Kejriwal: వృద్ధులపై కేజ్రీవాల్ వరాల జల్లు.. అన్ని ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం
- వృద్ధులపై కేజ్రీవాల్ వరాల జల్లు
- అన్ని ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త సంవత్సరంలో దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. త్వరలో ఓటర్ల తుది జాబితాను ప్రకటించనుంది. అనంతరం గంటల వ్యవధిలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. ఇక సమయం ఎంతో లేకపోవడంతో ప్రధాన పార్టీలు సన్నద్ధమైపోతున్నాయి. ఇప్పటికే అధికార ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను ప్రకటించేసింది. ఇక బీజేపీ కూడా కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. అలాగే కాంగ్రెస్ కూడా ప్రిపరేషన్ మొదలు పెట్టింది. ఇలా మూడు ప్రధాన పార్టీలు.. నువ్వానేనా? అన్నట్టుగా తలపడబోతున్నాయి.
ఇదిలా ఉంటే ఇటీవలే మహిళలపై మాజీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ వరాలు జల్లు కురిపించారు. అధికారంలోకి రాగానే మహిళలకు నెలకు రూ.2,100 అందిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా బుధవారం కూడా వృద్ధులకు తీపికబురు అందించారు. 60 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లకు అన్ని ఆస్పత్రుల్లో (ప్రైవేటు, ప్రభుత్వ) ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ ఉచిత వైద్యం అందించేలా ‘సంజీవని యోజన’ అమలు చేస్తామని వెల్లడించారు. వయో వృద్ధుల సంరక్షణ బాధ్యత తమదేనన్నారు. మీరెంతో కష్టపడి పనిచేసి దేశాన్ని ముందుకు తీసుకొచ్చారని వృద్ధులను గూర్చి తెలిపారు.
Also Read
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
- Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
వృద్ధులు అనారోగ్యానికి గురైతే చికిత్సకు అయ్యే ఖర్చుకు గరిష్ఠ పరిమితి ఏమీ ఉండదని కేజ్రీవాల్ వెల్లడించారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మొదలవుతుందని.. ఆప్ కార్యకర్తలే ఇళ్లకు వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పారు. వాలంటీర్లు ఇచ్చే కార్డును జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. వచ్చే ఏడాది తిరిగి అధికారంలోకి రాగానే.. ఉచిత చికిత్స విధానాన్ని అమలు చేస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
ప్రస్తుత ఢిల్లీ ప్రభుత్వ కాలం.. ఫిబ్రవరి, 2025తో ముగుస్తుంది. దీంతో జనవరిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగొచ్చని తెలుస్తోంది. జనవరి 6న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ఈసీ ప్రకటించింది. అనంతరం ఎన్నికల షెడ్యూల్ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఇప్పటికే ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆప్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. న్యూఢిల్లీ స్థానం నుంచి కేజ్రీవాల్, ముఖ్యమంత్రి అతిషి కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
ఇది కూాడా చదవండి: Prasad Behara: నటి బ్యాక్ టచ్ చేసిన నటుడు ప్రసాద్ బెహరా అరెస్ట్.. రిమాండ్!
ఇది కూాడా చదవండి: TG TET: తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల
తాజావార్తలు
-
Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
-
Varalaxmi Sarathkumar: హీరోయిన్ వరలక్ష్మికి ‘పోలీస్ కంప్లైంట్’ డైరెక్టర్ బహిరంగ క్షమాపణ
-
ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్లు.. షెడ్యూల్ ఖరారు..
-
AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
-
Dravid: ద్రవిడ్ వారసుడు వచ్చేస్తున్నాడు.. అండర్-19 జట్టుకు ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కుమారుడు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!