Omar Abdullah: రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తా.. అంతమాత్రాన బీజేపీతో జతకట్టి కాదు
- జమ్ముకశ్మీర్లో అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తాం..
- ఇలా చేయడం బీజేపీ పార్టీతో కలిసినట్టు కాదు అని వెల్లడి..
- రాష్ట్ర ప్రయోజనాల కోసమే మోడీ, అమిత్ షాలను కలిశా: సీఎం ఒమర్ అబ్దుల్లా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Omar Abdullah: జమ్ముకశ్మీర్లో అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను అని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగించడమే తమ లక్ష్యం.. ఇలా చేయడం భారతీయ జనతా పార్టీతో కలిసినట్టు కాదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు. కేంద్రంలో ఎవరు ఉన్నా తాము ఇలాగే కలిసి ముందుకెళ్తామని సీఎం ఒమర్ అబ్దుల్లా కన్వాల్లో ఓ జాతీయ చానెల్తో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు.
Read Also: BRS Rythu Dharna: నేడు షాబాద్లో బీఆర్ఎస్ రైతు ధర్నా.. అన్నదాతలకు మద్దతుగా రామన్న!
Also Read
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
- India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
ఇక, రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాను కలిశాను అని సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. నేను కేంద్ర సర్కార్ తీరు పట్ల సానుకూలంగా ఏమీ లేను అన్నారు. ప్రభుత్వంతో కలిసి పని చేయడం అంటే వారు చేసే ప్రతిదాన్ని నేను అంగీకరిస్తున్నట్లు కాదని చెప్పారు. జమ్ముకశ్మీర్కు సంబంధించిన అంశాలపై మాత్రమే కేంద్రంతో సానుకూలంగా ఉంటున్నాను.. అంతమాత్రాన మేము బీజేపీకి సపోర్టు ఇచ్చినట్టు కాదని వెల్లడించారు. రాష్ట్రం పురోగతి సాధించాలంటే కేంద్ర ప్రభుత్వ అవసరం ఎంతో ముఖ్యం అన్నారు. అభివృద్ధి జరగడం, రాష్ట్ర హోదా పునరుద్ధరించడం మా ముందున్న ప్రధాన లక్ష్యాలు.. పార్టీలు ముఖ్యం కాదు.. కావాల్సింది అభివృద్దే అని పేర్కొన్నారు. అవసరం లేని చోట నేను కేంద్రంతో పోరాటం ఎంచుకోవాలా? అని క్వశ్చన్ చేశారు. కేంద్రం పట్ల వ్యతిరేక ధోరణితో ఉంటే రాష్ట్రానికే తీవ్ర నష్టం జరుగుతుందని ఒమర్ అబ్దుల్లా చెప్పుకొచ్చారు.
Read Also: Maharashtra: మహారాష్ట్రలో పులులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్
అయితే, గత ఏడాది నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ జమ్ము కశ్మీర్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒమర్ అబ్దుల్లా సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత రెండుసార్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఇటీవల సోనామార్గ్లో జరిగిన సొరంగం ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. దీంతో, ఒమర్- బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారనే న్యూస్ వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా తాజాగా చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Here’s the link to the #JabWeMet with @OmarAbdullah that’s been getting rave reviews https://t.co/zW0oXACoD8
The new Jammu and Kashmir CM in a never before seen avatar. pic.twitter.com/WUN7yUlDX1— Rahul Kanwal (@rahulkanwal) January 16, 2025
తాజావార్తలు
-
Tragedy: హైదరాబాద్లో భారీ వర్షానికి ఇద్దరు బలి..
-
India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
-
Zodiac Signs : రేపు ఈ 5 రాశుల వారికి ధనయోగం.. సౌభాగ్య, ఆయుష్మాన్ యోగాల అద్భుత కలయిక
-
Dhruva Yoga: జూన్ 17న ధ్రువ యోగం.. ఈ రాశుల వారికి జాక్పాట్..
-
Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!