India Bangladesh: బంగ్లాకు షాక్ ఇచ్చిన భారత్.. దిగుమతులపై పోర్ట్ ఆంక్షలు..
- బంగ్లాదేశ్కి భారత్ భారీ షాక్..
- బంగ్లా వస్తువుల దిగుమతులపై పోర్ట్ ఆంక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Bangladesh: బంగ్లాదేశ్కి భారత్ భారీ షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి దిగుమతి అవుతున్న కొన్ని వస్తువులపై పోర్టు ఆంక్షలు విధించారు. ఆ దేశం నుంచి రెడీమెడ్ దుస్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వంటి కొన్ని దిగుమతులపై ఆంక్షలు పెట్టింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఈ విషయంపై నోటిఫికేషన్ జారీ చేసింది. బంగ్లాదేశ్ వస్త్ర దిగుమతులను కోల్కతా, ముంబై ఓడరేవులకు వరకే పరిమితం చేసింది. గతంలో యూనస్ చేసిన వ్యాఖ్యల ఫలితంగానే భారత్ ఈ చర్యలు తీసుకుంటుంది. చైనా పర్యటనలో యూనస్ మాట్లాడుతూ, భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు ‘‘ల్యాండ్ లాక్డ్’’గా ఉన్నాయని అన్నారు.
Read Also: Rahul Gandhi: ‘‘పాకిస్తాన్కి సమాచారం ఇవ్వడం నేరం’’.. ఆపరేషన్ సిందూర్పై రాహుల్ గాంధీ..
Also Read
- Social Media: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కు అంతరాయం.. ఇబ్బందుల్లో యూజర్లు
- Mamata Banerjee: మమత బుక్స్ లైబ్రరీల నుంచి ఔట్.. బీజేపీ సర్కార్ కీలక చర్య.!
- IMD Warning: ఎల్నినో వచ్చేసింది.. మాన్సూన్పై ఐఎండీ వార్నింగ్
- Sejal Pawar: డాక్టర్ అని చెప్పుకుంటూ చెత్త కూతలు కూసిన సెజల్ పవార్! అసలు రంగు బయటపెట్టిన కేఈఎమ్ హాస్పిటల్..
ఈ నోటిఫికేషన్లో ‘‘రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు మొదలైన కొన్ని వస్తువులను బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి దిగుమతి చేసుకోవడంపై పోర్ట్ పరిమితులు విధిస్తుంది’’ అని మంత్రిత్వ శాఖ చెప్పింది. అయితే, పోర్ట్ పరిమితులు భారతదేశం గుండా రవాణా అయ్య నేపాల్, భూటాన్ చేరే బంగ్లాదేశ్ వస్తువులకు వర్తించదు.
పండ్లు, కార్బోనేటేడ్-పండ్ల-రుచిగల పానీయాలు, స్నాక్స్, బేక్డ్ గూడ్స్ వంటి ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, ప్లాస్టిక్,PVC వస్తువులు, పత్తి , పత్తి నూలు వ్యర్థాలు, రంగులు, ప్లాస్టిసైజర్లు, గ్రాన్యూల్స్ , చెక్క ఫర్నిచర్ వంటి వస్తువుల అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, పశ్చిమ బెంగాల్లోని ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లు (LCSలు), ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్లు (ICPలు) ద్వారా దిగుమతులు అనుమతించబడవని ఉత్తర్వులు పేర్కొన్నాయి. అయితే, ఈ ఆంక్షలు చేపలు, ఎల్పీజీ, వంట నూనె వంటి వాటికి వర్తించవు. ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని DGFT తెలిపింది.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. గతంలో, చైనా పర్యటనలో యూనస్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ బంగాళాఖాతానికి రక్షకుడని, భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్గా ఉన్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యల తర్వాత భారత్ బంగ్లాదేశ్కి ఇస్తున్న ‘‘ట్రాన్స్ షిప్మెంట్’’ సౌకర్యాన్ని రద్దు చేసింది.
The Directorate General of Foreign Trade (DGFT), Ministry of Commerce and Industry, has issued a notification imposing port restrictions on the import of certain goods such as Readymade garments, processed food items etc., from Bangladesh to India. However, such said port… pic.twitter.com/7Ba9ixokt6
— ANI (@ANI) May 17, 2025
తాజావార్తలు
-
Social Media: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కు అంతరాయం.. ఇబ్బందుల్లో యూజర్లు
-
Rao Bahadur Teaser: లాస్ట్లో ఆ డైలాగ్ నెక్స్ట్ లెవెల్.. సత్యదేవ్ ‘రావు బహదూర్’ టీజర్ చూశారా!
-
CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
-
Trigrahi Raja Yoga: జూన్ 15న మిథున రాశిలో “త్రిగ్రాహి రాజయోగం”.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
-
Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!