Adhir Ranjan: నేను మమతా బెనర్జీని నమ్మను.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adhir Ranjan: కాంగ్రెస్ చీఫ్, బెంగాల్ పీసీసీ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి మరోసారి తృణమూల్ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తాను బయట నుంచి మద్దతు ఇస్తానని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘ నేను ఆమెను నమ్మను, ఆమె కూటమిని విడిచిపెట్టింది. బీజేపీ వైపు వెళ్లవచ్చు’’ అని అన్నారు. ఆమె కూటమి బయట, లోపల ఏం చేస్తుందో నాకు తెలియదని అన్నారు.
Read Also: Isro: శక్తివంతమైన “సౌర తుఫాను” నుంచి ఇస్రో మన శాటిలైట్లను ఎలా రక్షించింది..?
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
గతంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ బెంగాల్లో కాంగ్రెస్-టీఎంసీ పోటీకి అధిర్ రంజన్ అడ్డుపడ్డాడని వ్యాఖ్యానించి, సొంతగా పోటీ చేసింది. అధిర్ రంజన్-మమతా మధ్య గత కొన్ని రోజులుగా వైరం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన నుంచి తాజా వ్యాఖ్యలు వచ్చాయి. ప్రస్తుతం దేశంలో 70 శాతం స్థానాలకు పోలింగ్ ముగిసిన తర్వాత, ఆమె నుంచి యూటర్న్ వచ్చిందని అన్నారు. గతంలో కాంగ్రెస్కి 40 సీట్లు రావని మమతా బెనర్జీ చెప్పారని, కాంగ్రెస్ నాశనం గురించి మాట్లాడారని, ఇప్పుడు కాంగ్రెస్, ఇండియా కూటమికి అనుకూలంగా మాట్లాడటం బట్టి చూస్తే కూటమి అధికారంలోకి వస్తుందని తెలుస్తోందని అధిర్ అన్నారు.
మమతా బెనర్జీ కాంగ్రెస్, సీపీఎంలను మిత్ర పక్షాలుగా చూడలేదని ఆయన స్పష్టం చేశారు. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్-సీపీఎం పార్టీలు బెంగాల్లో పొత్తు పెట్టుకుని, టీఎంసీకి, బీజేపీకి వ్యతిరేకంగా తన అభ్యర్థులను నిలిపాయి. బెంగాల్లో మొత్తం 42 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో టీఎంసీ 22 గెలుచుకుంటే, బీజేపీ 18 సీట్లను సాధించింది, కాంగ్రెస్ 2 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!