High Speed Rail: దక్షిణాది వాసులకు గుడ్న్యూస్.. హైదరాబాద్-బెంగళూరుకు 2 గంటల్లో చేరే హైస్పీడ్ రైలు!
- దక్షిణాది వాసులకు గుడ్న్యూస్
- హైదరాబాద్-బెంగళూరుకు 2 గంటల్లో చేరే హైస్పీడ్ రైలు!
- ప్రణాళికలు సిద్ధం చేసిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విమాన ప్రయాణానికి ధీటుగా హైదరాబాద్-బెంగళూరు, చెన్నైకి హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకోసం కేంద్రం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ హై స్పీడ్ రైళ్లు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కేవలం 2 గంటల్లో.. చెన్నైకి 2 గంటల 20 నిమిషాల్లో ప్రయాణీకులను చేరవేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు మరియు చెన్నైకి విమానాలు వరుసగా 1 గంట 15 నిమిషాలు మరియు 1 గంట 20 నిమిషాలు చేరుకోవడానికి పడుతుంది. ఇక ఎయిర్పోర్టుల నుంచి ఇళ్లకు చేరేందుకు మొత్తంగా 2-3 గంటల సమయం పడుతుంది. ఇదే సమయంలో హైస్పీడ్ రైళ్లు తీసుకొస్తే ఎలా ఉంటుందని కేంద్రం యోచిస్తోంది.
ఇది కూడా చదవండి: Laila : ‘లైలా’ యూత్ ఫుల్ ఎంటర్టైనర్.. నా కెరీర్ లో మెమరబుల్ మూవీ : విశ్వక్సేన్
Also Read
- Nashik Forced Conversion: బలవంతపు మతమార్పిడి, లైంగిక వేధింపుల ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్టు
- DMK vs AIADMK: డీఎంకె-ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం.. విజయ్ ఎమ్మెల్యేల హెచ్చరిక
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
రెండు హైస్పీడ్ రైళ్ల కోసం కారిడార్లను అభివృద్ధి చేయాలని కేంద్రం ప్రణాళిక రచిస్తోంది. దాదాపు 10 గంటల సమయం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైళ్లు గంటకు 320 కి.మీ వేగంతో నడిచేలా ప్లాన్ చేస్తున్నారు. విమాన ప్రయాణానికి పోటీగా ఈ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోందని జాతీయ మీడియా ఒక కథనంలో పేర్కొంది. ఇందుకోసం హైదరాబాద్-చెన్నై కారిడార్ 705 కి.మీ. విస్తరించాలని ప్రతిపాదించగా.. హైదరాబాద్-బెంగళూరు మార్గం 626 కి.మీ. ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థ మరియు ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ అయిన ఆర్ఐటీఈఎస్ లిమిటెడ్ను సర్వే కోసం టెండర్లను ఆహ్వానించింది. సర్వే మరియు అంచనాకు రూ.33 కోట్లు ఖర్చవుతుందని సమాచారం.
ఇది కూడా చదవండి: Badmashulu Teasir: బద్మాషులు టీజర్.. వీళ్ళు నిజంగానే బద్మాషుల్లాగా ఉన్నారే
వందే భారత్ వంటి సరుకు రవాణా రైళ్లు, ప్రయాణీకులకు సేవలు అందించే సాంప్రదాయ రైలు పట్టాల మాదిరిగా కాకుండా… ఈ కొత్త కారిడార్లు ప్రత్యేకంగా హై-స్పీడ్ రైళ్ల కోసం నిర్మించనున్నారు. ఈ డిజైన్ ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ కారిడార్ మాదిరిగా ఉంటుంది. బుల్లెట్ రైలు నడిచే విధంగా పట్టాలు ఏర్పాటు చేయనున్నారు. ముంబై-అహ్మదాబాద్ ప్రాజెక్ట్ 2015 లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక హైదరాబాద్ కారిడార్లు తుది రూపం దాల్చడానికి దాదాపు 15 సంవత్సరాలు పట్టవచ్చని దక్షిణ మధ్య రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఇది కూడా చదవండి: Kamal Haasan: కమల్ హాసన్కు ప్రమోషన్.. త్వరలో రాజ్యసభలోకి ఎంట్రీ!
తాజావార్తలు
-
Lexus TZ: లెక్సస్ TZ ఎలక్ట్రిక్ SUV ఆవిష్కరణ.. 530KM రేంజ్.. లగ్జరీ, హై-టెక్ టెక్నాలజీతో
-
Vaazha 2 OTT: బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసిన ‘వాలా 2’ డిజిటల్ ఎంట్రీ!
-
Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
-
Trump Tariffs: అమెరికా కోర్టు నుంచి ట్రంప్కు మరో ఎదురుదెబ్బ.. 10% సుంకాలు చట్టవిరుద్ధమని కొట్టివేత
-
BCCI-IPL 2026: ఇకపై ఐపీఎల్లో ఆటగాళ్ల ఆటలు సాగవు.. సస్పెన్షన్ లేదా డిస్క్వాలిఫికేషన్!