Eric Garcetti: భారతదేశం నా హృదయాన్ని దోచుకుంది.. అమెరికా రాయబారి..
- భారత్ నా హృదయాన్ని దోచుకుంది..
- అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి..
- భారత్-యూఎస్ బంధం బలపడింది..
- భారత్ ఎదుగుదల మాకు ఎంతో ఇష్టం..
- ఇక్కడ పనిచేయడం అసాధారణ అనుభవం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eric Garcetti: భారతదేశంలో అమెరికా రాయబారిగా ఉన్న ఎరిక్ గార్సిట్టి పదవీ కాలంల మరికొన్ని రోజుల్లో ముగియబోతోంది. గురువారం ఆయన ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశంలో తన పదవీ కాలాన్ని ‘‘అత్యంత అసాధారణమైనది’’గా అభివర్ణించారు. భారత్ తన హృదయాన్ని దోచుకుందని చెప్పారు. భారత్-అమెరికా మధ్య అంతులేని అవకాశాల ఉన్నాయని అన్నారు. ఇది సరైన సమయంలో సరైన స్థలంలో, సరైన సంబంధాలు ఉండాలని అన్నారు.
‘‘ అధ్యక్షుడు జో బైడెన్ తనకు భారత్ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన దేశమని, భవిష్యత్తులో పని చేయాలనుకుంటే, మీరు భారతదేశానికి రావాలని చెప్పారు. ఏ అమెరికా అధ్యక్షుడు కూడా ఇలా అనలేదు’’ అని గార్సెట్టి అన్నారు. ‘‘భారత్-అమెరికా సంబంధాలను నిర్వచించే సంబంధాలు. శాంతిని నెలకొల్పడం అంటే యుద్ధాలు నిరోధించడం. యుద్ధాలు జరకుండా చూడటం. సరిహద్దులు పవిత్రమైనవి, శాంతిని కాపాడటానికి నియమాలు మాత్రమే మార్గం’’ అని అన్నారు.
Also Read
- Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
- Rahul Gandhi: 152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఒక్కరికీ శిక్ష పడలేదు.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: కాక్రోచ్ ఉద్యమం ఎటు పోతోంది.? పేపర్ లీక్పై నిరసన అయితే దాడులు, విద్వేష నినాదాలు ఎందుకు.?
- Delhi Police: సీజేపీపై 10 ఎఫ్ఐఆర్లు.. తగ్గేది లేదంటున్న ఢిల్లీ పోలీసులు..
Read Also: Bangladesh: బంగ్లాదేశ్ మరో వివాదాస్పద నిర్ణయం.. భారత్, అమెరికాకు ముప్పు..
రెండు దేశాల సంబంధాలు దృఢంగా ఉండాలని కోరుకుంటూనే, ప్రపంచంలో భారత్ పాత్రను స్వాగతిస్తున్నామని చెప్పారు. ఉక్రెయిన్ రష్యా వివాదంలో శాంతి అయినా, హిందూ మహాసముద్రంలో గస్తీ అయినా స్వాగతిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో భారత్ పోషించే పాత్రను చూడం మాకు చాలా ఇష్టమని గార్సెట్టి అన్నారు. ఇది ఆధునిక ప్రపంచం ఎన్నడూ చూడని గర్వించదగ్గ భారతదేశమని చెప్పారు.
ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC) గురించి అడిగినప్పుడు.. పని మందగించలేదని గార్సెట్టి చెప్పారు. రెండు దేశాల వాణిజ్య సంబంధాల గురించి మాట్లాడుతూ.. వాణిజ్యంలో న్యాయం జరగాలని అన్నారు. భారతదేశంతో మాకు వాణిజ్య లోటు ఉందని, సుంకాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. సెమీకండక్టర్లు, టెలికమ్యూనికేషన్ పరికరాలు మరియు రక్షణ పరికరాలను కలిసి తయారు చేయగలిగేలా మనం సుంకాలను తగ్గించాలని చెప్పారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి మోడీని ఆహ్వానిస్తారా..? అని అడిగిన దానికి గార్సెట్టి మాట్లాడుతూ.. మోడీ, ట్రంప్ సన్నిహితంగా ఉంటారని అన్నారు.
తాజావార్తలు
-
Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
-
Toxic: ‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
-
Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
-
Anupama – Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
-
Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!