Rahul Gandhi: ‘‘పాకిస్తాన్కి సమాచారం ఇవ్వడం నేరం’’.. ఆపరేషన్ సిందూర్పై రాహుల్ గాంధీ..
- పాకిస్తాన్కి ఆపరేషన్ ముందు సమాచారం ఇవ్వడం నేరం..
- ఆపరేషన్ సిందూర్పై రాహుల్ గాంధీ ఆరోపణలు..
- జైశంకర్ వీడియోని ట్వీట్ చేసిన ప్రతిపక్ష నేత..
- తప్పుడు ఆరోపణల్ని ఖండించిన విదేశాంగ శాఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: పాకిస్తాన్పై భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఆపరేషన్కి ముందే భారత్ పాకిస్తాన్కి సమాచారం ఇచ్చిందని, ఇది నేరం అని ఆయన విమర్శించారు. దీనికి ధీటుగా బీజేపీ బదులిస్తూ, రాహుల్ గాంధీ నకిలీ వార్తలు వ్యాప్తి చేస్తున్నాడని ఆరోపించింది.
శనివారం, రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా విదేశాంగ మంత్రి జైశంకర్కి సంబంధించిన ఒక వీడియోని షేర్ చేశారు. దీనిలో విదేశాంగ మంత్రి మాట్లాడుతూ.. ‘‘మే 6-7 తేదీల మధ్య రాత్రి నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ ప్రారంభంలో, ఉగ్రవాద స్థావరాలను మాత్రమే దాడి చేశామని, సైనిక స్థావరాలపై కాదు అని పాకిస్తాన్కి సందేశం పంపబడింది. వారు మా సలహా తీసుకోలేదు.’’ అని చెప్పడం వినవచ్చు.
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
Read Also: Rajasthan High Court: సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల వేట కేసులో కీలక అప్డేట్
రాహుల్ గాంధీ ఈ వీడియోపై స్పందిస్తూ, దాడికి ముందు పాక్కి సమాచారం ఇవ్వడం నేరం అని అన్నారు. ప్రభుత్వం అలా చేసిందని విదేశాంగ మంత్రి బహిరంగంగా అంగీకరించారు అని ఆరోపించారు. ఉగ్రవాద స్థావరాలపై దాడి సందర్భంగా భారత వైమానిక దళం ఎన్ని వీడియోలను కోల్పోయింది .? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అయితే, రాహుల్ గాంధీ ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ కూడా స్పందించింది. పాకిస్తాన్కి సమాచారం ఇచ్చామని చెప్పడం తప్పుడు ప్రకటన అని చెప్పింది.
బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మాట్లాడుతూ, ఆయన నకిలీ వార్తల్ని వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. జైశంకర్ ఆపరేషన్ సిందూర్లో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన తర్వాత, పాకిస్తాన్ ఆర్మీ భారత్పై దాడులు చేయడాన్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలు ఆపరేషన్ సిందూర్కి ముందే చేసినట్లు తప్పుగా చిత్రీకరిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
Informing Pakistan at the start of our attack was a crime.
EAM has publicly admitted that GOI did it.
1. Who authorised it?
2. How many aircraft did our airforce lose as a result? pic.twitter.com/KmawLLf4yW— Rahul Gandhi (@RahulGandhi) May 17, 2025
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!