China Manja: వాహనదారులకు శాపంగా మారుతున్న చైనా మాంజా..
- పీకలు కోస్తున్న చైనా మాంజా
- ఏటా వందలాది మంది బలి
- వేలాది పక్షులు మృత్యువాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరంలో చైనా మాంజా ఉపయోగంతో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. పతంగి ఎగరేసేందుకు వాడిన నిషేధిత చైనా మాంజా ద్విచక్ర వాహనదారుడి మెడకు చుట్టుకోవడంతో అతని మెడకు తీవ్రంగా గాయమైంది. ఈ ఘటనలో రక్తస్రావం అధికంగా కావడంతో గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు అతనిని కొత్తగూడెంలోని ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం తర్వాత హైదరాబాద్కి తరలించారు. యాదగిరిగుట్టలో చైనా మాంజా తగిలి వృద్ధ దంపతులు బైకు నుంచి కింద పడ్డారు. బాధితులకు గాయాలు కాగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
యువకుడి గొంతు కోసిన మాంజా..
వికారాబాద్కు చెందిన వెంకటేష్ బంధువులతో కలిసి ద్విచక్ర వాహనంపై సంగారెడ్డి జిల్లా కర్దనూరు రహదారి మీదగా శంకరపల్లి వైపు వెళుతున్నాడు. అదే సమయంలో గాలిపటం కోసం కట్టిన చైనా మాంజా అతని గొంతుకు తగిలి కోసుకుపోయింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు చూసి వెంటనే 108కు సమాచారం ఇవ్వడంతో బాధితుడిని పటాన్చెరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
- Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
- YS Jagan: వైసీపీ ముఖ్య నేతలతో నేడు జగన్ కీలక భేటీ.. అజెండాలో కీలక అంశాలు
- 8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
డేంజార్ మాంజాతో 21ఏళ్ల యువకుడు బలి..
ఉత్తర్ ప్రదేశ్ మీరట్లో బైక్పై వెళ్తున్న 21 ఏళ్ల యువకుడి సుహైల్ మాంజా దారం కారణంగా మరణించాడు. రోడ్డుపై పడి ఉన్న మాంజా బైక్పై వెళ్తుండగా గొంతును కోసింది. రెండు చెట్ల మధ్య ఉన్న మాంజా దారం గొంతుని సగానికి పైగా కోసింది. దీంతో సుహైల్ బైక్ బోల్తా పడింది. వెనకాల కూర్చున్న సుహైల్ స్నేహితుడు నవాజీష్కి కూడా గాయాలయ్యాయి. దారం అతడి ముక్కుని కోసింది. ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సుహైల్ మరణించాడు.
పీకలు కోస్తు్న్న మాంజా..
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘటనలు.. ఏటా ఈ చైనా మాంజాతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాహనదారుల మెడలు కోస్తున్నాయి. పతంగుల మాంజా వల్ల పక్షుల మీద గాయాలు, మరణాలు మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. గాలిలో స్వేచ్ఛగా ఎగరే పక్షులు చైనా మాంజా తగిలి గాయపడటం అనివార్యం అవుతోంది. ఈ కారణంగా పక్షుల సంరక్షణకు ప్రాధాన్యత కల్పించి చైనా మాంజాను పూర్తిగా నిషేధించడంపై మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. క్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగరేసేవారు చైనా మాంజా వినియోగానికి దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఇటీవల ఈ పాత బస్తీలో భారీగా దాదాపు రూ.2 కోట్ల విలువైన చైనా మాంజా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కానీ.. ఇప్పటికే చాలా మంది ఈ మాంజాను కొనుగోలు చేశారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపారంలో డబ్బే డబ్బు!
-
Gandhari: తాప్సీ ‘గాంధారి’కి విడుదలకు ముందే షాక్.. కాపీ ఆరోపణలతో ముదిరిన వివాదం!
-
Rajni Autobiography : ఆత్మకథ రాస్తున్న రజనీ.. సినిమాగా తీస్తే అదొక అద్భుతమే
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!