Rahul Gandhi: ‘‘పాకిస్తాన్కి సమాచారం ఇవ్వడం నేరం’’.. ఆపరేషన్ సిందూర్పై రాహుల్ గాంధీ..
- పాకిస్తాన్కి ఆపరేషన్ ముందు సమాచారం ఇవ్వడం నేరం..
- ఆపరేషన్ సిందూర్పై రాహుల్ గాంధీ ఆరోపణలు..
- జైశంకర్ వీడియోని ట్వీట్ చేసిన ప్రతిపక్ష నేత..
- తప్పుడు ఆరోపణల్ని ఖండించిన విదేశాంగ శాఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: పాకిస్తాన్పై భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఆపరేషన్కి ముందే భారత్ పాకిస్తాన్కి సమాచారం ఇచ్చిందని, ఇది నేరం అని ఆయన విమర్శించారు. దీనికి ధీటుగా బీజేపీ బదులిస్తూ, రాహుల్ గాంధీ నకిలీ వార్తలు వ్యాప్తి చేస్తున్నాడని ఆరోపించింది.
శనివారం, రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా విదేశాంగ మంత్రి జైశంకర్కి సంబంధించిన ఒక వీడియోని షేర్ చేశారు. దీనిలో విదేశాంగ మంత్రి మాట్లాడుతూ.. ‘‘మే 6-7 తేదీల మధ్య రాత్రి నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ ప్రారంభంలో, ఉగ్రవాద స్థావరాలను మాత్రమే దాడి చేశామని, సైనిక స్థావరాలపై కాదు అని పాకిస్తాన్కి సందేశం పంపబడింది. వారు మా సలహా తీసుకోలేదు.’’ అని చెప్పడం వినవచ్చు.
Also Read
- CBSE స్టూడెంట్స్కు రిలీఫ్.. 10వ క్లాస్కు కొత్త రూల్ లేదు.!
- Mahua Moitra: రామమందిర విరాళాల స్కామ్పై స్పందించరే.. బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
Read Also: Rajasthan High Court: సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల వేట కేసులో కీలక అప్డేట్
రాహుల్ గాంధీ ఈ వీడియోపై స్పందిస్తూ, దాడికి ముందు పాక్కి సమాచారం ఇవ్వడం నేరం అని అన్నారు. ప్రభుత్వం అలా చేసిందని విదేశాంగ మంత్రి బహిరంగంగా అంగీకరించారు అని ఆరోపించారు. ఉగ్రవాద స్థావరాలపై దాడి సందర్భంగా భారత వైమానిక దళం ఎన్ని వీడియోలను కోల్పోయింది .? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అయితే, రాహుల్ గాంధీ ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ కూడా స్పందించింది. పాకిస్తాన్కి సమాచారం ఇచ్చామని చెప్పడం తప్పుడు ప్రకటన అని చెప్పింది.
బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మాట్లాడుతూ, ఆయన నకిలీ వార్తల్ని వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. జైశంకర్ ఆపరేషన్ సిందూర్లో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన తర్వాత, పాకిస్తాన్ ఆర్మీ భారత్పై దాడులు చేయడాన్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలు ఆపరేషన్ సిందూర్కి ముందే చేసినట్లు తప్పుగా చిత్రీకరిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
Informing Pakistan at the start of our attack was a crime.
EAM has publicly admitted that GOI did it.
1. Who authorised it?
2. How many aircraft did our airforce lose as a result? pic.twitter.com/KmawLLf4yW— Rahul Gandhi (@RahulGandhi) May 17, 2025
తాజావార్తలు
-
CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
CBSE స్టూడెంట్స్కు రిలీఫ్.. 10వ క్లాస్కు కొత్త రూల్ లేదు.!
-
CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
Cleaning Tips: ఇల్లాళ్లకు స్మార్ట్ కిచెన్ ఐడియాస్.. వంటగదిని క్లీన్గా ఉంచే 12 అదిరిపోయే చిట్కాలు!
ట్రెండింగ్
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!