Gujarat: జీతం అడిగినందుకు నోటిలో చెప్పు పెట్టుకోవాలని దళితుడిని కొట్టిన మహిళా యజమాని..
Gujarat: గుజరాత్ మోర్బీ జిల్లాలో దారుణంగా ప్రవర్తించింది ఓ యజమాని. తాను మహిళని మరిచిపోయి ఓ దళిత ఉద్యోగిపై కర్కషంగా వ్యవహరించింది. పెండింగ్లో ఉన్న జీతం ఇవ్వాలని అడిగినందుకు సదరు మహిళా యజమాని దళిత ఉద్యోగిపై దాడి చేయడమే కాకుండా.. ఆమె చెప్పులను నోటిలో పెట్టుకోవాలని హింసించింది. ఈ వ్యవహారంలో సదరు మహిళతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
నీలేష్ దల్సానియా అనే 21 ఏళ్ల దళిత యువకుడు రాణిబా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నారు. కంపెనీ యజమాని విభూతి పటేల్ నీలేష్ ని అక్టోబర్ ప్రారంభంలో పనిలోకి తీసుకుంది. నెలకు రూ. 12,000 జీతం ఇస్తానని చెప్పింది. అయితే అతడిని అక్టోబర్ 18న పని నుంచి తీసేశారు. అయితే తాను పనిచేసిన 16 రోజులకు జీతం ఇవ్వాలని నీలేష్ కోరినప్పుడు విభూతి పటేల్ ఏం చెప్పకుండా, అతనితో కమ్యూనికేషన్ కట్ చేసింది.
Also Read
అయితే బుధవారం సాయంత్రం నిలేష్ అతని సోదరుడు, పొరుగువారితో కలిసి విభూతి పటేల్ కార్యాలయానికి వెళ్లాడు. ఆ సమయంలో వ్యాపారవేత్త సోదరుడు ఓంపటేల్, అతని సహచరులు నీలేష్ పై దాడి చేశారు. ఈ ఘటనలో విభూతి పటేల్ చెప్పుతో కొట్టి, ఆఫీస్ టెర్రస్పైకి తీసుకెళ్లి ఉద్యోగులతో కొట్టించింది. అంతటితో ఆగకుండా చెప్పును నోటిలో పెట్టుకోవాలని బలవంతం చేసింది, జీతం డిమాండ్ చేసినందుకు క్షమాపణలు చెప్పాలని, మరోసారి కంపెనీ పరిసరాల్లో తిరగకూడదని వార్నింగ్ ఇచ్చింది.
ప్రస్తుతం నిలేష్ దల్సానియా మోర్బీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. డబ్బు దోపిడికి వచ్చినట్లు నీలేష్ ను ఒప్పుకోవాల్సిందిగా బలవంతం చేశారు. నిందితులందరిపై అట్రాసిటీ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ ప్రతిపాల్ సిన్హాజాలా తెలిపారు. నిందితులందరి ఇంట్లో సోదాలు చేసినప్పుడు ఎవరూ లేరని, వారి కోసం మూడు టీంలతో వెతుకుతున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో