PM Modi: రష్యాపై భారత వైఖరి ఏమిటో ప్రపంచానికి తెలుసు.. ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: రష్యాపై భారత వైఖరి స్పష్టంగా ఉందని, భారత వైఖరి ఏమిటో ప్రపంచానికి తెలుసు అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అమెరికా పర్యటనకు వెళ్తున్న సమయంలో వాల్ స్ట్రీట్ జర్నల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశం శాంతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో భారత్, రష్యా దేశానికి వ్యతిరేకంగా ఎందుకు ధృడమైన వైఖరి తీసుకోవడం లేదని అమెరికాలో వస్తున్న విమర్శలపై అడిగిన ప్రశ్నకు ప్రధాని స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మేము ఏ వైఖరి తీసుకోకుండా తటస్థంగా ఉందని అంటున్నారు, అయితే మేం తటస్థంగా లేము, మేం శాంతి పక్షాల ఉన్నామని మోడీ అన్నారు. అన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాలు, దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి, వివాదాలను చర్చలు, దౌత్య ప్రక్రియ ద్వారా పరిష్కరించుకోవాలని మోడీ స్పష్టం చేశారు.
Also Read
- Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. 'లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్' అంటూ ఫైర్!
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
Read Also: PM Modi: చైనాతో సంబంధాలకు సరిహద్దుల్లో శాంతి అవసరం
భారత్-అమెరికా భాగస్వామ్యంపై మోడీ మాట్లాడుతూ..రెండు దేశాల మధ్య అపూర్వమైన నమ్మకం ఉందని, రెండు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారం, తమ భాగస్వామ్యానికి మూలస్తంభం అని, ఇది వాణిజ్యం, సాంకేతికత, శక్తికి కూడా విస్తరిస్తుందని ఆయన అన్నారు. వేలాది ఏళ్లుగా భారత్ అనేక మతాలు, విశ్వాసాలకు కేంద్రంగా ఉందని ఆయన అన్నారు.
మోడీ అమెరికా పర్యటన యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. రెండు దేశాల మధ్య బంధం మరింతగా బలపడుతుందని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా రక్షణ, సాంకేతికత రంగాల్లో ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదరనున్నాయి. ఇప్పటికే భారత్ ప్రిడిటర్ డ్రోన్ల కొనుగోలు ఒప్పందానికి పచ్చ జెండా ఊపిన సంగతి తెలిసిందే. జూన్ 21 నుంచి 23 వరకు జరిగే అమెరికా పర్యటనలో ప్రధాని పలు సంస్థల సీఈఓలు, పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానున్నారు. ప్రపంచ కుబేరుడు, టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ తో ప్రధాని మోడీ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Hyderabad: ఫిలింనగర్లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం..
-
Shreyas Iyer: “అందుకే జట్టు నుంచి వైభవ్ సూర్యవంశీని తీసేశాం”.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Astrology: శ్రావణ మాసానికి ముందే శని వక్రగతి.. ఈ 5 రాశుల వారికి సంవత్సరాంతం వరకు ధన యోగం!
-
FIFA World Cup 2026: ఆకాశాన్నంటిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ టిక్కెట్ల ధరలు.. 32 ఏళ్లలో 10 రెట్లు పెరిగినయ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!