INDIA bloc Rift widens: ‘ఇండియా’ కూటమిలో చీలిక.. మమతాకి నాయకత్వం అప్పగించాలని డిమాండ్
- ఇండియా కూటమిలో చీలికలు..
- మమతా బెనర్జీకి కూటమి బాధ్యతలు అప్పగించాలని లాలూ ప్రసాద్ డిమాండ్..
- ఇండియా బ్లాక్ బాధ్యతలను దీదీకి ఇవ్వాలని కోరిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
INDIA bloc Rift Widens: ఇండియా కూటమిలో చీలిక వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కూటమి అధ్యక్ష బాధ్యతలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అప్పగించాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. దానికి కాంగ్రెస్ పార్టీకి కూడా ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మమతకు తాము మద్దతు ఇస్తామని ఆయన ఈ రోజు (డిసెంబర్ 10) పాట్నాలో వెల్లడించారు. బెంగాల్ సీఎంకు ఇండియా బ్లాక్ బాధ్యతలు అప్పగిస్తే.. 2025లో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెప్పుకొచ్చారు.
Read Also: Supreme Court: ఉచితాలు ఇంకెంత కాలం?.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
అలాగే, దేశవ్యాప్తంగా కాంగ్రెస్పై వ్యతిరేకత వల్ల ఇండియా కూటమిలో ఎలాంటి మార్పు రాదని బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. అంతకుముందు ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ కూడా మమతా బెనర్జీ కూటమికి నాయకత్వం వహించడంలో ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. ఇండియా బ్లాక్ లోని అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో తుది నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు.
Read Also: AUS vs IND: భారత్- ఆసీస్ మధ్య బాక్సింగ్ డే టెస్టు.. హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు
మరోవైపు ఇండియా కూటమి అధ్యక్ష బాధ్యతలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అప్పగించాలని ఇప్పటికే టీఎంసీ పార్టీలో డిమాండ్ వినిపిస్తుంది. బీజేపీని పలుమార్లు మమతా ఓడించారని.. అలాంటిది భారత కూటమి బాధ్యతలు ఆమెకు అప్పగించడం మంచిదని ఎంపీ కీర్తి ఆజాద్ పేర్కొన్నారు. అయితే, భాగస్వామ్య పక్షాలు కోరితే ఈ కూటమికి నాయకత్వం వహించేందుకు తాను రెడీగా ఉన్నానని ఇప్పటికే మమతా బెనర్జీ తేల్చి చెప్పింది. దీంతో ఇండియా బ్లాక్ లో చర్చ ప్రారంభమైంది. అయితే, మమతా బెనర్జీ చేసిన ప్రకటనపై కూటమిలోని భాగస్వామ్య పక్షాల నుంచి కూడా మద్దతు లభిస్తుంది.
Read Also: Zelensky: నేనంటే రష్యా అధ్యక్షుడికి భయం.. తర్వలోనే యుద్ధం ముగుస్తుంది!
అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే చేతిలో ఓడిపోయేంత వరకు బీజేపీకి సన్నిహితంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి నాయకత్వాన్ని మమతా బెనర్జీకి అప్పగించాలని తన వాయిస్ ని వినిపించింది. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.. అందులో, మమతా బెనర్జీ భారత కూటమికి నాయకత్వం వహించడానికి అన్ని రకాలుగా అర్హురాలని తెలిపారు. దీదీ కూడా 42 లోక్సభ స్థానాలతో ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తన సత్తా ఏంటో నిరూపించుకున్నారని వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Hon’ble West Bengal Chief Minister Didi Mamta Ji is an ideal candidate to lead the INDIA alliance as she has the required political and electoral experience to head an alliance. Didi is also the CM of a large state with 42 Lok Sabha seats and has proven herself time and again.…
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 9, 2024
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!