Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News India Bloc In Pieces Amid Turmoil Architect Nitish Kumar On Way Out

INDIA Bloc: ఎన్నికలకు ముందే ఇండియా కూటమి ముక్కలు..? ఒక్కోక్కరిగా బయటకు వెళ్తున్న నేతలు..

Published Date :January 25, 2024 , 6:15 pm
By Venu Goapl Reddy
INDIA Bloc: ఎన్నికలకు ముందే ఇండియా కూటమి ముక్కలు..? ఒక్కోక్కరిగా బయటకు వెళ్తున్న నేతలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

INDIA Bloc: 2024 లోక్‌సభ ఎన్నికల ముందే ఇండియా కూటమి ముక్కలు అవుతుందా..? ప్రధాని నరేంద్రమోడీని గద్దె దింపేందుకు, బీజేపీ నుంచి అధికారాన్ని లాక్కోవాలని దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. అయితే, ఆ లక్ష్యం నెరవేరక ముందే అన్ని ప్రతిపక్ష పార్టీలు కూటమిని వదిలేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మమతా బెనర్జీ కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని, పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా ఒంటరి పోరనే చెప్పింది.

తాజాగా బీహార్ రాజకీయాల్లో పరిణామాలు కూడా ఇండియా కూటమికి ఝలక్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. ఇండియా కూటమి సృష్టికర్తల్లో ఒకరిగా పేరున్న బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ కూటమి నుంచి వైదొలగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోసారి తన పాత మిత్రుడు బీజేపీతో జతకట్టేందుకు నితీష్ కుమార్ చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ప్రధానమైన మూడు పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చాయి. మధ్యప్రదేశ్ ఎన్నికల ముందే సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ మధ్య విభేదాలు తలెత్తాయి. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కోరిన సీట్లను ఇచ్చేందుకు కాంగ్రెస్ ససేమిరా అంది. దీంతో అప్పటి నుంచి ఎస్పీ కూటమికి అంటీముట్టనట్లు వ్యవహరిస్తోంది.

Also Read

  • India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్‌ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
  • SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
  • Producing States in India: భారత్‌లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
  • Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు..

ఈ నెల 29న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ బీహార్‌లోకి ప్రవేశించనుంది. ఈ యాత్రలో నితీష్ కుమార్ పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇండియా కూటమి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉంటే కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, కేరళలో సీపీఎం, కాంగ్రెస్‌లకు పడటం లేదు. చివరకు రాహుల్ గాంధీ వయనాడ్‌లోనూ పోటీ చేస్తామని కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటికే చెప్పింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్, తృణమూల్ మధ్య చిచ్చుకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి కారణమని టీఎంసీ ఎంపి డెరెక్ ఓబ్రెయిన్ ఆరోపించారు. ఇండియా కూటమిని కూల్చేందుకు బీజేపీ తరుపున ఆయన పనిచేస్తున్నట్లు టీఎంసీ ఆరోపించింది.

Read Also: Bihar Politics: బీహార్ రాజకీయాల్లో సంచలనం.. సీఎం నితీష్‌ని గద్దె దింపేందుకు లాలూ ప్లాన్.?

5 రాష్ట్రాల ఫలితాలు, రామ మందిరమే మూడ్‌ని మార్చిందా..?

గతేడాది చివర్లో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలు ఇండియా కూటమిలో అభద్రతను పెంచాయా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లను బీజేపీ చేతుల్లో పెట్టింది. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తిరుగులేని విజయాన్ని సాధించింది బీజేపీ. తెలంగాణలో గెలిచినప్పటికీ, అది పూర్తిగా కాంగ్రెస్ గెలుపు కన్నా టీఆర్ఎస్ తప్పిదాలే అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మిజోరాంలో కూడా బీజేపీ అనుకూల ప్రభుత్వమే ఉంది.

2024 లోక్‌సభ ఎన్నికలకు కొన్ని రోజలు ముందు దేశ ప్రజల మూడ్‌ని తెలిపే ఎన్నికల్లో మరోసారి బీజేపీ సత్తా చాటడంతో కాంగ్రెస్ మీదు టీఎంసీ, జేడీయూ, ఆప్ వంటి పార్టీలు అపనమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంతో బీజేపీ ఇప్పటికే దేశంలోని ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది. ఇండియా కూటమిలో మాత్రం ఇంకా సీట్ల పంపకాలపై సయోధ్య కుదరడం లేదు. జేడీయూ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నుంచే కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2024 Lok Sabha elections
  • bjp
  • CM Nitish Kumar
  • INDIA Bloc
  • Mamata Banerjee

తాజావార్తలు

  • Astrology: ఏప్రిల్‌ 28, మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..!

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions