Amit Shah: పాక్ వద్ద అణుబాంబులు ఉంటే పీఓకేని వదిలేయాలా..? కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై అమిత్ షా ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయి, వారితో సఖ్యతగా వ్యవహరించాలి, పీఓకేని అడగొద్దని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రధాని నరేంద్రమోడీతో పాటు మిగతా బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అయ్యర్ వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు. కౌశాంబి లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మణిశంకర్ అయ్యార్, ఫరూఖ్ అబ్దు్ల్లాలు అణుబాంబు ఉన్నందున పాకిస్తాన్ని గౌరవించాలని, పాక్ ఆక్రమిక కాశ్మీర్ అడగొద్దని చెప్పారు. రాహుల్ బాబా మీరు అణుబాంబుకు భయపడుతున్నారు, మేం భయపడటం లేదు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భారత్కి చెందినది, దాన్ని మేం తిరిగి పొందుతాం’’ అన్నారు.
Read Also: Polling Centers: వేములవాడలో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు..
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
మణిశంకర్ అయ్యర్ వైరల్ వీడియోలో మాట్లాడుతూ..పాకిస్తాన్ సార్వభౌమాధికార దేశం, భారత్ దానికి గౌరవం ఇవ్వాలి, వారి వద్ద అణు బాంబులు ఉన్నాయని చెప్పారు. ఎవరైనా పిచ్చివాడు లాహోర్పై బాంబు వేస్తే దాని ప్రభావం అమృత్ సర్పై ఉంటుందని ఆయన అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ దూరంగా ఉంది, తమకు అయ్యర్ తో సంబంధం లేదని చెప్పింది. అంతకుముందు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, పీఓకేని భారత్ స్వాధీనం చేసుకుంటుందని అన్నారు. ఆయన వ్యాఖ్యలకు కాశ్మీరీ నేత ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ.. పాకిస్తాన్ గాజులు తొడుక్కొని లేదని, వారి వద్ద అణుబాంబులు ఉన్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కూడా దుమారం రేగింది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!