Mukesh Ambani: 2047 నాటికి 40 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Can Be USD 40 Trillion Economy By 2047 Says Mukesh Ambani: రిలయన్స్ వ్యాపారం మర్రిచెట్టులా విస్తరిస్తోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ అన్నారు. రిలయన్స్ ఫ్యామిలీ డే ఫంక్షన్ లో ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో భారత్ మరింతగా అభివృద్ధి చెందుతుందని..దాంట్లో రిలయన్స్ పాత్ర ఉంటుందని వెల్లడించారు. దశాబ్ధాలు గడిచిపోయాయి.. రిలయన్స్ మర్రిచెట్టులా దాని కొమ్మలు విశాలంగా విస్తరిస్తున్నాయని.. భారతీయుల జీవితాలను సుసంపన్నం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. 40 ఏళ్ల క్రితం ప్రారంభం అయిన రిలయన్స్ ఓ వటవృక్షంలా మారిందని, మా నాన్న స్థాపించిన మిషన్ గురించి ఆలోచించినప్పుడు గొప్పగా, ఎంతో పవిత్రమైనదిగా నమ్ముతానని అన్నారు.
Read Also: Telangana DGP: రాష్ట్రానికి కొత్త డీజీపీగా ఆ ఇద్దరిలో ఒకరు .. రేపు ఉత్తర్వులు..!
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
ప్రపంచస్థాయి వ్యాపారాలు నిర్మించడం ద్వారా భారతదేశాన్ని సుసంపన్నంగా చేయడమే రిలయన్స్ లక్ష్యం అని అని అన్నారు. ప్రపంచం మొత్తం 21 శతాబ్ధాన్ని ‘భారతదేశ’ శతాబ్ధంగా చూస్తోందని.. మన ప్రధాని నరేంద్రమోదీ ఈ కాలాన్ని ‘భారతదేశ అమృత కాలం’గా అభివర్ణిస్తున్నారని తెలిపారు. రాబోయే 25 ఏళ్లు భారతదేశ 5 వేల ఏళ్ల చరిత్రలో అత్యంత పరివర్తన చెందుతుందని.. 2047 నాటికి భారత్ 40 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యువత, పరిణితి చెందిన ప్రజాస్వామ్యం, సాంకేతిక శక్తి భారతదేశాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాయని అన్నారు.
పేదరికం, కొరత నుంచి ప్రస్తుతం భారతదేశం 140 కోట్ల భారతీయులకు జీవిత నాణ్యత, సమ్మిళిత శ్రేయస్సు, సమృద్ధి అవకాశాలు, అభివృద్ధి యుగంలోకి ప్రవేశించిందని ముఖేష్ అంబానీ అన్నారు. భారతదేశం అంతటా 5జీ నెట్వర్క్ ను అందుబాటులోకి తీసుకువచ్చినందుకు ముఖేష్ అంబానీ, కుమారుడు ఆకాష్ ను ప్రశంసించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ 5జీ నెట్వర్క్ ను జియో అందిస్తుందని..2023 నాటకి డిజిటల్ కనెక్టవిటీ వ్యాపారంలో నెంబర్ 1గా నిలుస్తామని అన్నారు. నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, అధిక ఉత్పాదకత, ఆర్థిక కార్యకలాపాకలు భారతీయులు ఎప్పటికి దూరం కాబోరని ముఖేష్ అంబానీ హామీ ఇచ్చారు. ప్రతీ గ్రామంలో 5జీ కనెక్టవిటీ ఉంటుందని.. దేశాన్ని చాలా కాలంగా పట్టి పీడిస్తున్న గ్రామీణ-పట్టణ తారతమ్యాలు పూర్తిగా రూపుమాపుతాం అని అన్నారు. న్యూ ఎనర్జీ అనేది రిలయన్స్ సరికొత్త సార్ట్ అప్ వ్యాపారమని.. ఇది కేవలం కంపెనీ, దేశానికే కాకుండా మొత్తం ప్రపంచాన్ని మార్చగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!