Jammu Kashmir: కాశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు హిజ్బుల్ ఉగ్రవాదుల హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2 Hizbul Terrorists Killed In Encounter in jammu kashmir: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులపై భద్రతా బలగాలు పైచేయి సాధించాయి. మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు కీలక ఉగ్రవాదులను హతమార్చాయి భద్రతా బలగాలు. అనంత్ నాగ్ జిల్లాలోని పోష్కేరీలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు హిజ్బుల్ ముజాహీద్దీన్ ఉగ్రవాదులు హతమయ్యారని కాశ్మీర్ పోలీసులు వెల్డించారు. పోష్కేరీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న తరుణంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది.
హతమైన ఉగ్రవాదులను డానిష్ భట్ అలియాస్ కోకబ్ దూరీ, బషరత్ నబీగా పోలీసులు గుర్తించారు. ఇద్దరూ హిజ్బుల్ ముజాహీద్దీన్ ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నారు. ఇద్దరూ ఎప్రిల్ 9, 2021లో సలీమ్ అనే సైనికుడిని హతమార్చారు. ఈ కేసులో వీరిద్దరు నిందితులుగా ఉన్నారు. దీంతో పాటు మే 29,2021లో జబ్లీపురాలో ఇద్దరు పౌరులను చంపారని.. కాశ్మీర్ జోన్ డీజీపీ విజయ్ కుమార్ ట్వీట్ చేశారు.
Also Read
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
ఆర్టికల్ 370, 35ఏ రద్దైన తర్వాత నుంచి కాశ్మీర్ లో ఉగ్రవాదుల కార్యకలాపాలను తుడిచిపెట్టే ప్రయత్నాలు ప్రారంభించాయి భద్రతా బలగాలు. ఇందులో భాగంగానే అప్పటి నుంచి వరసగా ఉగ్రవాదుల ఏరివేత ప్రారంభం అయింది. అయితే లష్కరే తోయిబాతో పాటు హిజ్బుల్ ముజాహీద్దీన్ ఉగ్రవాద సంస్థలు క్రియాశీలకంగా ఉన్నాయి. లష్కరేకి అనుబంధంగా ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసి స్థానికేతరులు, పండిట్లు, హిందువులను టార్గెట్ చేసుకుని హత్యలు చేస్తున్నారు. గతంలో కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్, టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ తో పాటు రాజస్థాన్ కు చెందిన బ్యాంక్ మేనేజర్, మహిళా ఉపాధ్యాయురాలిని, స్థానికేతరులైన ప్రజలను కాల్చి చంపారు. అయితే ఈ ఘటనలకు పాల్పడిన వారిని భద్రతా బలగాలు వేటాడి వెంటాడి చంపాయి. అయితే కాశ్మీర్ లో ఏదో ఒక చర్యకు పాల్పడాలని ఉగ్రవాద సంస్థలు భావిస్తున్నాయి. అయితే భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు వీరి ప్రయత్నాలను భగ్నం చేస్తున్నాయి.
Killed #terrorists identified as Danish Bhat @ Kokab Duree & Basharat Nabi, both affiliated with proscribed #terror outfit HM. Both were involved in #killing of one TA personnel Saleem on 9 April 2021 & killing of two civilians on 29 May 2021 in #Jablipora: ADGP Kashmir https://t.co/zTINuBBeSG
— Kashmir Zone Police (@KashmirPolice) September 6, 2022
తాజావార్తలు
-
Red Magic Tablet 5 Pro: రెడ్ మ్యాజిక్ టాబ్లెట్ 5 ప్రో వచ్చేస్తోంది.. 8300mAh బ్యాటరీ, 185Hz OLED డిస్ప్లే
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
-
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
-
Sana Mir: వంటగదిలో రోటీలు చేసుకోండని పురుష క్రికెటర్లను అంటారా?.. ఈ లింగ వివక్ష ఎందుకు!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!