Mukesh Ambani: 2047 నాటికి 40 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Can Be USD 40 Trillion Economy By 2047 Says Mukesh Ambani: రిలయన్స్ వ్యాపారం మర్రిచెట్టులా విస్తరిస్తోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ అన్నారు. రిలయన్స్ ఫ్యామిలీ డే ఫంక్షన్ లో ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో భారత్ మరింతగా అభివృద్ధి చెందుతుందని..దాంట్లో రిలయన్స్ పాత్ర ఉంటుందని వెల్లడించారు. దశాబ్ధాలు గడిచిపోయాయి.. రిలయన్స్ మర్రిచెట్టులా దాని కొమ్మలు విశాలంగా విస్తరిస్తున్నాయని.. భారతీయుల జీవితాలను సుసంపన్నం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. 40 ఏళ్ల క్రితం ప్రారంభం అయిన రిలయన్స్ ఓ వటవృక్షంలా మారిందని, మా నాన్న స్థాపించిన మిషన్ గురించి ఆలోచించినప్పుడు గొప్పగా, ఎంతో పవిత్రమైనదిగా నమ్ముతానని అన్నారు.
Read Also: Telangana DGP: రాష్ట్రానికి కొత్త డీజీపీగా ఆ ఇద్దరిలో ఒకరు .. రేపు ఉత్తర్వులు..!
Also Read
- Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
- Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
ప్రపంచస్థాయి వ్యాపారాలు నిర్మించడం ద్వారా భారతదేశాన్ని సుసంపన్నంగా చేయడమే రిలయన్స్ లక్ష్యం అని అని అన్నారు. ప్రపంచం మొత్తం 21 శతాబ్ధాన్ని ‘భారతదేశ’ శతాబ్ధంగా చూస్తోందని.. మన ప్రధాని నరేంద్రమోదీ ఈ కాలాన్ని ‘భారతదేశ అమృత కాలం’గా అభివర్ణిస్తున్నారని తెలిపారు. రాబోయే 25 ఏళ్లు భారతదేశ 5 వేల ఏళ్ల చరిత్రలో అత్యంత పరివర్తన చెందుతుందని.. 2047 నాటికి భారత్ 40 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యువత, పరిణితి చెందిన ప్రజాస్వామ్యం, సాంకేతిక శక్తి భారతదేశాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాయని అన్నారు.
పేదరికం, కొరత నుంచి ప్రస్తుతం భారతదేశం 140 కోట్ల భారతీయులకు జీవిత నాణ్యత, సమ్మిళిత శ్రేయస్సు, సమృద్ధి అవకాశాలు, అభివృద్ధి యుగంలోకి ప్రవేశించిందని ముఖేష్ అంబానీ అన్నారు. భారతదేశం అంతటా 5జీ నెట్వర్క్ ను అందుబాటులోకి తీసుకువచ్చినందుకు ముఖేష్ అంబానీ, కుమారుడు ఆకాష్ ను ప్రశంసించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ 5జీ నెట్వర్క్ ను జియో అందిస్తుందని..2023 నాటకి డిజిటల్ కనెక్టవిటీ వ్యాపారంలో నెంబర్ 1గా నిలుస్తామని అన్నారు. నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, అధిక ఉత్పాదకత, ఆర్థిక కార్యకలాపాకలు భారతీయులు ఎప్పటికి దూరం కాబోరని ముఖేష్ అంబానీ హామీ ఇచ్చారు. ప్రతీ గ్రామంలో 5జీ కనెక్టవిటీ ఉంటుందని.. దేశాన్ని చాలా కాలంగా పట్టి పీడిస్తున్న గ్రామీణ-పట్టణ తారతమ్యాలు పూర్తిగా రూపుమాపుతాం అని అన్నారు. న్యూ ఎనర్జీ అనేది రిలయన్స్ సరికొత్త సార్ట్ అప్ వ్యాపారమని.. ఇది కేవలం కంపెనీ, దేశానికే కాకుండా మొత్తం ప్రపంచాన్ని మార్చగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!