Polling Centers: వేములవాడలో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Polling Centers: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో రేపు జరిగే పార్లమెంటు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 1500 మంది పోలీసులతో పాటు కేంద్రపాలగాలతో భారీ బందోబస్తు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 318 పోలింగ్ ప్రాంతాలుండగా, 560 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో 48 సమస్యాత్మక ప్రాంతాలుగా, 58 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి పోలింగ్ సామాగ్రితో పోలింగ్ సిబ్బంది వెళ్తున్నారు.
Read also: Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్ కింద దర్శనమిచ్చిన ఖలిస్థాన్ కు మద్దతుగా నినాదాలు
Also Read
ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్ జరుగుతుంది. వేములవాడ నియోజకవర్గంలో మొత్తం 2,26,188 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 1,08,091, మహిళలు 1,18,065, ఇతరులు 32 మంది ఉన్నారు. ఇక 1500 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో లోక్ సభ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు పూర్తయ్యాయి. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక కేంద్ర బలగాల పహారా కాస్తున్నారు. జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్ వెల్లడించారు. మొత్తం పోలింగ్ ప్రాంతాలు 318 కాగా.. పోలింగ్ కేంద్రాలు 560 ఉన్నాయి. క్రిటికల్ ప్రాంతాలు 48 ఉండగా.. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు 58గా వున్నాయి.
Read also: Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్ కింద దర్శనమిచ్చిన ఖలిస్థాన్ కు మద్దతుగా నినాదాలు
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన రోజు నుండి స్వాధీన పరుచుకున్న వాటి వివరాలు:
1. స్వాధీనపరచుకున్న నగదు 82,11,362/- రూపాయలు.
2.లిక్కర్ లీటర్ల లో 1664.93 సుమారుగా అంచనా విలువ 10,20,222 /-రూపాయలు.
3.గంజాయి, 9 కిలోల 209 గ్రాముల గంజాయి, 16 కేసులు నమోదు
4.జిల్లాలో ఇప్పటివరకు 446 కేసులలో 1078 మంది బైండోవర్.
6.ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై 16 కేసులు నమోదు.
7.జిల్లా లో ఉన్న మొత్తం 23 లైసెన్స్డ్ తుపాకులు డిపాజిట్.
Read also: Jammu Kashmir: బందిపొరాలో ఒక ఉగ్రవాది అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం
మరోవైపు నల్గొండ జిల్లా అనధికారికంగా ఎన్నికల విధులకు గైర్హాజరైన వారిపై కేసులు నమోదుకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ విధులకు రిపోర్ట్ చేయని పిఓ, ఏపిఓ, ఇతర పోలింగ్ సిబ్బందిపై కేసుల నమోదుకు కలెక్టర్ ఉపక్రమించారు. నాగార్జునసాగర్, మునుగోడు, నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సిబ్బంది గైర్హాజరయ్యారు. దీంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Accident : రీల్ పిచ్చితో ట్రైన్ ఎక్కి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కష్టమే!
-
Iran: “నరకం చూపిస్తాం”.. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
-
Suzuki GSX250R: సుజుకీ GSX250R ఆవిష్కరణ.. భారత్లో కూడా విడుదలవుతుందా?
-
Imad Wasim: మాజీ భార్య సంచలన ఆరోపణలు.. మౌనం వీడిన పాక్ క్రికెటర్ ఇమాద్ వసీం
-
Phone, Laptop: వాడిన ఫోన్ లేదా ల్యాప్టాప్ కొనాలని ఆలోచిస్తున్నారా? ఈ విషయాలు మర్చిపోకండి..!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!