China Manja: వాహనదారులకు శాపంగా మారుతున్న చైనా మాంజా..
- పీకలు కోస్తున్న చైనా మాంజా
- ఏటా వందలాది మంది బలి
- వేలాది పక్షులు మృత్యువాత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరంలో చైనా మాంజా ఉపయోగంతో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. పతంగి ఎగరేసేందుకు వాడిన నిషేధిత చైనా మాంజా ద్విచక్ర వాహనదారుడి మెడకు చుట్టుకోవడంతో అతని మెడకు తీవ్రంగా గాయమైంది. ఈ ఘటనలో రక్తస్రావం అధికంగా కావడంతో గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు అతనిని కొత్తగూడెంలోని ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం తర్వాత హైదరాబాద్కి తరలించారు. యాదగిరిగుట్టలో చైనా మాంజా తగిలి వృద్ధ దంపతులు బైకు నుంచి కింద పడ్డారు. బాధితులకు గాయాలు కాగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
యువకుడి గొంతు కోసిన మాంజా..
వికారాబాద్కు చెందిన వెంకటేష్ బంధువులతో కలిసి ద్విచక్ర వాహనంపై సంగారెడ్డి జిల్లా కర్దనూరు రహదారి మీదగా శంకరపల్లి వైపు వెళుతున్నాడు. అదే సమయంలో గాలిపటం కోసం కట్టిన చైనా మాంజా అతని గొంతుకు తగిలి కోసుకుపోయింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు చూసి వెంటనే 108కు సమాచారం ఇవ్వడంతో బాధితుడిని పటాన్చెరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
Also Read
- jyotipoorvaj : పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తన అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?
- Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
డేంజార్ మాంజాతో 21ఏళ్ల యువకుడు బలి..
ఉత్తర్ ప్రదేశ్ మీరట్లో బైక్పై వెళ్తున్న 21 ఏళ్ల యువకుడి సుహైల్ మాంజా దారం కారణంగా మరణించాడు. రోడ్డుపై పడి ఉన్న మాంజా బైక్పై వెళ్తుండగా గొంతును కోసింది. రెండు చెట్ల మధ్య ఉన్న మాంజా దారం గొంతుని సగానికి పైగా కోసింది. దీంతో సుహైల్ బైక్ బోల్తా పడింది. వెనకాల కూర్చున్న సుహైల్ స్నేహితుడు నవాజీష్కి కూడా గాయాలయ్యాయి. దారం అతడి ముక్కుని కోసింది. ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సుహైల్ మరణించాడు.
పీకలు కోస్తు్న్న మాంజా..
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘటనలు.. ఏటా ఈ చైనా మాంజాతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాహనదారుల మెడలు కోస్తున్నాయి. పతంగుల మాంజా వల్ల పక్షుల మీద గాయాలు, మరణాలు మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. గాలిలో స్వేచ్ఛగా ఎగరే పక్షులు చైనా మాంజా తగిలి గాయపడటం అనివార్యం అవుతోంది. ఈ కారణంగా పక్షుల సంరక్షణకు ప్రాధాన్యత కల్పించి చైనా మాంజాను పూర్తిగా నిషేధించడంపై మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. క్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగరేసేవారు చైనా మాంజా వినియోగానికి దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఇటీవల ఈ పాత బస్తీలో భారీగా దాదాపు రూ.2 కోట్ల విలువైన చైనా మాంజా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కానీ.. ఇప్పటికే చాలా మంది ఈ మాంజాను కొనుగోలు చేశారు.
తాజావార్తలు
-
jyotipoorvaj : పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తన అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
-
Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
-
Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?
-
OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
-
Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!