EzriCare Eye Drops: ఇండియన్ కంపెనీకి చెందిన ఐడ్రాప్స్తో అమెరికాలో ఒకరి మరణం.. రీకాల్ చేసిన కంపెనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Firm Suspends Production Of Eye Drops Linked To Death In US: భారతదేశానికి చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ తయారు చేసిన ఎజ్రీకేర్ ఆర్టిఫిషియల్ టియర్స్ ఐడ్రాప్స్ వల్ల అమెరికాలో ఒకరు మరణించారు. పలువురికి కంటి చూపు సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో ఎజ్రీకేర్ ఐ డ్రాప్స్ ను రీకాల్ చేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఎజ్రీకేర్ వల్ల అమెరికాలోని 12 రాష్ట్రాల్లో 55 మంది వరకు దీని వల్ల ప్రభావితం అయ్యారు. ఇందులో ఒకరు మరణించగా.. ఐదుగురు కంటి చూపును కోల్పోయినట్లు అమెరికా సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) అధికారులు వెల్లడించారు. ఈ మందును నిషేధిస్తున్నట్లు ప్రకటించారు.
Read Also: Indra Karan Reddy : మహారాష్ట్రలో ఇకపై అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుంది
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ఈ మందును వాడిన తర్వాత రక్తం, మూత్రం, ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కనిపించినట్లు సీడీసీ వెల్లడించింది. ఈ మందులను వాడటాన్ని నిలిపివేయాలని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) ఆదేశాలు జారీ చేసింది. సూడోమోనాస్ ఎరుగినోసా అనే బ్యాక్టీరియా యాంటీబయాటిక్ రెసిస్టెంట్ గా మారిందని.. దీని వల్లే ప్రస్తుతం ఇన్ఫెక్షన్లు చోటు చేసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో అప్రమత్తం అయిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ), స్టేట్ డ్రగ్ కంట్రోలర్ల బృందాలు విచారణ కోసం చెన్నైకి దక్షిణాన 40 కి.మీ దూరంలో ఉన్న గ్లోబల్ ఫార్మా హెల్త్కేర్ ప్లాంట్కు వెళ్తున్నాయి.
ఇప్పటికే భారత్ లో తయారైన దగ్గు మందు కారణంగా ఇటీవల గాంబియా, ఉజ్బెకిస్థాన్ దేశాల్లో పదుల సంఖ్యలో పిల్లలు మరణించారు. తాజాగా ఐడ్రాప్స్ వల్ల అమెరికాలో మరణం, కంటిచూపు సమస్యలు ఏర్పడ్డాయి.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!