Crime News: యువతిని కిడ్నాప్ చేసి వేళ్లు, గొంతు కోసి హత్య..
- ఉత్తరప్రదేశ్లోని బరేలీలో దారుణ ఘటన
- ఓ యువతిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య
- మృతి చెందిన యువతి లక్ష్మి (22)గా గుర్తింపు
- ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని బరేలీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ యువతిని కిడ్నాప్ చేసి ఆపై దారుణంగా హత్య చేశారు. రాత్రి స్కూటర్పై ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటన బరేలీలోని హఫీజ్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతి చెందిన యువతిని లక్ష్మి (22)గా గుర్తించారు.
Read Also: Andhra Pradesh: జీపీఎస్ జీవో, గెజిట్ వెనక్కి తీసుకోవడంపై ఉద్యోగుల హర్షం
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
వివరాల్లోకి వెళ్తే.. సర్దార్ నగర్ గ్రామానికి చెందిన యువతి లక్ష్మి తన కజిన్ సోదరి సప్నాతో కలిసి స్కూటీపై షాపింగ్కు వెళ్లింది. అక్కడ పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా.. హఫీజ్గంజ్ ప్రాంతంలోని పిలిభిత్ హైవేపై తమ స్కూటర్ దగ్గర ఓ కారు ఆగిందని మృతురాలి సోదరి సప్నా చెప్పింది. ఆ కారులో వ్యాపారవేత్త మోను గుప్తా, అతని భార్య కారులో ఉన్నట్లు తెలిపారు. అయితే తన స్కూటీపై ఉన్న లక్ష్మిని వ్యాపారవేత్త కారులో ఎక్కించుకున్నాడు. లక్ష్మి కూడా సప్నతో కొంచెం సేపు వేయిట్ చేయి.. త్వరగా వస్తాను అని చెప్పి వెళ్ళిపోయిందని సప్నా చెప్పింది.
Read Also: CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం భేటీ.. కీలక ఆదేశాలు
ఎంతసేపటికి లక్ష్మి తిరిగి రాకపోవడంతో సప్న కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. రాత్రంతా లక్ష్మి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తీరా చూస్తే.. తెల్లవారుజామున యువతి మృతదేహం రోడ్డుపై కనిపించింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం.. నిందితుడు వ్యాపారవేత్త మోను గుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. యువతి మృతదేహంపై గొంతు కోసి ఉంది.. తన వేళ్లు కట్ చేసినట్లుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తన కూతురు చనిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు. తన కూతురిని హత్య చేసిన వారిని తీవ్రంగా శిక్షించాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..