ఎన్నికలపై థర్డ్ వేవ్ ఎఫెక్ట్…!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వ తేదీ వరకు ఎన్నికలు జగరబోతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు సంబంధించిన షెడ్యూల్ను ఈరోజు సీఈసీ ప్రకటించింది. జనవరి 14 వ తేదీన ఐదు రాష్ట్రాలకు సంబంధించిన నోటిఫికేషన్ను రిలీజ్ చేయబోతున్నారు. షెడ్యూల్ను విడుదల చేయడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జనవరి 14 వరకు ఎలాంటి పాదయాత్రలు, ర్యాలీలు చేసేందుకు వీలు లేదని ఎన్నికల కమిషన్ పేర్కొన్నది. అదే విధంగా ఎన్నికల ప్రచారాన్ని రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు నిషేధం విధించింది. అయితే, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది. విజయోత్సవ ర్యాలీలను రద్దు చేసింది. గెలిచిన అభ్యర్థి వెంట ఇద్దరు మాత్రమే ఉండాలని అదేశించింది. కరోనా థర్డ్ వేవ్ దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఎన్నికల కమిషన్ తెలియజేసింది.
Read: ఐదు రాష్ట్రాల ఎన్నికలు: 7 దశల్లో పోలింగ్… మార్చి 10న కౌంటింగ్..
Also Read
అయితే, ఇండియాలో ఇప్పటికే థర్డ్వేవ్ మొదలైంది. థర్డ్ వేవ్ ప్రారంభంలోనే రోజుకు లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 15 మధ్య థర్డ్ వేవ్ పీక్స్లో ఉంటుందని ఐఐటి మద్రాస్ నిపుణుల సర్వేలో తేలింది. న్యూఇయర్ వేడుకలను అనుమతులు ఇవ్వడంతోనే కేసులు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక అభ్యర్థులు ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రచారం సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వ్యాప్తి చెందే అవకాశం లేకుండా ఉండదు. ఎన్నికల కారణంగా దేశంలో కరోనా కేసులు మరింతగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నాయి. ఎన్నికలపై థర్డ్ వేవ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. ఆర్ వ్యాల్యూ ఇప్పటికే దేశంలో 4 గా ఉన్నది. ఇది మరింత పెరిగితే డేంజర్ అని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!