PM Modi: రష్యాపై భారత వైఖరి ఏమిటో ప్రపంచానికి తెలుసు.. ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: రష్యాపై భారత వైఖరి స్పష్టంగా ఉందని, భారత వైఖరి ఏమిటో ప్రపంచానికి తెలుసు అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అమెరికా పర్యటనకు వెళ్తున్న సమయంలో వాల్ స్ట్రీట్ జర్నల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశం శాంతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో భారత్, రష్యా దేశానికి వ్యతిరేకంగా ఎందుకు ధృడమైన వైఖరి తీసుకోవడం లేదని అమెరికాలో వస్తున్న విమర్శలపై అడిగిన ప్రశ్నకు ప్రధాని స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మేము ఏ వైఖరి తీసుకోకుండా తటస్థంగా ఉందని అంటున్నారు, అయితే మేం తటస్థంగా లేము, మేం శాంతి పక్షాల ఉన్నామని మోడీ అన్నారు. అన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాలు, దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి, వివాదాలను చర్చలు, దౌత్య ప్రక్రియ ద్వారా పరిష్కరించుకోవాలని మోడీ స్పష్టం చేశారు.
Also Read
- Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
- Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
Read Also: PM Modi: చైనాతో సంబంధాలకు సరిహద్దుల్లో శాంతి అవసరం
భారత్-అమెరికా భాగస్వామ్యంపై మోడీ మాట్లాడుతూ..రెండు దేశాల మధ్య అపూర్వమైన నమ్మకం ఉందని, రెండు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారం, తమ భాగస్వామ్యానికి మూలస్తంభం అని, ఇది వాణిజ్యం, సాంకేతికత, శక్తికి కూడా విస్తరిస్తుందని ఆయన అన్నారు. వేలాది ఏళ్లుగా భారత్ అనేక మతాలు, విశ్వాసాలకు కేంద్రంగా ఉందని ఆయన అన్నారు.
మోడీ అమెరికా పర్యటన యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. రెండు దేశాల మధ్య బంధం మరింతగా బలపడుతుందని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా రక్షణ, సాంకేతికత రంగాల్లో ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదరనున్నాయి. ఇప్పటికే భారత్ ప్రిడిటర్ డ్రోన్ల కొనుగోలు ఒప్పందానికి పచ్చ జెండా ఊపిన సంగతి తెలిసిందే. జూన్ 21 నుంచి 23 వరకు జరిగే అమెరికా పర్యటనలో ప్రధాని పలు సంస్థల సీఈఓలు, పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానున్నారు. ప్రపంచ కుబేరుడు, టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ తో ప్రధాని మోడీ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Mahabubabad: ఇద్దరు పిల్లల తల్లి దారుణం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. ఫోన్ చెక్ చేస్తే మైండ్ బ్లాక్..
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!