Amit Shah: పాక్ వద్ద అణుబాంబులు ఉంటే పీఓకేని వదిలేయాలా..? కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై అమిత్ షా ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయి, వారితో సఖ్యతగా వ్యవహరించాలి, పీఓకేని అడగొద్దని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రధాని నరేంద్రమోడీతో పాటు మిగతా బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అయ్యర్ వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు. కౌశాంబి లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మణిశంకర్ అయ్యార్, ఫరూఖ్ అబ్దు్ల్లాలు అణుబాంబు ఉన్నందున పాకిస్తాన్ని గౌరవించాలని, పాక్ ఆక్రమిక కాశ్మీర్ అడగొద్దని చెప్పారు. రాహుల్ బాబా మీరు అణుబాంబుకు భయపడుతున్నారు, మేం భయపడటం లేదు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భారత్కి చెందినది, దాన్ని మేం తిరిగి పొందుతాం’’ అన్నారు.
Read Also: Polling Centers: వేములవాడలో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు..
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
మణిశంకర్ అయ్యర్ వైరల్ వీడియోలో మాట్లాడుతూ..పాకిస్తాన్ సార్వభౌమాధికార దేశం, భారత్ దానికి గౌరవం ఇవ్వాలి, వారి వద్ద అణు బాంబులు ఉన్నాయని చెప్పారు. ఎవరైనా పిచ్చివాడు లాహోర్పై బాంబు వేస్తే దాని ప్రభావం అమృత్ సర్పై ఉంటుందని ఆయన అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ దూరంగా ఉంది, తమకు అయ్యర్ తో సంబంధం లేదని చెప్పింది. అంతకుముందు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, పీఓకేని భారత్ స్వాధీనం చేసుకుంటుందని అన్నారు. ఆయన వ్యాఖ్యలకు కాశ్మీరీ నేత ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ.. పాకిస్తాన్ గాజులు తొడుక్కొని లేదని, వారి వద్ద అణుబాంబులు ఉన్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కూడా దుమారం రేగింది.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!