Covid Scam: కర్ణాటకలో కోవిడ్ స్కాం.. సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..!
- కర్ణాటకలో బీజేపీ హయంలో కోవిడ్ స్కాం..
- కుంభకోణంపై ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
- అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid Scam: కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్-19 మహమ్మారి సమయంలో జరిగిన కుంభకోణంపై తీవ్ర వివాదం కొనసాగుతుంది. కోవిడ్ పరికరాలు, ఔషధాల కొనుగోలులో జరిగిన అవకతవకలపై విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగింది. దీనిపై క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.
Read Also: Heavy Rains: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనద్రోణి.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
కాగా, బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ)లోని నాలుగు జోన్లు, రాష్ట్రంలోని 31 జిల్లాల నుంచి కమిషన్ నివేదికలు కోరింది. సంబంధిత శాఖల నుంచి 55,000 ఫైళ్లను ధృవీకరించిన తర్వాత “పాక్షిక” నివేదికను ప్రభుత్వానికి సిట్ సమర్పించింది. రికవరీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, అవినీతికి పాల్పడిన సంస్థలను బ్లాక్ లిస్ట్ చేయాలని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ఇక, క్రిమినల్ ఎలిమెంట్ ఎక్కడ ఉన్నా సిట్ నిష్పక్షపాతంగా విచారణ చేస్తుందని మంత్రి హెచ్కె పాటిల్ చెప్పుకొచ్చారు. అయితే, 11 పేజీలతో కూడిన నివేదికను ఆగస్టు 31న సమర్పించినట్లు తెలిపారు.. అందులో రూ. 7,223.64 కోట్ల స్కాం జరిగినట్లు చెప్పారు.
Read Also: Kanaka Durga Temple: మహిషాసురమర్ధినిగా కనకదుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
అయితే, అవకతవకలకు సంబంధించి సంబంధిత అధికారుల ద్వారా క్యాబినెట్ సబ్కమిటీకి సహకరిస్తుంది అని మంత్రి హెచ్కె పాటిల్ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 43 క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది.. మైనింగ్లో అక్రమాలపై దర్యాప్తు చేయడానికి కర్ణాటక లోకాయుక్తలో ఏర్పాటు చేసిన సిట్ పదవీకాలాన్ని ఒక సంవత్సరం పొడిగించడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కర్ణాటక స్టేట్ మినరల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (KSMCL) మొత్తం పెట్టుబడితో ఒకలిపురంలో సెరీకల్చర్ శాఖకు చెందిన 4.25 ఎకరాల భూమిలో రూ. 527.50 కోట్ల అంచనా వ్యయంతో “రేష్మే భవన” నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు చెప్పుకొచ్చారు. అలాగే, చిక్కబళ్లాపుర జిల్లాలోని శిడ్లఘట్టలో రూ. 200 కోట్ల అంచనా వ్యయంతో హైటెక్ కోకూన్ మార్కెట్ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది .
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!