Sharad Pawar: కేసీఆర్ 600 కార్ల కాన్వాయ్తో మహారాష్ట్రకు రావడం ఆందోళకరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shrad Pawar: మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఇటీవల కాలంలో నాగ్ పూర్ నగరంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు ఔరంగాబాద్ వంటి తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయ పార్టీలో సీఎం కేసీఆర్ హాట్ టాపిక్ అయ్యారు. ఎన్సీపీ, శివసేన(ఉద్ధవ్) పార్టీలు బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పై పలు వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్నాయి.
ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ 600 కార్ల వాహన శ్రేణితో షోలాపూర్ వెళ్లారు. దీనిపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ బుధవారం స్పందించారు. కేసీఆర్ భారీ వాహనశ్రేణితో మహారాష్ట్ర పట్టణానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. భారత రాష్ట్ర సమితి విస్తరణ ప్రణాళికలలో భాగంగా మహారాష్ట్రలోని షోలాపూర్ కు వెళ్లారు. సార్కోలి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పండరీపూర్ లోని విఠల్-రుక్మిణి ఆలయాన్ని సందర్శించారు. ఏకంగా 600 కార్లతో ర్యాలీగా వెళ్లడం ఒక్కసారిగా మహారాష్ట్రలోని పలు పార్టీల నాయకుల దృష్టిని ఆకర్షించింది.
Also Read
- NEET Exam: "నాకు నీట్ కాదు, బురఖానే ముఖ్యం".. పరీక్ష రాయనన్న ముస్లిం విద్యార్థిని.
- PM Modi: నీట్ విద్యార్థుల కోసం ఎయిర్పోర్టులోనే ఆగిన ప్రధాని మోడీ..
- Uddhav Shiv sena: ముగింపుకు ఉద్ధవ్ సేన సంక్షోభం.. మీడియా ముందుకు తిరుగుబాటు ఎంపీలు..
- PM Modi: ప్రధాని మోడీ చేతుల మీదుగా.. భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ అగ్రయ్, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ దునగిరి
కేసీఆర్ వాహనాల సంఖ్య పరంగా పెద్ద బలాన్ని చూపించడం ఆందోళనకరమని అన్నారు. ఆయన రెండు రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి దృష్టిసారిస్తే బాగుండేదని శరద్ పవార్ అన్నారు. ఆసక్తికరంగా, సర్కోలి గ్రామంలో కేసీఆర్ నిర్వహించిన కార్యక్రమంలో శరద్ పవార్ పార్టీకి చెందిన ఒక నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. ఎన్సీపీ నేత భగీరథ్ భేల్కే పార్టీలో చేరారు. ఈయన పండరీపూర్ అసెంబ్లీ స్థానంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్న దివంగత భరత్ భేల్కే కుమారుడు. అతని తండ్రి మరణంత తర్వాత ఉపఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థిగా భగీరథ్ పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి సమాధాన్ ఔతాడే చేతిలో ఓడిపోయారు.
మరోవైపు ఎన్సీపీ మిత్రపక్షమైన శివసేన(ఉద్ధవ్) తన సొంత పత్రిక అయిన సామ్నా ద్వారా కేసీఆర్ పై విమర్శలు గుప్పించింది. కేసీఆర్ తెలంగాణ, మహారాష్ట్రలో ఓడిపోతారని విమర్శించింది. మహారాష్ట్రలో రైతుల ఓట్లను అడుగుతూ.. బీజేపీకి సహాయపడేలా కనిపిస్తున్నారంటూ ఆరోపించింది. గతంలో శరద్ పవార్ కూడా బీజేపీ-బీ టీమ్ అంటూ కామెంట్స్ చేశారు.
- Tags
- bjp
- BRS
- cm kcr
- Maharashtra
- NCP
తాజావార్తలు
-
Anil Ravipudi: రక్త తిలకం దిద్దిన వెంకటేష్.. రాయలసీమ బ్యాక్డ్రాప్లో ‘అనిల్ మార్క్’ నవ్వుల వర్షం!
-
Harmanpreet Kaur: ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలి ప్లేయర్గా రికార్డు.. హర్మన్ప్రీత్ కౌర్ అరుదైన ఘటన..
-
NEET Exam: “నాకు నీట్ కాదు, బురఖానే ముఖ్యం”.. పరీక్ష రాయనన్న ముస్లిం విద్యార్థిని.
-
Spirit: చంచల్గూడ జైలులో ప్రభాస్.. ‘స్పిరిట్’ సరికొత్త అప్డేట్తో ఫ్యాన్స్కు పూనకాలే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్.. బోర్డుపై భారత్ స్కోర్ 900 పరుగులు..
ట్రెండింగ్
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!