Himanta Biswa Sarma: ఆ కాంగ్రెస్ ఎంపీని పాకిస్తాన్ ఐఎస్ఐ ఆహ్వానించి, ట్రైనింగ్ ఇచ్చింది..
- గౌరవ్ గొగోయ్ పాకిస్తాన్ లింకులు..
- పాక్ ఐఎస్ఐ ఆహ్వానం మేరకే అక్కడికి వెళ్లారు..
- ఐఎస్ఐ కాంగ్రెస్ ఎంపీకి శిక్షణ ఇచ్చింది..
- మరోసారి అస్సాం సీఎం సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష ఉపనేతగా ఉన్న గౌరవ్ గొగోయ్ పై అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ విమర్శలను మరింత రెట్టింపు చేవారు. గౌరవ్ గొగోయ్ కి పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తున్న హిమంత, ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎంపీకి పాకిస్తాన్ గూఢచార సంస్థ ‘‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’ నుంచి ఆహ్వానం అందిందని, అందుకే పొరుగు దేశం వెళ్లారని ఆరోపించారు. గొగోయ్ ట్రైనింగ్ పొందడానికి పాకిస్తాన్ వెళ్లారని, ఇది తీవ్రమైన విషయమని శర్మ ఆరోపించారు.
‘‘గౌరవ్ గొగోయ్ ఐఎస్ఐ ఆహ్వానం మేరకు పాకిస్తాన్ కు వెళ్ళాడు. మొదటిసారిగా, ఐఎస్ఐ ఆహ్వానం మేరకు ఆయన పాకిస్తాన్ కు వెళ్ళారని నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ పత్రం మా దగ్గర ఉంది. శిక్షణ పొందడానికి ఆయన అక్కడికి వెళ్ళాడు. పాకిస్తాన్ హోం శాఖ నుండి లేఖ అందిన తర్వాత గౌరవ్ గొగోయ్ అక్కడికి వెళ్ళాడు. ఇది చాలా తీవ్రమైన విషయం. దీని తర్వాత, మరింత గణనీయమైన చర్యలు తీసుకోబడతాయి’’ అన్నారు.
Also Read
- Religious Conversion: ‘‘ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి’’.. TCS తర్వాత విప్రోపై ఆరోపణలు..
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Women Living Alone in India: వితంతువులు, విడాకులు, ఒంటరి మహిళల సంఖ్యపై షాకింగ్ రిపోర్ట్.. దక్షిణాదిలో ఎందుకు ఎక్కువ?
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
Read Also: Fire Accident: ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి.. సీఐపై బంధువుల దాడి..
పాకిస్తాన్ ఉగ్రవాదం తీరును ఎండగట్టడానికి భారత దౌత్యబృందం జాబితా నుంచి గొగోయ్ పేరు తొలగించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కోరిన ఒక రోజు తర్వాత అస్సాం సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. గొగోయ్ బ్రిటిష్ భార్య ఎలిజబెత్ కోల్బర్న్కి ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని శర్మ ఆరోపించారు. గొగోయ్ భార్యకు పాకిస్తాన్ సైన్యంతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ పాకిస్తాన్ సానుభూతిపరుడు అని చెప్పారు.
గొగోయ్ భారత అధికారులకు సమాచారం ఇవ్వకుండా 15 రోజులు పాకిస్తాన్లో ఉన్నారని, ఆయన భార్య భారతదేశంలో పనిచేస్తూ పాకిస్తాన్కి చెందిన ఎన్జీవో నుంచి జీతం తీసుకుంటుందని హిమంత ఆరోపించారు. ఆయనపై ఉన్న ఆరోపణలకు సంబంధించి సెప్టెంబర్ 10 నాటికి వెల్లడిస్తానని చెప్పారు. అయితే, గొగోయ్ తన భార్యపై వచ్చిన ఆరోపణల్ని తోసిపుచ్చారు. తనపై ఆయన నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాను నిజంగా జాతీయ భద్రతకు ముప్పు కలిగి ఉంటే కేంద్రం ఎందుకు మౌనంగా ఉందని గొగోయ్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Hema : షూటింగ్లకే మూడ్ ఉండదు.. పవన్ కళ్యాణ్ను విమర్శిస్తారా?
-
Religious Conversion: ‘‘ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి’’.. TCS తర్వాత విప్రోపై ఆరోపణలు..
-
Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
-
Women Living Alone in India: వితంతువులు, విడాకులు, ఒంటరి మహిళల సంఖ్యపై షాకింగ్ రిపోర్ట్.. దక్షిణాదిలో ఎందుకు ఎక్కువ?
-
Hyderabad Metro : మెట్రో వ్యవస్థకు ఎలాంటి నష్టం లేదు.. స్పష్టం చేసిన HMRL
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!