Covid Scam: కర్ణాటకలో కోవిడ్ స్కాం.. సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..!
- కర్ణాటకలో బీజేపీ హయంలో కోవిడ్ స్కాం..
- కుంభకోణంపై ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
- అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid Scam: కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్-19 మహమ్మారి సమయంలో జరిగిన కుంభకోణంపై తీవ్ర వివాదం కొనసాగుతుంది. కోవిడ్ పరికరాలు, ఔషధాల కొనుగోలులో జరిగిన అవకతవకలపై విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగింది. దీనిపై క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.
Read Also: Heavy Rains: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనద్రోణి.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
కాగా, బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ)లోని నాలుగు జోన్లు, రాష్ట్రంలోని 31 జిల్లాల నుంచి కమిషన్ నివేదికలు కోరింది. సంబంధిత శాఖల నుంచి 55,000 ఫైళ్లను ధృవీకరించిన తర్వాత “పాక్షిక” నివేదికను ప్రభుత్వానికి సిట్ సమర్పించింది. రికవరీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, అవినీతికి పాల్పడిన సంస్థలను బ్లాక్ లిస్ట్ చేయాలని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ఇక, క్రిమినల్ ఎలిమెంట్ ఎక్కడ ఉన్నా సిట్ నిష్పక్షపాతంగా విచారణ చేస్తుందని మంత్రి హెచ్కె పాటిల్ చెప్పుకొచ్చారు. అయితే, 11 పేజీలతో కూడిన నివేదికను ఆగస్టు 31న సమర్పించినట్లు తెలిపారు.. అందులో రూ. 7,223.64 కోట్ల స్కాం జరిగినట్లు చెప్పారు.
Read Also: Kanaka Durga Temple: మహిషాసురమర్ధినిగా కనకదుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
అయితే, అవకతవకలకు సంబంధించి సంబంధిత అధికారుల ద్వారా క్యాబినెట్ సబ్కమిటీకి సహకరిస్తుంది అని మంత్రి హెచ్కె పాటిల్ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 43 క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది.. మైనింగ్లో అక్రమాలపై దర్యాప్తు చేయడానికి కర్ణాటక లోకాయుక్తలో ఏర్పాటు చేసిన సిట్ పదవీకాలాన్ని ఒక సంవత్సరం పొడిగించడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కర్ణాటక స్టేట్ మినరల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (KSMCL) మొత్తం పెట్టుబడితో ఒకలిపురంలో సెరీకల్చర్ శాఖకు చెందిన 4.25 ఎకరాల భూమిలో రూ. 527.50 కోట్ల అంచనా వ్యయంతో “రేష్మే భవన” నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు చెప్పుకొచ్చారు. అలాగే, చిక్కబళ్లాపుర జిల్లాలోని శిడ్లఘట్టలో రూ. 200 కోట్ల అంచనా వ్యయంతో హైటెక్ కోకూన్ మార్కెట్ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది .
తాజావార్తలు
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
-
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..