భారత్లో పెరిగిన బిలియనీర్లు.. వీళ్ల దగ్గర అంత సంపద ఉందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో బిలియనీర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత రెండేళ్లలో బిలియనీర్ల సంఖ్య 39 శాతం పెరిగి 102 నుంచి 142కి పెరిగింది. ఈ వివరాలను తాజాగా ఆక్స్ ఫామ్ ఇండియా విడుదల చేసింది. 2021 నాటికి భారత్లో 142 మంది బిలియనీర్లు ఉండగా… వీరి దగ్గర ఉన్న ఉమ్మడి సంపద విలువ 719 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అంటే భారత కరెన్సీలో 53 లక్షల కోట్లు అన్నమాట. దేశంలోని 55.5 కోట్ల ప్రజల వద్ద ఎంత సంపద అయితే ఉందో… 98 మంది సంపన్నుల దగ్గర సుమారు అంతే సంపద (రూ.49 లక్షల కోట్లు) ఉందని ఆక్స్ఫామ్ నివేదిక వెల్లడించింది.
Read Also: నక్క తోక తొక్కిన పెయింటర్.. లాటరీలో రూ.12 కోట్ల జాక్పాట్
Also Read
భారత్లోని టాప్-10 ధనవంతుల దగ్గర ఉన్న సంపదతో దేశంలోని పిల్లలందరికీ పాఠశాల, ఉన్నత విద్యను 25 ఏళ్ల పాటు ఉచితంగా అందించొచ్చని ఆక్స్ఫామ్ నివేదిక అభిప్రాయపడింది. అటు భారత్లోని టాప్ 98 మంది ధనవంతుల వద్ద ఉన్న డబ్బుతో ఆయుష్మాన్ భారత్ (ఆరోగ్యశ్రీ తరహా) పథకానికి కావాల్సిన నిధులను సమకూర్చుకోవచ్చని తెలిపింది. దేశంలోని 10 మంది అత్యంత సంపన్నులు రోజూ మిలియన్ డాలర్ల చొప్పున (రూ.7.4కోట్లు) ఖర్చు పెట్టుకుంటూ వెళ్లినా వారి సంపద కరిగిపోయేందుకు 84 ఏళ్లు పడుతుందని ఆక్స్ ఫామ్ నివేదిక అంచనా వేసింది. కాగా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు దావోస్ వేదికగా ఈరోజు జరగనుంది. వర్చువల్గా జరిగే ఈ సదస్సులో ఆక్స్ఫామ్ తాజా సర్వే వివరాలను వెల్లడించనుంది. ఈ సదస్సును ఉద్దేశించి రాత్రి 8:30 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!