటనపై కేరళ విద్యాశాఖామంత్రి ఆర్ బిందు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఈ పరీక్ష మార్గదర్శకాలను సమీక్షించాలని కోరుతూ కేరళ ఎంపీ ఎన్కే ప్రేమచంద్రన్ కు డిమాండ్ చేస్తూ ఆర్ బిందు లేఖ రాసారు. అయితే లోక్ సభలో కూడా దీనిపై చర్చ జరపాలని తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. కాగా.. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఐదుగురు మహిళలను అరెస్ట్ చేసినట్లు , వీరంతా పరీక్ష జరిగిన రోజున కళాశాలలో విధులు నిర్వర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.
AndhraPradesh Woman: మానవ సేవే “మాధవి” సేవ. అంతిమ ‘సంస్కారం’ చూపుతున్న ఆంధ్రప్రదేశ్ మహిళ
తాజావార్తలు
-
Navratna Pulao Recipe: వేసవిలో స్పెషల్ లంచ్.. పప్పు, అన్నానికి వీడ్కోలు.. నవరత్న పులావ్ ట్రై చేయండి..
-
China Mine Disaster: ఘోర విషాదం.. బొగ్గు గనిలో పేలుడు.. 80 మంది మృతి
-
Nagarjuna: “మనం” నా జీవితంలో మరచిపోలేని సినిమా.. నాగార్జున ఎమోషనల్
-
Virat Kohli World Record: SRH మ్యాచ్లో విఫలమైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
-
Takshaka : వశిష్ట తమ్ముడి డైరెక్షన్లో ‘తక్షక’
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!