Jammu Kashmir: కాశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు హిజ్బుల్ ఉగ్రవాదుల హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2 Hizbul Terrorists Killed In Encounter in jammu kashmir: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులపై భద్రతా బలగాలు పైచేయి సాధించాయి. మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు కీలక ఉగ్రవాదులను హతమార్చాయి భద్రతా బలగాలు. అనంత్ నాగ్ జిల్లాలోని పోష్కేరీలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు హిజ్బుల్ ముజాహీద్దీన్ ఉగ్రవాదులు హతమయ్యారని కాశ్మీర్ పోలీసులు వెల్డించారు. పోష్కేరీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న తరుణంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది.
హతమైన ఉగ్రవాదులను డానిష్ భట్ అలియాస్ కోకబ్ దూరీ, బషరత్ నబీగా పోలీసులు గుర్తించారు. ఇద్దరూ హిజ్బుల్ ముజాహీద్దీన్ ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నారు. ఇద్దరూ ఎప్రిల్ 9, 2021లో సలీమ్ అనే సైనికుడిని హతమార్చారు. ఈ కేసులో వీరిద్దరు నిందితులుగా ఉన్నారు. దీంతో పాటు మే 29,2021లో జబ్లీపురాలో ఇద్దరు పౌరులను చంపారని.. కాశ్మీర్ జోన్ డీజీపీ విజయ్ కుమార్ ట్వీట్ చేశారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
ఆర్టికల్ 370, 35ఏ రద్దైన తర్వాత నుంచి కాశ్మీర్ లో ఉగ్రవాదుల కార్యకలాపాలను తుడిచిపెట్టే ప్రయత్నాలు ప్రారంభించాయి భద్రతా బలగాలు. ఇందులో భాగంగానే అప్పటి నుంచి వరసగా ఉగ్రవాదుల ఏరివేత ప్రారంభం అయింది. అయితే లష్కరే తోయిబాతో పాటు హిజ్బుల్ ముజాహీద్దీన్ ఉగ్రవాద సంస్థలు క్రియాశీలకంగా ఉన్నాయి. లష్కరేకి అనుబంధంగా ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసి స్థానికేతరులు, పండిట్లు, హిందువులను టార్గెట్ చేసుకుని హత్యలు చేస్తున్నారు. గతంలో కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్, టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ తో పాటు రాజస్థాన్ కు చెందిన బ్యాంక్ మేనేజర్, మహిళా ఉపాధ్యాయురాలిని, స్థానికేతరులైన ప్రజలను కాల్చి చంపారు. అయితే ఈ ఘటనలకు పాల్పడిన వారిని భద్రతా బలగాలు వేటాడి వెంటాడి చంపాయి. అయితే కాశ్మీర్ లో ఏదో ఒక చర్యకు పాల్పడాలని ఉగ్రవాద సంస్థలు భావిస్తున్నాయి. అయితే భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు వీరి ప్రయత్నాలను భగ్నం చేస్తున్నాయి.
Killed #terrorists identified as Danish Bhat @ Kokab Duree & Basharat Nabi, both affiliated with proscribed #terror outfit HM. Both were involved in #killing of one TA personnel Saleem on 9 April 2021 & killing of two civilians on 29 May 2021 in #Jablipora: ADGP Kashmir https://t.co/zTINuBBeSG
— Kashmir Zone Police (@KashmirPolice) September 6, 2022
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!