INDIA bloc Rift widens: ‘ఇండియా’ కూటమిలో చీలిక.. మమతాకి నాయకత్వం అప్పగించాలని డిమాండ్
- ఇండియా కూటమిలో చీలికలు..
- మమతా బెనర్జీకి కూటమి బాధ్యతలు అప్పగించాలని లాలూ ప్రసాద్ డిమాండ్..
- ఇండియా బ్లాక్ బాధ్యతలను దీదీకి ఇవ్వాలని కోరిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA bloc Rift Widens: ఇండియా కూటమిలో చీలిక వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కూటమి అధ్యక్ష బాధ్యతలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అప్పగించాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. దానికి కాంగ్రెస్ పార్టీకి కూడా ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మమతకు తాము మద్దతు ఇస్తామని ఆయన ఈ రోజు (డిసెంబర్ 10) పాట్నాలో వెల్లడించారు. బెంగాల్ సీఎంకు ఇండియా బ్లాక్ బాధ్యతలు అప్పగిస్తే.. 2025లో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెప్పుకొచ్చారు.
Read Also: Supreme Court: ఉచితాలు ఇంకెంత కాలం?.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
అలాగే, దేశవ్యాప్తంగా కాంగ్రెస్పై వ్యతిరేకత వల్ల ఇండియా కూటమిలో ఎలాంటి మార్పు రాదని బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. అంతకుముందు ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ కూడా మమతా బెనర్జీ కూటమికి నాయకత్వం వహించడంలో ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. ఇండియా బ్లాక్ లోని అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో తుది నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు.
Read Also: AUS vs IND: భారత్- ఆసీస్ మధ్య బాక్సింగ్ డే టెస్టు.. హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు
మరోవైపు ఇండియా కూటమి అధ్యక్ష బాధ్యతలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అప్పగించాలని ఇప్పటికే టీఎంసీ పార్టీలో డిమాండ్ వినిపిస్తుంది. బీజేపీని పలుమార్లు మమతా ఓడించారని.. అలాంటిది భారత కూటమి బాధ్యతలు ఆమెకు అప్పగించడం మంచిదని ఎంపీ కీర్తి ఆజాద్ పేర్కొన్నారు. అయితే, భాగస్వామ్య పక్షాలు కోరితే ఈ కూటమికి నాయకత్వం వహించేందుకు తాను రెడీగా ఉన్నానని ఇప్పటికే మమతా బెనర్జీ తేల్చి చెప్పింది. దీంతో ఇండియా బ్లాక్ లో చర్చ ప్రారంభమైంది. అయితే, మమతా బెనర్జీ చేసిన ప్రకటనపై కూటమిలోని భాగస్వామ్య పక్షాల నుంచి కూడా మద్దతు లభిస్తుంది.
Read Also: Zelensky: నేనంటే రష్యా అధ్యక్షుడికి భయం.. తర్వలోనే యుద్ధం ముగుస్తుంది!
అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే చేతిలో ఓడిపోయేంత వరకు బీజేపీకి సన్నిహితంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి నాయకత్వాన్ని మమతా బెనర్జీకి అప్పగించాలని తన వాయిస్ ని వినిపించింది. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.. అందులో, మమతా బెనర్జీ భారత కూటమికి నాయకత్వం వహించడానికి అన్ని రకాలుగా అర్హురాలని తెలిపారు. దీదీ కూడా 42 లోక్సభ స్థానాలతో ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తన సత్తా ఏంటో నిరూపించుకున్నారని వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Hon’ble West Bengal Chief Minister Didi Mamta Ji is an ideal candidate to lead the INDIA alliance as she has the required political and electoral experience to head an alliance. Didi is also the CM of a large state with 42 Lok Sabha seats and has proven herself time and again.…
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 9, 2024
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?