S Jaishankar: హిమాలయాల్లో ఇండియా-చైనాల మధ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: ఇండియా, చైనాల మధ్య పరిస్థితి ప్రమాదకరంగానే ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. హిమాలయాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇరు దేశాల బలగాలు దగ్గరదగ్గరగా ఉన్నాయని, సైనికపరంగా ప్రమాదకరంగా ఉన్నాయని శనివారం ఆయన అన్నారు. ఇండియా టుడే ఇండియా టుడే కాన్క్లేవ్లో ఎస్ జైశంకర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
2020లో గాల్వాన్ ఘర్షణ సమయంలో 20 మంది భారత సైనికులు మరణించారు. చైనా వైపు 40 మందికి పైగా సైనికులు మరణించారు. అయితే చైనా ఇప్పటి వరకు సరైన మరణాల వివరాలను చెప్పలేదు. ఈ ఘర్షణ అనంతరం రెండు దేశాల మధ్య దౌత్య, సైనిక చర్చల ద్వారా పరిస్థితి శాంతించింది. గతేడాది డిసెంబర్ నెలలో అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో మరోసారి ఇదే దేశాల బలగాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే ఈ దాడిలో ఇరువైపుల సైనికలు గాయపడ్డారు. భారత ఆర్మీ, చైనా ఆర్మీ దురాక్రమణను తిప్పికొట్టింది.
Also Read
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
- Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
Read Also: Viral : ఆదర్శ దంపతులు.. భర్త రేప్ చేస్తుంటే భార్య వీడియో తీసింది
చైనా, భారత్ సరిహద్దు లైన్ ఆఫ్ ఆక్చుయల్ కంట్రోల్(ఎల్ఏసీ) వద్ద ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత అలాగే ఉంది. మరోవైపు చైనా టిబెట్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో మౌళిక సదుపాయాలను వేగంగా విస్తరిస్తోంది. దీనికి ధీటుగా భారత్ కూడా అంతే స్థాయిలో బోర్డర్ వెంబడి మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. చైనా ముందస్తు వ్యూహంలో భాగంగానే తమ ఆర్మీని, యుద్ధ సామాగ్రిని త్వరగా తరలించే విధంగా రైలు, రోడ్డు మార్గాలను అభివృద్ధి చేయడం భారత్ కు ప్రమాదకరంగా మారింది. ఇందులో ఓ రైలు మార్గం చైనా ఆక్రమిత ఆక్సాయ్ చిన్ నుంచి నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు సరిహద్దుల్లోని ఎయిర్ బేసుల్లో విమానాలు, డ్రోన్లను మోహరిస్తోంది.
తాజావార్తలు
-
Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
-
Jagapathi Babu: నువ్వు హీరో అయితే ఈసారి ఏం కట్ చేస్తావ్ బుచ్చిబాబూ? ?
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
-
Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!