INDIA bloc Rift widens: ‘ఇండియా’ కూటమిలో చీలిక.. మమతాకి నాయకత్వం అప్పగించాలని డిమాండ్
- ఇండియా కూటమిలో చీలికలు..
- మమతా బెనర్జీకి కూటమి బాధ్యతలు అప్పగించాలని లాలూ ప్రసాద్ డిమాండ్..
- ఇండియా బ్లాక్ బాధ్యతలను దీదీకి ఇవ్వాలని కోరిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA bloc Rift Widens: ఇండియా కూటమిలో చీలిక వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కూటమి అధ్యక్ష బాధ్యతలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అప్పగించాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. దానికి కాంగ్రెస్ పార్టీకి కూడా ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మమతకు తాము మద్దతు ఇస్తామని ఆయన ఈ రోజు (డిసెంబర్ 10) పాట్నాలో వెల్లడించారు. బెంగాల్ సీఎంకు ఇండియా బ్లాక్ బాధ్యతలు అప్పగిస్తే.. 2025లో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెప్పుకొచ్చారు.
Read Also: Supreme Court: ఉచితాలు ఇంకెంత కాలం?.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
Also Read
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Mamata Banerjee: రాజకీయ అహంకారానికి పేదలే మూల్యం చెల్లిస్తున్నారు.. బెంగాల్లో బుల్డోజర్ చర్యలపై మమతా ఫైర్
- UDF Kerala Government: కేరళంలో ‘యూడీఎఫ్’ నూతన శకం.. నేడే సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం! మంత్రుల జాబితా ఇదే..
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
అలాగే, దేశవ్యాప్తంగా కాంగ్రెస్పై వ్యతిరేకత వల్ల ఇండియా కూటమిలో ఎలాంటి మార్పు రాదని బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. అంతకుముందు ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ కూడా మమతా బెనర్జీ కూటమికి నాయకత్వం వహించడంలో ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. ఇండియా బ్లాక్ లోని అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో తుది నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు.
Read Also: AUS vs IND: భారత్- ఆసీస్ మధ్య బాక్సింగ్ డే టెస్టు.. హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు
మరోవైపు ఇండియా కూటమి అధ్యక్ష బాధ్యతలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అప్పగించాలని ఇప్పటికే టీఎంసీ పార్టీలో డిమాండ్ వినిపిస్తుంది. బీజేపీని పలుమార్లు మమతా ఓడించారని.. అలాంటిది భారత కూటమి బాధ్యతలు ఆమెకు అప్పగించడం మంచిదని ఎంపీ కీర్తి ఆజాద్ పేర్కొన్నారు. అయితే, భాగస్వామ్య పక్షాలు కోరితే ఈ కూటమికి నాయకత్వం వహించేందుకు తాను రెడీగా ఉన్నానని ఇప్పటికే మమతా బెనర్జీ తేల్చి చెప్పింది. దీంతో ఇండియా బ్లాక్ లో చర్చ ప్రారంభమైంది. అయితే, మమతా బెనర్జీ చేసిన ప్రకటనపై కూటమిలోని భాగస్వామ్య పక్షాల నుంచి కూడా మద్దతు లభిస్తుంది.
Read Also: Zelensky: నేనంటే రష్యా అధ్యక్షుడికి భయం.. తర్వలోనే యుద్ధం ముగుస్తుంది!
అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే చేతిలో ఓడిపోయేంత వరకు బీజేపీకి సన్నిహితంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి నాయకత్వాన్ని మమతా బెనర్జీకి అప్పగించాలని తన వాయిస్ ని వినిపించింది. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.. అందులో, మమతా బెనర్జీ భారత కూటమికి నాయకత్వం వహించడానికి అన్ని రకాలుగా అర్హురాలని తెలిపారు. దీదీ కూడా 42 లోక్సభ స్థానాలతో ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తన సత్తా ఏంటో నిరూపించుకున్నారని వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Hon’ble West Bengal Chief Minister Didi Mamta Ji is an ideal candidate to lead the INDIA alliance as she has the required political and electoral experience to head an alliance. Didi is also the CM of a large state with 42 Lok Sabha seats and has proven herself time and again.…
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 9, 2024
తాజావార్తలు
-
Sreeleela: శ్రీలీల – తిలక్ వర్మ రిలేషన్షిప్పై షాకింగ్ ట్విస్ట్..!
-
Kumar Sangakkara: “వైభవ్తో క్రికెట్ ముచ్చట్లు పెట్టను”.. బుడ్డోడి సీక్రెట్ లీక్ చేసిన రాజస్థాన్ హెడ్ కోచ్..
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Mamata Banerjee: రాజకీయ అహంకారానికి పేదలే మూల్యం చెల్లిస్తున్నారు.. బెంగాల్లో బుల్డోజర్ చర్యలపై మమతా ఫైర్
-
UDF Kerala Government: కేరళంలో ‘యూడీఎఫ్’ నూతన శకం.. నేడే సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం! మంత్రుల జాబితా ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..