Omar Abdullah: రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తా.. అంతమాత్రాన బీజేపీతో జతకట్టి కాదు
- జమ్ముకశ్మీర్లో అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తాం..
- ఇలా చేయడం బీజేపీ పార్టీతో కలిసినట్టు కాదు అని వెల్లడి..
- రాష్ట్ర ప్రయోజనాల కోసమే మోడీ, అమిత్ షాలను కలిశా: సీఎం ఒమర్ అబ్దుల్లా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Omar Abdullah: జమ్ముకశ్మీర్లో అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను అని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగించడమే తమ లక్ష్యం.. ఇలా చేయడం భారతీయ జనతా పార్టీతో కలిసినట్టు కాదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు. కేంద్రంలో ఎవరు ఉన్నా తాము ఇలాగే కలిసి ముందుకెళ్తామని సీఎం ఒమర్ అబ్దుల్లా కన్వాల్లో ఓ జాతీయ చానెల్తో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు.
Read Also: BRS Rythu Dharna: నేడు షాబాద్లో బీఆర్ఎస్ రైతు ధర్నా.. అన్నదాతలకు మద్దతుగా రామన్న!
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
ఇక, రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాను కలిశాను అని సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. నేను కేంద్ర సర్కార్ తీరు పట్ల సానుకూలంగా ఏమీ లేను అన్నారు. ప్రభుత్వంతో కలిసి పని చేయడం అంటే వారు చేసే ప్రతిదాన్ని నేను అంగీకరిస్తున్నట్లు కాదని చెప్పారు. జమ్ముకశ్మీర్కు సంబంధించిన అంశాలపై మాత్రమే కేంద్రంతో సానుకూలంగా ఉంటున్నాను.. అంతమాత్రాన మేము బీజేపీకి సపోర్టు ఇచ్చినట్టు కాదని వెల్లడించారు. రాష్ట్రం పురోగతి సాధించాలంటే కేంద్ర ప్రభుత్వ అవసరం ఎంతో ముఖ్యం అన్నారు. అభివృద్ధి జరగడం, రాష్ట్ర హోదా పునరుద్ధరించడం మా ముందున్న ప్రధాన లక్ష్యాలు.. పార్టీలు ముఖ్యం కాదు.. కావాల్సింది అభివృద్దే అని పేర్కొన్నారు. అవసరం లేని చోట నేను కేంద్రంతో పోరాటం ఎంచుకోవాలా? అని క్వశ్చన్ చేశారు. కేంద్రం పట్ల వ్యతిరేక ధోరణితో ఉంటే రాష్ట్రానికే తీవ్ర నష్టం జరుగుతుందని ఒమర్ అబ్దుల్లా చెప్పుకొచ్చారు.
Read Also: Maharashtra: మహారాష్ట్రలో పులులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్
అయితే, గత ఏడాది నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ జమ్ము కశ్మీర్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒమర్ అబ్దుల్లా సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత రెండుసార్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఇటీవల సోనామార్గ్లో జరిగిన సొరంగం ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. దీంతో, ఒమర్- బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారనే న్యూస్ వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా తాజాగా చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Here’s the link to the #JabWeMet with @OmarAbdullah that’s been getting rave reviews https://t.co/zW0oXACoD8
The new Jammu and Kashmir CM in a never before seen avatar. pic.twitter.com/WUN7yUlDX1— Rahul Kanwal (@rahulkanwal) January 16, 2025
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..