Crime News: యువతిని కిడ్నాప్ చేసి వేళ్లు, గొంతు కోసి హత్య..
- ఉత్తరప్రదేశ్లోని బరేలీలో దారుణ ఘటన
- ఓ యువతిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య
- మృతి చెందిన యువతి లక్ష్మి (22)గా గుర్తింపు
- ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని బరేలీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ యువతిని కిడ్నాప్ చేసి ఆపై దారుణంగా హత్య చేశారు. రాత్రి స్కూటర్పై ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటన బరేలీలోని హఫీజ్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతి చెందిన యువతిని లక్ష్మి (22)గా గుర్తించారు.
Read Also: Andhra Pradesh: జీపీఎస్ జీవో, గెజిట్ వెనక్కి తీసుకోవడంపై ఉద్యోగుల హర్షం
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
వివరాల్లోకి వెళ్తే.. సర్దార్ నగర్ గ్రామానికి చెందిన యువతి లక్ష్మి తన కజిన్ సోదరి సప్నాతో కలిసి స్కూటీపై షాపింగ్కు వెళ్లింది. అక్కడ పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా.. హఫీజ్గంజ్ ప్రాంతంలోని పిలిభిత్ హైవేపై తమ స్కూటర్ దగ్గర ఓ కారు ఆగిందని మృతురాలి సోదరి సప్నా చెప్పింది. ఆ కారులో వ్యాపారవేత్త మోను గుప్తా, అతని భార్య కారులో ఉన్నట్లు తెలిపారు. అయితే తన స్కూటీపై ఉన్న లక్ష్మిని వ్యాపారవేత్త కారులో ఎక్కించుకున్నాడు. లక్ష్మి కూడా సప్నతో కొంచెం సేపు వేయిట్ చేయి.. త్వరగా వస్తాను అని చెప్పి వెళ్ళిపోయిందని సప్నా చెప్పింది.
Read Also: CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం భేటీ.. కీలక ఆదేశాలు
ఎంతసేపటికి లక్ష్మి తిరిగి రాకపోవడంతో సప్న కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. రాత్రంతా లక్ష్మి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తీరా చూస్తే.. తెల్లవారుజామున యువతి మృతదేహం రోడ్డుపై కనిపించింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం.. నిందితుడు వ్యాపారవేత్త మోను గుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. యువతి మృతదేహంపై గొంతు కోసి ఉంది.. తన వేళ్లు కట్ చేసినట్లుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తన కూతురు చనిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు. తన కూతురిని హత్య చేసిన వారిని తీవ్రంగా శిక్షించాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!