High Speed Rail: దక్షిణాది వాసులకు గుడ్న్యూస్.. హైదరాబాద్-బెంగళూరుకు 2 గంటల్లో చేరే హైస్పీడ్ రైలు!
- దక్షిణాది వాసులకు గుడ్న్యూస్
- హైదరాబాద్-బెంగళూరుకు 2 గంటల్లో చేరే హైస్పీడ్ రైలు!
- ప్రణాళికలు సిద్ధం చేసిన కేంద్రం
విమాన ప్రయాణానికి ధీటుగా హైదరాబాద్-బెంగళూరు, చెన్నైకి హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకోసం కేంద్రం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ హై స్పీడ్ రైళ్లు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కేవలం 2 గంటల్లో.. చెన్నైకి 2 గంటల 20 నిమిషాల్లో ప్రయాణీకులను చేరవేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు మరియు చెన్నైకి విమానాలు వరుసగా 1 గంట 15 నిమిషాలు మరియు 1 గంట 20 నిమిషాలు చేరుకోవడానికి పడుతుంది. ఇక ఎయిర్పోర్టుల నుంచి ఇళ్లకు చేరేందుకు మొత్తంగా 2-3 గంటల సమయం పడుతుంది. ఇదే సమయంలో హైస్పీడ్ రైళ్లు తీసుకొస్తే ఎలా ఉంటుందని కేంద్రం యోచిస్తోంది.
ఇది కూడా చదవండి: Laila : ‘లైలా’ యూత్ ఫుల్ ఎంటర్టైనర్.. నా కెరీర్ లో మెమరబుల్ మూవీ : విశ్వక్సేన్
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
రెండు హైస్పీడ్ రైళ్ల కోసం కారిడార్లను అభివృద్ధి చేయాలని కేంద్రం ప్రణాళిక రచిస్తోంది. దాదాపు 10 గంటల సమయం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైళ్లు గంటకు 320 కి.మీ వేగంతో నడిచేలా ప్లాన్ చేస్తున్నారు. విమాన ప్రయాణానికి పోటీగా ఈ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోందని జాతీయ మీడియా ఒక కథనంలో పేర్కొంది. ఇందుకోసం హైదరాబాద్-చెన్నై కారిడార్ 705 కి.మీ. విస్తరించాలని ప్రతిపాదించగా.. హైదరాబాద్-బెంగళూరు మార్గం 626 కి.మీ. ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థ మరియు ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ అయిన ఆర్ఐటీఈఎస్ లిమిటెడ్ను సర్వే కోసం టెండర్లను ఆహ్వానించింది. సర్వే మరియు అంచనాకు రూ.33 కోట్లు ఖర్చవుతుందని సమాచారం.
ఇది కూడా చదవండి: Badmashulu Teasir: బద్మాషులు టీజర్.. వీళ్ళు నిజంగానే బద్మాషుల్లాగా ఉన్నారే
వందే భారత్ వంటి సరుకు రవాణా రైళ్లు, ప్రయాణీకులకు సేవలు అందించే సాంప్రదాయ రైలు పట్టాల మాదిరిగా కాకుండా… ఈ కొత్త కారిడార్లు ప్రత్యేకంగా హై-స్పీడ్ రైళ్ల కోసం నిర్మించనున్నారు. ఈ డిజైన్ ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ కారిడార్ మాదిరిగా ఉంటుంది. బుల్లెట్ రైలు నడిచే విధంగా పట్టాలు ఏర్పాటు చేయనున్నారు. ముంబై-అహ్మదాబాద్ ప్రాజెక్ట్ 2015 లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక హైదరాబాద్ కారిడార్లు తుది రూపం దాల్చడానికి దాదాపు 15 సంవత్సరాలు పట్టవచ్చని దక్షిణ మధ్య రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఇది కూడా చదవండి: Kamal Haasan: కమల్ హాసన్కు ప్రమోషన్.. త్వరలో రాజ్యసభలోకి ఎంట్రీ!
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!