Eric Garcetti: భారతదేశం నా హృదయాన్ని దోచుకుంది.. అమెరికా రాయబారి..
- భారత్ నా హృదయాన్ని దోచుకుంది..
- అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి..
- భారత్-యూఎస్ బంధం బలపడింది..
- భారత్ ఎదుగుదల మాకు ఎంతో ఇష్టం..
- ఇక్కడ పనిచేయడం అసాధారణ అనుభవం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eric Garcetti: భారతదేశంలో అమెరికా రాయబారిగా ఉన్న ఎరిక్ గార్సిట్టి పదవీ కాలంల మరికొన్ని రోజుల్లో ముగియబోతోంది. గురువారం ఆయన ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశంలో తన పదవీ కాలాన్ని ‘‘అత్యంత అసాధారణమైనది’’గా అభివర్ణించారు. భారత్ తన హృదయాన్ని దోచుకుందని చెప్పారు. భారత్-అమెరికా మధ్య అంతులేని అవకాశాల ఉన్నాయని అన్నారు. ఇది సరైన సమయంలో సరైన స్థలంలో, సరైన సంబంధాలు ఉండాలని అన్నారు.
‘‘ అధ్యక్షుడు జో బైడెన్ తనకు భారత్ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన దేశమని, భవిష్యత్తులో పని చేయాలనుకుంటే, మీరు భారతదేశానికి రావాలని చెప్పారు. ఏ అమెరికా అధ్యక్షుడు కూడా ఇలా అనలేదు’’ అని గార్సెట్టి అన్నారు. ‘‘భారత్-అమెరికా సంబంధాలను నిర్వచించే సంబంధాలు. శాంతిని నెలకొల్పడం అంటే యుద్ధాలు నిరోధించడం. యుద్ధాలు జరకుండా చూడటం. సరిహద్దులు పవిత్రమైనవి, శాంతిని కాపాడటానికి నియమాలు మాత్రమే మార్గం’’ అని అన్నారు.
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
Read Also: Bangladesh: బంగ్లాదేశ్ మరో వివాదాస్పద నిర్ణయం.. భారత్, అమెరికాకు ముప్పు..
రెండు దేశాల సంబంధాలు దృఢంగా ఉండాలని కోరుకుంటూనే, ప్రపంచంలో భారత్ పాత్రను స్వాగతిస్తున్నామని చెప్పారు. ఉక్రెయిన్ రష్యా వివాదంలో శాంతి అయినా, హిందూ మహాసముద్రంలో గస్తీ అయినా స్వాగతిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో భారత్ పోషించే పాత్రను చూడం మాకు చాలా ఇష్టమని గార్సెట్టి అన్నారు. ఇది ఆధునిక ప్రపంచం ఎన్నడూ చూడని గర్వించదగ్గ భారతదేశమని చెప్పారు.
ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC) గురించి అడిగినప్పుడు.. పని మందగించలేదని గార్సెట్టి చెప్పారు. రెండు దేశాల వాణిజ్య సంబంధాల గురించి మాట్లాడుతూ.. వాణిజ్యంలో న్యాయం జరగాలని అన్నారు. భారతదేశంతో మాకు వాణిజ్య లోటు ఉందని, సుంకాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. సెమీకండక్టర్లు, టెలికమ్యూనికేషన్ పరికరాలు మరియు రక్షణ పరికరాలను కలిసి తయారు చేయగలిగేలా మనం సుంకాలను తగ్గించాలని చెప్పారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి మోడీని ఆహ్వానిస్తారా..? అని అడిగిన దానికి గార్సెట్టి మాట్లాడుతూ.. మోడీ, ట్రంప్ సన్నిహితంగా ఉంటారని అన్నారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!