Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News India Bloc In Pieces Amid Turmoil Architect Nitish Kumar On Way Out

INDIA Bloc: ఎన్నికలకు ముందే ఇండియా కూటమి ముక్కలు..? ఒక్కోక్కరిగా బయటకు వెళ్తున్న నేతలు..

NTV Telugu Twitter
Published Date :January 25, 2024 , 6:15 pm
By venugopal reddy
INDIA Bloc: ఎన్నికలకు ముందే ఇండియా కూటమి ముక్కలు..? ఒక్కోక్కరిగా బయటకు వెళ్తున్న నేతలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

INDIA Bloc: 2024 లోక్‌సభ ఎన్నికల ముందే ఇండియా కూటమి ముక్కలు అవుతుందా..? ప్రధాని నరేంద్రమోడీని గద్దె దింపేందుకు, బీజేపీ నుంచి అధికారాన్ని లాక్కోవాలని దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. అయితే, ఆ లక్ష్యం నెరవేరక ముందే అన్ని ప్రతిపక్ష పార్టీలు కూటమిని వదిలేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మమతా బెనర్జీ కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని, పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా ఒంటరి పోరనే చెప్పింది.

తాజాగా బీహార్ రాజకీయాల్లో పరిణామాలు కూడా ఇండియా కూటమికి ఝలక్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. ఇండియా కూటమి సృష్టికర్తల్లో ఒకరిగా పేరున్న బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ కూటమి నుంచి వైదొలగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోసారి తన పాత మిత్రుడు బీజేపీతో జతకట్టేందుకు నితీష్ కుమార్ చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ప్రధానమైన మూడు పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చాయి. మధ్యప్రదేశ్ ఎన్నికల ముందే సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ మధ్య విభేదాలు తలెత్తాయి. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కోరిన సీట్లను ఇచ్చేందుకు కాంగ్రెస్ ససేమిరా అంది. దీంతో అప్పటి నుంచి ఎస్పీ కూటమికి అంటీముట్టనట్లు వ్యవహరిస్తోంది.

ఈ నెల 29న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ బీహార్‌లోకి ప్రవేశించనుంది. ఈ యాత్రలో నితీష్ కుమార్ పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇండియా కూటమి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉంటే కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, కేరళలో సీపీఎం, కాంగ్రెస్‌లకు పడటం లేదు. చివరకు రాహుల్ గాంధీ వయనాడ్‌లోనూ పోటీ చేస్తామని కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటికే చెప్పింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్, తృణమూల్ మధ్య చిచ్చుకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి కారణమని టీఎంసీ ఎంపి డెరెక్ ఓబ్రెయిన్ ఆరోపించారు. ఇండియా కూటమిని కూల్చేందుకు బీజేపీ తరుపున ఆయన పనిచేస్తున్నట్లు టీఎంసీ ఆరోపించింది.

Read Also: Bihar Politics: బీహార్ రాజకీయాల్లో సంచలనం.. సీఎం నితీష్‌ని గద్దె దింపేందుకు లాలూ ప్లాన్.?

5 రాష్ట్రాల ఫలితాలు, రామ మందిరమే మూడ్‌ని మార్చిందా..?

గతేడాది చివర్లో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలు ఇండియా కూటమిలో అభద్రతను పెంచాయా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లను బీజేపీ చేతుల్లో పెట్టింది. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తిరుగులేని విజయాన్ని సాధించింది బీజేపీ. తెలంగాణలో గెలిచినప్పటికీ, అది పూర్తిగా కాంగ్రెస్ గెలుపు కన్నా టీఆర్ఎస్ తప్పిదాలే అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మిజోరాంలో కూడా బీజేపీ అనుకూల ప్రభుత్వమే ఉంది.

2024 లోక్‌సభ ఎన్నికలకు కొన్ని రోజలు ముందు దేశ ప్రజల మూడ్‌ని తెలిపే ఎన్నికల్లో మరోసారి బీజేపీ సత్తా చాటడంతో కాంగ్రెస్ మీదు టీఎంసీ, జేడీయూ, ఆప్ వంటి పార్టీలు అపనమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంతో బీజేపీ ఇప్పటికే దేశంలోని ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది. ఇండియా కూటమిలో మాత్రం ఇంకా సీట్ల పంపకాలపై సయోధ్య కుదరడం లేదు. జేడీయూ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నుంచే కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2024 Lok Sabha elections
  • bjp
  • CM Nitish Kumar
  • INDIA Bloc
  • Mamata Banerjee

తాజావార్తలు

  • RCB-IPL 2025: ఫైనల్‌లో ఆర్‌సీబీ గెలుస్తుంది.. జోస్యం చెప్పిన మిస్టర్ 360!

  • CM Chandrababu: కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నాం..!

  • HHVM : పవన్ మాట.. ఛాంబర్ వద్దకు ఏఎం రత్నం..

  • Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో భారత్‌ “ఘన విజయం”.. అమెరికా సైనిక నిపుణుడు..

  • ACB: ఏసీబీ అధికారుల సోదాలు.. కిటికీ నుంచి రూ. 2 కోట్లు బయటపడేసిన అవినీతి అధికారి

ట్రెండింగ్‌

  • Moto g86 Series: మోటొరోలా నుంచి మోటో G86 పవర్ 5G, మోటో G86 5G, మోటో G56 5G మూడు కొత్త 5G ఫోన్లు లాంచ్…!

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions