Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనలో వెలుగులోకి హృదయవిదారక అంశాలు..
- కరూర్ తొక్కిసలాట ఘటనలో హృదయవిదారక విషయాలు..
- మృతుల ఊపిరితిత్తుల్లో పగుళ్లు వచ్చాయని వైద్యుల గుర్తింపు..
- గుండెల చుట్టూ రక్తస్రావమైందంటున్న వైద్యనిపుణుల బృందం..
Karur Stampede: కరూర్ విజయ్ సభ తొక్కిసలాట ఘటనలో హృదయ విదారక విషయాలు బయటకొస్తున్నాయి. తొక్కిసలాట, తోపులాట చాలా తీవ్రంగా జరిగినట్లు వైద్యుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఫలితంగానే మరణాలు పెరిగాయనే అంచనాకు వచ్చారు. తమిళనాడు వైద్యవిద్య, పరిశోధన విభాగ డైరెక్టర్ ఆర్.సుగంధి రాజకుమారి నేతృత్వంలో ప్రత్యేక బృందం కరూర్ను సందర్శించింది. మృతులు, చికిత్స పొందుతున్న పేషెంట్లకు అందిన వైద్యం, వారి పరిస్థితి దగ్గరుండి చూసింది. కేస్షీట్లు, వైద్యుల నివేదికలు క్షుణ్ణంగా పరిశీలించింది. ఇందులో పలు కీలక విషయాలు వెలుగుచూశాయి.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
చాలా మంది కంప్రెస్సివ్ అస్ఫిక్సియాతో ఇబ్బందిపడి చనిపోయారని డాక్టర్లు తెలిపారు. తొక్కిసలాట, తోపులాటలో ఛాతీభాగం బలంగా ఒత్తిడికి గురవడంతో ఊపిరితిత్తులు సంకోచ, వ్యాకోచాలకు కష్టమైంది. ఊపిరితిత్తులపై ఒత్తిడి కారణంగా గాలి లోపలికి ప్రవేశించలేకపోయింది. మెదడుకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోయింది. సహజంగా ఎంతటి క్లిష్టపరిస్థితుల్లోనైనా 2, 3 నిమిషాలకు మించి బతకడం కష్టం. పిల్లలైతే 30 సెకన్లలోనే ప్రభావానికి గురవుతారని వైద్యులు చెబుతున్నారు. కొందరి ఊపరితిత్తుల్ని స్కానింగ్లో చూసినప్పుడు ఫ్రాక్చర్స్ కనిపించాయని, తద్వారా తొక్కిసలాట ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు.
Read Also: Tollywood Actress : వరుస ప్లాపులు.. షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి పరిమితమైన హాట్ బ్యూటీ
మరోవైపు టీవీకే పార్టీ చీఫ్, సినీ నటుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను చేపట్టిన రాష్ట్రవ్యాప్త పర్యటనలు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త పర్యటనలను రెండు వారాల పాటు వాయిదా వేయాల్సి వచ్చింది.. కాగా, ఈ తొక్కిసలాట ఘటనపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి.. విజయ్.. అధికార డీఎంకేపై ఆరోపణలు గుప్పిస్తుండగా.. డీఎంకే.. విజయ్పై కౌంటర్ ఎటాక్ చేస్తోంది.. కాగా, ఈ ఘటనలో ఇప్పటి వరకు 41 మంది మృతుల్ని ప్రకటించారు. ఘటన జరిగిన సెప్టెంబర్ 27న రాత్రి కరూర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రి తెచ్చినవారిలో 39మంది మార్గమధ్యంలోనే మృతిచెందినట్లుగా వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇక, పోస్ట్మార్టం నిర్వహించిన 41మందిలో 18 మంది మహిళలు, 13 మంది పురుషులు, 10 మంది చిన్నారులు ఉన్నారు..
తాజావార్తలు
-
Peddi : పెద్ది ఐటం సాంగ్.. చరణ్ – శృతి హాసన్ డాన్స్ వీడియో లీక్
-
Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
-
Tollywood: తెలుగు సినిమాపై డీజిల్ దెబ్బ.. షూటింగ్లు రద్దు!
-
Trump-King Charles: వైట్హౌస్లో ట్రంప్ను కలిసిన కింగ్ చార్లెస్ దంపతులు
-
Chiru – Raviteja : చిరు – రవితేజ సినిమాల టైటిల్స్ పై ఫ్యాన్స్ అసంతృప్తి.. సోషల్ మీడియాలో ట్రోల్స్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!