Crime News: యువతిని కిడ్నాప్ చేసి వేళ్లు, గొంతు కోసి హత్య..
- ఉత్తరప్రదేశ్లోని బరేలీలో దారుణ ఘటన
- ఓ యువతిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య
- మృతి చెందిన యువతి లక్ష్మి (22)గా గుర్తింపు
- ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని బరేలీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ యువతిని కిడ్నాప్ చేసి ఆపై దారుణంగా హత్య చేశారు. రాత్రి స్కూటర్పై ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటన బరేలీలోని హఫీజ్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతి చెందిన యువతిని లక్ష్మి (22)గా గుర్తించారు.
Read Also: Andhra Pradesh: జీపీఎస్ జీవో, గెజిట్ వెనక్కి తీసుకోవడంపై ఉద్యోగుల హర్షం
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
వివరాల్లోకి వెళ్తే.. సర్దార్ నగర్ గ్రామానికి చెందిన యువతి లక్ష్మి తన కజిన్ సోదరి సప్నాతో కలిసి స్కూటీపై షాపింగ్కు వెళ్లింది. అక్కడ పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా.. హఫీజ్గంజ్ ప్రాంతంలోని పిలిభిత్ హైవేపై తమ స్కూటర్ దగ్గర ఓ కారు ఆగిందని మృతురాలి సోదరి సప్నా చెప్పింది. ఆ కారులో వ్యాపారవేత్త మోను గుప్తా, అతని భార్య కారులో ఉన్నట్లు తెలిపారు. అయితే తన స్కూటీపై ఉన్న లక్ష్మిని వ్యాపారవేత్త కారులో ఎక్కించుకున్నాడు. లక్ష్మి కూడా సప్నతో కొంచెం సేపు వేయిట్ చేయి.. త్వరగా వస్తాను అని చెప్పి వెళ్ళిపోయిందని సప్నా చెప్పింది.
Read Also: CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం భేటీ.. కీలక ఆదేశాలు
ఎంతసేపటికి లక్ష్మి తిరిగి రాకపోవడంతో సప్న కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. రాత్రంతా లక్ష్మి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తీరా చూస్తే.. తెల్లవారుజామున యువతి మృతదేహం రోడ్డుపై కనిపించింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం.. నిందితుడు వ్యాపారవేత్త మోను గుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. యువతి మృతదేహంపై గొంతు కోసి ఉంది.. తన వేళ్లు కట్ చేసినట్లుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తన కూతురు చనిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు. తన కూతురిని హత్య చేసిన వారిని తీవ్రంగా శిక్షించాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!