Omar Abdullah: రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తా.. అంతమాత్రాన బీజేపీతో జతకట్టి కాదు
- జమ్ముకశ్మీర్లో అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తాం..
- ఇలా చేయడం బీజేపీ పార్టీతో కలిసినట్టు కాదు అని వెల్లడి..
- రాష్ట్ర ప్రయోజనాల కోసమే మోడీ, అమిత్ షాలను కలిశా: సీఎం ఒమర్ అబ్దుల్లా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Omar Abdullah: జమ్ముకశ్మీర్లో అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను అని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగించడమే తమ లక్ష్యం.. ఇలా చేయడం భారతీయ జనతా పార్టీతో కలిసినట్టు కాదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు. కేంద్రంలో ఎవరు ఉన్నా తాము ఇలాగే కలిసి ముందుకెళ్తామని సీఎం ఒమర్ అబ్దుల్లా కన్వాల్లో ఓ జాతీయ చానెల్తో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు.
Read Also: BRS Rythu Dharna: నేడు షాబాద్లో బీఆర్ఎస్ రైతు ధర్నా.. అన్నదాతలకు మద్దతుగా రామన్న!
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
ఇక, రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాను కలిశాను అని సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. నేను కేంద్ర సర్కార్ తీరు పట్ల సానుకూలంగా ఏమీ లేను అన్నారు. ప్రభుత్వంతో కలిసి పని చేయడం అంటే వారు చేసే ప్రతిదాన్ని నేను అంగీకరిస్తున్నట్లు కాదని చెప్పారు. జమ్ముకశ్మీర్కు సంబంధించిన అంశాలపై మాత్రమే కేంద్రంతో సానుకూలంగా ఉంటున్నాను.. అంతమాత్రాన మేము బీజేపీకి సపోర్టు ఇచ్చినట్టు కాదని వెల్లడించారు. రాష్ట్రం పురోగతి సాధించాలంటే కేంద్ర ప్రభుత్వ అవసరం ఎంతో ముఖ్యం అన్నారు. అభివృద్ధి జరగడం, రాష్ట్ర హోదా పునరుద్ధరించడం మా ముందున్న ప్రధాన లక్ష్యాలు.. పార్టీలు ముఖ్యం కాదు.. కావాల్సింది అభివృద్దే అని పేర్కొన్నారు. అవసరం లేని చోట నేను కేంద్రంతో పోరాటం ఎంచుకోవాలా? అని క్వశ్చన్ చేశారు. కేంద్రం పట్ల వ్యతిరేక ధోరణితో ఉంటే రాష్ట్రానికే తీవ్ర నష్టం జరుగుతుందని ఒమర్ అబ్దుల్లా చెప్పుకొచ్చారు.
Read Also: Maharashtra: మహారాష్ట్రలో పులులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్
అయితే, గత ఏడాది నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ జమ్ము కశ్మీర్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒమర్ అబ్దుల్లా సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత రెండుసార్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఇటీవల సోనామార్గ్లో జరిగిన సొరంగం ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. దీంతో, ఒమర్- బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారనే న్యూస్ వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా తాజాగా చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Here’s the link to the #JabWeMet with @OmarAbdullah that’s been getting rave reviews https://t.co/zW0oXACoD8
The new Jammu and Kashmir CM in a never before seen avatar. pic.twitter.com/WUN7yUlDX1— Rahul Kanwal (@rahulkanwal) January 16, 2025
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!