PM Modi: రష్యాపై భారత వైఖరి ఏమిటో ప్రపంచానికి తెలుసు.. ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: రష్యాపై భారత వైఖరి స్పష్టంగా ఉందని, భారత వైఖరి ఏమిటో ప్రపంచానికి తెలుసు అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అమెరికా పర్యటనకు వెళ్తున్న సమయంలో వాల్ స్ట్రీట్ జర్నల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశం శాంతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో భారత్, రష్యా దేశానికి వ్యతిరేకంగా ఎందుకు ధృడమైన వైఖరి తీసుకోవడం లేదని అమెరికాలో వస్తున్న విమర్శలపై అడిగిన ప్రశ్నకు ప్రధాని స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మేము ఏ వైఖరి తీసుకోకుండా తటస్థంగా ఉందని అంటున్నారు, అయితే మేం తటస్థంగా లేము, మేం శాంతి పక్షాల ఉన్నామని మోడీ అన్నారు. అన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాలు, దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి, వివాదాలను చర్చలు, దౌత్య ప్రక్రియ ద్వారా పరిష్కరించుకోవాలని మోడీ స్పష్టం చేశారు.
Also Read
- Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
- UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
Read Also: PM Modi: చైనాతో సంబంధాలకు సరిహద్దుల్లో శాంతి అవసరం
భారత్-అమెరికా భాగస్వామ్యంపై మోడీ మాట్లాడుతూ..రెండు దేశాల మధ్య అపూర్వమైన నమ్మకం ఉందని, రెండు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారం, తమ భాగస్వామ్యానికి మూలస్తంభం అని, ఇది వాణిజ్యం, సాంకేతికత, శక్తికి కూడా విస్తరిస్తుందని ఆయన అన్నారు. వేలాది ఏళ్లుగా భారత్ అనేక మతాలు, విశ్వాసాలకు కేంద్రంగా ఉందని ఆయన అన్నారు.
మోడీ అమెరికా పర్యటన యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. రెండు దేశాల మధ్య బంధం మరింతగా బలపడుతుందని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా రక్షణ, సాంకేతికత రంగాల్లో ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదరనున్నాయి. ఇప్పటికే భారత్ ప్రిడిటర్ డ్రోన్ల కొనుగోలు ఒప్పందానికి పచ్చ జెండా ఊపిన సంగతి తెలిసిందే. జూన్ 21 నుంచి 23 వరకు జరిగే అమెరికా పర్యటనలో ప్రధాని పలు సంస్థల సీఈఓలు, పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానున్నారు. ప్రపంచ కుబేరుడు, టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ తో ప్రధాని మోడీ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్లో ఉండగానే ఇంత సడెన్గా ఆ డెసిషన్ ఎందుకు?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!