Qatar: ఖతార్లో మాజీ నావీ అధికారులకు మరణశిక్ష.. అప్పీల్ దాఖలు చేసిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Qatar: గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై ఖతార్ ప్రభుత్వం 8 మంది మాజీ ఇండియన్ నేవీ అధికారులకు మరణశిక్ష విధించింది. గతేడాది ఆగస్టులో వీరిని అరెస్ట్ చేసిన అక్కడి అధికారులు, ఇటీవల మరణశిక్ష విధించారు. దీనిపై భారత్ షాక్కి గురైంది. దీనిపై న్యాయపరంగా, దౌత్యపరంగా పోరాటానికి భారత్ సిద్ధమైంది.
8 మంది భారతీయులకు మరణశిక్ష విధించడంపై భారత్ ఖతార్లో అప్పీల్ దాఖలు చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం మాట్లాడుతూ.. ఢిల్లీ ఇప్పటికే అప్పీల్ దాఖలు చేసినట్లు చెప్పారు. గతంలో ఈ తీర్పు పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవని బాగ్చి చెప్పారు. తదుపరి చట్టపరమైన చర్యలను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో 8 మంది కుటుంబ సభ్యులతో టచ్ లో ఉన్నామని, సాధ్యమైన సాయాన్ని అందిస్తామని చెప్పారు.
Also Read
Read Also: Madhavi Latha: రష్మిక ఫేక్ వీడియోపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు.. ఆమె వేసుకునే డ్రెస్సుల కంటే అసభ్యమా?
శిక్ష పడిన 8 మంది గతంలో ఇండియన్ నేవీలో పనిచేశారు. పదవీ విరమణ తర్వాత ఖతార్ లోని సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలు అందించే ప్రైవేట్ సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీ అండ్ కన్సల్టెన్సీలో పనిచేస్తున్నారు. అయితే ఇటాలియన్ టెక్నాలజీ ఆధారంగా స్టెల్త్ సబ్మెరైన్లకు సంబంధించిన సన్నితమైన సమాచారాన్ని ఇజ్రాయిల్కి అందించారని, గూఢచర్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఈ కేసులో కెప్టెన్ హోదాలో రిటైర్ అయిన నవతేజ్ సింగ్ గిల్, బీరేంద్ర కుమార్ వర్మ, సౌరభ్ వశిష్ట్, కమాండర్ హోదాతో పనిచేసిన అమిత్ నాగ్ పాల్, పూర్ణేందు తివారీ, సుగుణాకర్ పాకాల, సంజీవ్ గుప్తా, మరొకరు ఉన్నారు. ఈ కేసులో వీరు పనిచేస్తున్న కంపెనీ యజమానిని అరెస్ట్ చేసినా.. ఆ తరువాత క్షమాభిక్షపై వదిలేసింది ఖతార్. అయితే దీని వెనక ఖతార్, పాకిస్తాన్, ఐఎస్ఐ కుట్ర దాగి ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!