Kejriwal: వృద్ధులపై కేజ్రీవాల్ వరాల జల్లు.. అన్ని ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం
- వృద్ధులపై కేజ్రీవాల్ వరాల జల్లు
- అన్ని ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త సంవత్సరంలో దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. త్వరలో ఓటర్ల తుది జాబితాను ప్రకటించనుంది. అనంతరం గంటల వ్యవధిలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. ఇక సమయం ఎంతో లేకపోవడంతో ప్రధాన పార్టీలు సన్నద్ధమైపోతున్నాయి. ఇప్పటికే అధికార ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను ప్రకటించేసింది. ఇక బీజేపీ కూడా కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. అలాగే కాంగ్రెస్ కూడా ప్రిపరేషన్ మొదలు పెట్టింది. ఇలా మూడు ప్రధాన పార్టీలు.. నువ్వానేనా? అన్నట్టుగా తలపడబోతున్నాయి.
ఇదిలా ఉంటే ఇటీవలే మహిళలపై మాజీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ వరాలు జల్లు కురిపించారు. అధికారంలోకి రాగానే మహిళలకు నెలకు రూ.2,100 అందిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా బుధవారం కూడా వృద్ధులకు తీపికబురు అందించారు. 60 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లకు అన్ని ఆస్పత్రుల్లో (ప్రైవేటు, ప్రభుత్వ) ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ ఉచిత వైద్యం అందించేలా ‘సంజీవని యోజన’ అమలు చేస్తామని వెల్లడించారు. వయో వృద్ధుల సంరక్షణ బాధ్యత తమదేనన్నారు. మీరెంతో కష్టపడి పనిచేసి దేశాన్ని ముందుకు తీసుకొచ్చారని వృద్ధులను గూర్చి తెలిపారు.
Also Read
- Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
- Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
- Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
వృద్ధులు అనారోగ్యానికి గురైతే చికిత్సకు అయ్యే ఖర్చుకు గరిష్ఠ పరిమితి ఏమీ ఉండదని కేజ్రీవాల్ వెల్లడించారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మొదలవుతుందని.. ఆప్ కార్యకర్తలే ఇళ్లకు వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పారు. వాలంటీర్లు ఇచ్చే కార్డును జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. వచ్చే ఏడాది తిరిగి అధికారంలోకి రాగానే.. ఉచిత చికిత్స విధానాన్ని అమలు చేస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
ప్రస్తుత ఢిల్లీ ప్రభుత్వ కాలం.. ఫిబ్రవరి, 2025తో ముగుస్తుంది. దీంతో జనవరిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగొచ్చని తెలుస్తోంది. జనవరి 6న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ఈసీ ప్రకటించింది. అనంతరం ఎన్నికల షెడ్యూల్ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఇప్పటికే ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆప్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. న్యూఢిల్లీ స్థానం నుంచి కేజ్రీవాల్, ముఖ్యమంత్రి అతిషి కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
ఇది కూాడా చదవండి: Prasad Behara: నటి బ్యాక్ టచ్ చేసిన నటుడు ప్రసాద్ బెహరా అరెస్ట్.. రిమాండ్!
ఇది కూాడా చదవండి: TG TET: తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల
తాజావార్తలు
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
-
Khadgam Re Release: దేశభక్తి సినిమాలకే బాస్.. ‘ఖడ్గం’ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది!
-
FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
-
Tesla Kids Bike: పిల్లల కోసం టెస్లా కొత్త బ్యాలెన్స్ బైక్.. పెడల్స్, మోటార్ లేకుండానే సైక్లింగ్ నేర్పించే ప్రత్యేక డిజైన్
ట్రెండింగ్
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్