Supreme court: సుప్రీంకు ఇద్దరు కొత్త జడ్జీలు.. తొలిసారి మణిపూర్ నుంచి నియామకం
- సుప్రీంకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జీలు
- తొలిసారి మణిపూర్ నుంచి నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ సర్వోన్నత న్యాయస్థానానికి కొత్తగా ఇద్దరు జడ్జీల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ నియామకాలను న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్లో పోస్టు చేశారు. జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్ మహదేవన్ను కేంద్రం నియమించింది. దీంతో ఇప్పుడు సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్తో సహా 34 మంది అయ్యారు. ఈ ఇద్దరు న్యాయమూర్తులు పదోన్నతిని సుప్రీంకోర్టు కొలీజియం గతంలో సిఫారసు చేసింది.
ఇది కూడా చదవండి: SIIMA 2024: సైమా 2024.. దసరా vs హాయ్ నాన్న.. నానితో నానికే పోటీ!
Also Read
- NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ మణిపూర్ నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన మొదటి న్యాయమూర్తిగా నిలిచారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. జస్టిస్ కోటీశ్వర్ సింగ్ మణిపూర్ మొదటి అడ్వకేట్ జనరల్ ఎన్ ఇబోటోంబి సింగ్ కుమారుడు. ఢిల్లీ యూనివర్శిటీలోని కిరోరి మాల్ కాలేజ్ మరియు క్యాంపస్ లా సెంటర్లో పూర్వ విద్యార్థి. 1986లో న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించారు. న్యాయమూర్తి కాకముందు మణిపూర్ అడ్వకేట్ జనరల్గా కూడా పనిచేశారు. అనంతరం గౌహతి హైకోర్టు మరియు మణిపూర్ హైకోర్టులలో పనిచేశారు.
ఇది కూడా చదవండి: Crime News: యువతిని కిడ్నాప్ చేసి వేళ్లు, గొంతు కోసి హత్య..
ఇక జస్టిస్ మహదేవన్ ప్రస్తుతం మద్రాసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. చెన్నైలో జన్మించిన జస్టిస్ మహదేవన్ మద్రాసు న్యాయ కళాశాల పూర్వ విద్యార్థి. న్యాయవాదిగా 9,000 కేసులకు పైగా డీల్ చేశారు. తమిళనాడు ప్రభుత్వానికి అదనపు గవర్నమెంట్ ప్లీడర్ (పన్నులు), అదనపు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్ మరియు మద్రాసు హైకోర్టులో భారత ప్రభుత్వానికి సీనియర్ ప్యానెల్ న్యాయవాదిగా కూడా పనిచేశారు. 2013లో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
In exercise of the powers conferred by the Constitution of India, Hon’ble President, after consultation with Hon’ble Chief Justice of India, is pleased to appoint the following as
Supreme Court Judges:- pic.twitter.com/OWQ9iGIooG— Arjun Ram Meghwal (@arjunrammeghwal) July 16, 2024
తాజావార్తలు
-
Apple: ఆపిల్ ‘బ్యాక్ టు స్కూల్’ సేల్ ప్రారంభం.. మ్యాక్బుక్, ఐప్యాడ్లపై భారీ డిస్కౌంట్లు.. ఫ్రీగా AirPods, Apple Pencil
-
Volvo EX90: వోల్వో EX90 ఎలక్ట్రిక్ SUV.. 602KM రేంజ్, 5-స్టార్ సేఫ్టీ, లగ్జరీ ఫీచర్లతో రానున్న ఫ్లాగ్షిప్ EV
-
Akshay Kumar : ‘వెల్కమ్ టుది జంగిల్’ థియేటర్లలో ఉండగానే మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అక్షయ్ కుమార్
-
Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
-
Ather: ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్ కు రెడీ.. కొత్త EL ప్లాట్ఫామ్, స్మార్ట్ ఫీచర్లు
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!