Khalistan Referendum: ఖలిస్తాన్ రిఫరెండంపై చర్యలు తీసుకోండి..కెనడాను కోరిన ఇండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Seeks Action On Khalistan Referendum: కెనడాలో రాడికల్ వ్యక్తులు కొంతమంది చేపడుతున్న ‘‘ ఖలిస్తాన్ రెఫరెండం’’పై భారత్ సీరియస్ అయింది. గురువారం నాడు ఈ అంశంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కెనడాను కోరింది. స్నేహపూర్వక దేశమైన కెనడాలో ఇలాంటి రాజకీయ ప్రేరేపిత కార్యకలాపాలను అనుమతించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. దౌత్యమార్గాల్లో కెనడా అధికారులకు ఈ విషయాన్ని భారత్ తెలిపిందని.. ఈ విషయంలో కెనడాపై ఒత్తడి తెస్తూనే ఉంటామని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
కెనడాలో నిర్వహిస్తున్న ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణను ఓ వృథా ప్రయాస అని ఆయన పేర్కొన్నారు. కెనడా ప్రభుత్వం భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను గౌరవిస్తున్నట్లు పునరుద్ఘాటించిందని.. ఆ దేశంలో జరిగే ప్రజాభిప్రాయ సేకరణను తాము గుర్తించబోమని అరిందమ్ బాగ్చి అన్నారు. ఈ రెఫరెడంపై కెనడా పెద్దగా చర్యలు తీసుకోకపోవడం భారతదేశానికి ఆగ్రహాన్ని తెప్పించింది.
Also Read
- Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
- Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
- PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
Read Also: Sadhvi Niranjan Jyoti: బీజేపీ మతతత్వ పార్టీ అయితే.. ఓవైసీ పార్టీ ఏంటీ..?
పంజాబ్ రాష్ట్రాన్ని ప్రత్యేక దేశం చేయాలని ఖలిస్తాన్ ఉగ్రవాదులు, సిఖ్ ఫర్ జస్టిస్ సంస్థ డిమాండ్ చేస్తున్నాయి. కెనడా, యూకే, అమెరికా వేదికగా కొందరు రాడికల్ సిక్కు ఉగ్రవాదులు భారత్ పై విషాన్ని చిమ్ముతున్నారు. ఇటీవల కాలంలో కెనడాలో పలు హిందు ఆలయాలకు చెందిన విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ ఘటనలపై ఎప్పటికప్పుడు భారత్ తన నిరసనను తెలియజేస్తోంది. భారత వ్యతిరేక కార్యకలాపాలను కెనడా పెద్దగా పట్టించుకోవడం లేదని భారత్ భావిస్తోంది. ముఖ్యంగా భారత్ వ్యతిరేకతకు పాల్పడుతున్న వ్యక్తులు కెనడాలోని తలదాచుకుంటున్నారు. అక్కడ ఉండి భారత్ లో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు యూకేలో భారతీయులకు, హిందువులపై దాడులు చేస్తున్నా అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భారత్ నిరసన వ్యక్తం చేసింది. ఇటీవల లీసెస్టర్ సిటీలో హిందువులు, ముస్లిం వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. హిందువుల ఇళ్లపై దాడులు, వాహనాలకు నిప్పుపెడుతూ చెలరేగిపోయాయి అల్లరి మూకలు. పోలీసుల సమక్షంలో హిందూ దేవాలయంపై దాడి జరిగిన పట్టించుకోవడం లేదు. ఈ అల్లర్లకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని భారత్, యూకే ప్రభుత్వాన్ని కోరింది.
తాజావార్తలు
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
-
Post S*ex Tips: శృం*గారం తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇన్ఫెక్షన్లు దరిచేరవంతే.!
-
Shiva Yoga: జూన్ 24న అత్యంత శక్తివంతమైన ‘శివ యోగం’.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం.!
ట్రెండింగ్
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!