Jammu Kashmir: ఇంటింటికి వెళ్లి నీరు అడిగిన ఉగ్రవాదులు.. కథువా ఎన్కౌంటర్లో ఇద్దరు హతం..
- కథువా ఎన్కౌంటర్లో మరో ఉగ్రవాది హతం..
- నిన్న సాయంత్రం నుంచి కొనసాగుతున్న ఆపరేషన్..
- రియాసి ఘటన జరిగి తర్వాత వరసగా ఉగ్రదాడులు..
- జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా విస్తృత గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ అట్టుడుకుతోంది. వరసగా ఉగ్రవాద ఘటనలతో ఆ ప్రాంతాలను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఆదివారం రియాసిలో బస్సుపై దాడి చేసిన ఘటనలో 10 మంది యాత్రికులు చనిపోయారు. ఇది మరవక ముందే కథువాలో మంగళవారం ఎన్కౌంటర్ ప్రారంభమైంది. కథువా జిల్లాలోని సైదా గ్రామంలో ఇద్దరు ఉగ్రవాదులు ఇంటింటికి వెళ్లి నీరు అడగటంతో అనుమానించిన గ్రామస్థులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎన్కౌంటర్ ప్రారంభమైంది.
Read Also: Prakash Dantuluri: ఎక్కువ చెబితే కిక్ పోతుంది.. కథను ఇబ్బంది పెట్టకూడదు: ఏవమ్ దర్శకుడి interview
Also Read
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
నిన్న సాయంత్రం భద్రతా అధికారులు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించాడు. బుధవారం మధ్యాహ్నం కతువాలోని సైదా గ్రామం సమీపంలో దాక్కున్న రెండో ఉగ్రవాదిని ఆర్మీ, పోలీసులతో కలిసి సీఆర్పీఎఫ్ హతమార్చింది. తెల్లవారుజామున 3 గంటలకు భద్రతా బలగాలపై కాల్పులు జరిపి తప్పించుకోవాలని ప్రయత్నించిన రెండో ఉగ్రవాది ఒక సీఆర్పీఎఫ్ జవాన్ని చంపాడు. హతమైన రెండో ఉగ్రవాది దగ్గర యూఎస్ తయారీ ఎం4 కార్బైన్ అసాల్ట్ రైఫిల్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు దోడాలో ఆర్మీ పోస్టుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఐదుగురు సైనికులు, ఎస్పీఓ గాయపడ్డారు.
అంతకుముందు, ఆదివారం రోజున జమ్మూలో కత్రా నుంచి శివఖోరీ ఆలయానికి యాత్రికులు వెళ్తున్న సమయంలో బస్సుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో బస్సు పక్కనే ఉన్న లోయలో పడిపోవడంతో 10 మంది మరణించారు. లష్కరే తోయిబా కమాండర్ అబు హమ్జా ఆదేశాల మేరకు ఈ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు అడవుల్లోకి పారిపోయారు. వీరి కోసం భద్రతా బలగాలకు చెందిన 11 టీంలు గాలింపు చేపడుతున్నాయి.
తాజావార్తలు
-
Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య… ఈసారి ఏమైందంటే ?
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Blaupunkt QLED TV: థియేటర్ లాంటి అనుభవం.. Google TV 5.0తో బ్లాపంక్ట్ కొత్త QLED స్మార్ట్ టీవీలు.. చౌక ధరకే
-
RC 17 : సుకుమార్ సినిమాలో చరణ్ ఇలా ఉంటాడా?
-
Arjun Tendulkar: అచ్చు తండ్రి మాదిరే.. అర్జున్ టెండూల్కర్ గొప్ప మనసు.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?