India Pakistan: పాక్లో ఉగ్రవాదుల్ని చంపుతున్నది ఇండియానే.. వాషింగ్టన్ పోస్ట్ కథనం..
- పాకిస్తాన్లో ఉగ్రవాదుల హత్యలు చేస్తుంది ఇండియానే..
- వాషింగ్టన్ పోస్ట్ సంచలన కథనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan: గత కొంత కాలంలో పాకిస్తాన్లో పలువురు ఉగ్రవాదులు ‘‘గుర్తుతెలియని వ్యక్తుల’’ చేతిలో మరణించారు. బైక్పై వచ్చేవారు ఉగ్రవాదుల్ని దగ్గర నుంచి కాల్చి చంపారు. ఇదే తరహాలో పాకిస్తాన్ వ్యాప్తంగా పలువురు ఉగ్రవాదుల హత్యలు జరిగాయి. అయితే, ఈ చనిపోయిన ఉగ్రవాదులకు భారత్లో ఏదో విధంగా సంబంధం ఉండటం గమనార్హం. వీరు భారత్లో గతంలో ఉగ్రవాదానికి పాల్పడినవారే. అయితే, ఈ హత్యలన్నీ కూడా భారత మనుషులే చేస్తున్నారంటూ పాక్ అధికారులు పలుమార్లు ఆరోపించారు. అయితే, నేరుగా భారత్ పేరు తీసుకోకుండా పొరుగున ఉన్న దేశమని లేదా శత్రుదేశమని కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉంటే, తాజాగా వాషింగ్టన్ పోస్ట్ కథనం సంచలనంగా మారింది. 2021 నుంచి పాకిస్తాన్లో ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చేందుకు భారత గూఢచార సంస్థ పద్ధతి ప్రకారం ఈ హత్యల్నిఅమలు చేసిందని మంగళవారం వాషింగ్టన్ పోస్ట్ కథనం నివేదించింది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) ప్లాన్ చేసి ఆరు హత్యలు చేసిందని ఆరోపించింది. అమెరికా, కెనడాల్లో ఖలిస్తాన్ వేర్పాటువాదులను హతమార్చే ప్లాన్లకు పాకిస్తాన్ ప్లాన్కి సారుప్యతలు ఉన్నాయని చెప్పింది.
Also Read
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
Read Also: Kia Ciros Bookings: అర్ధరాత్రి నుంచే కియా సిరోస్ ఎస్యూవీ బుకింగ్స్.. ధర, ఫీచర్స్ ఇవే..
పాకిస్తాన్లో హత్యలు చేసింది భారత పౌరులు కాదని, పాకిస్తాన్లోని చిన్న నేరస్తులు లేదా ఆఫ్ఘనిస్తాన్కి చెందిన కిరాయి షూటర్లు అని వార్తా పత్రిక పేర్కొంది. రా దుబాయ్కి చెందిన వ్యాపారవేత్తలను మధ్యవర్తులుగా నియమించుకుందని, నిఘా నిర్వమించడానికి, హత్యలు చేయడానికి హవాలా లేదా అనధికార లావాదేవీలను, ఫైనాన్షియల్ నెట్వర్క్ ద్వారా చెల్లింపులు చేయడానికి ప్రత్యేక బృందాలను నియమించుకుందని తెలిపింది.
2022లో జహూర్ మిస్త్రీ అనే ఉగ్రవాది పాకిస్తాన్లో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యారు. ఇతడికి 1999 ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్తో సంబంధం ఉంది. ఆ సమయంలో విమానంలోని ఒక ప్రయాణికుడిని మిస్త్రీ హత్య చేశాడు. దీనిపై తన గుర్తింపుని వెల్లడించని పాకిస్తాన్ అధికారి వాషింగ్టన్ పోస్ట్తో మాట్లాడుతూ.. ఒక మహిళ తనను తాను తానాజ్ అన్సారీ అని పరిచయం చేసుకుందని, నిజానికి మిస్త్రీని చంపే ఆపరేషన్లో భారతీయ ఇంటెలిజెన్స్ అధికారి పాల్గొందని చెప్పాడు.
మిస్త్రీని ట్రాక్ చేయడానికి ఇద్దరు పాకిస్తానీయులను, అతడిని కాల్చడానికి ఇద్దరు ఆఫ్ఘన్ పౌరులను, ఆగ్నేయాసి, ఆఫ్రికా, పశ్చిమాసియాకు చెందిన వారికి ఈ హత్యలో సంబంధం ఉందని, వీరిని తానాజ్ అన్సారీ నియమించుకుందని, ఒక్కొక్కరికి 5500 డాలర్లు (దాదాపుగా రూ. 4.7 లక్షలు) ఇచ్చిందని సదరు పాక్ అధికారి వాషింగ్టన్ పోస్టకు వెల్లడించారు. 1990వ దశకంలో కాశ్మీర్లో చురుకుగా పనిచేసిన ఉగ్రవాది సయ్యద్ ఖలీద్ రజాని చంపడంలో కూడా భారత ఏజెంట్ అయిన మహిళ ప్రమేయం ఉందని, ఈ విషయాలను పాక్ అధికారులు చెప్పిటన్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.
తాజావార్తలు
-
Best AI Laptops 2026: AI ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నారా?.. ఈ 5 పవర్ఫుల్ ల్యాప్టాప్లు బెస్ట్ ఆప్షన్స్!
-
Vaibhav Sooryavanshi: “ఫుడ్ విషయంలో తగ్గేదేలే”.. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
-
Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే ‘హర్రర్ సినిమాలు’ చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!