Gujarat: జీతం అడిగినందుకు నోటిలో చెప్పు పెట్టుకోవాలని దళితుడిని కొట్టిన మహిళా యజమాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat: గుజరాత్ మోర్బీ జిల్లాలో దారుణంగా ప్రవర్తించింది ఓ యజమాని. తాను మహిళని మరిచిపోయి ఓ దళిత ఉద్యోగిపై కర్కషంగా వ్యవహరించింది. పెండింగ్లో ఉన్న జీతం ఇవ్వాలని అడిగినందుకు సదరు మహిళా యజమాని దళిత ఉద్యోగిపై దాడి చేయడమే కాకుండా.. ఆమె చెప్పులను నోటిలో పెట్టుకోవాలని హింసించింది. ఈ వ్యవహారంలో సదరు మహిళతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
నీలేష్ దల్సానియా అనే 21 ఏళ్ల దళిత యువకుడు రాణిబా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నారు. కంపెనీ యజమాని విభూతి పటేల్ నీలేష్ ని అక్టోబర్ ప్రారంభంలో పనిలోకి తీసుకుంది. నెలకు రూ. 12,000 జీతం ఇస్తానని చెప్పింది. అయితే అతడిని అక్టోబర్ 18న పని నుంచి తీసేశారు. అయితే తాను పనిచేసిన 16 రోజులకు జీతం ఇవ్వాలని నీలేష్ కోరినప్పుడు విభూతి పటేల్ ఏం చెప్పకుండా, అతనితో కమ్యూనికేషన్ కట్ చేసింది.
Also Read
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
అయితే బుధవారం సాయంత్రం నిలేష్ అతని సోదరుడు, పొరుగువారితో కలిసి విభూతి పటేల్ కార్యాలయానికి వెళ్లాడు. ఆ సమయంలో వ్యాపారవేత్త సోదరుడు ఓంపటేల్, అతని సహచరులు నీలేష్ పై దాడి చేశారు. ఈ ఘటనలో విభూతి పటేల్ చెప్పుతో కొట్టి, ఆఫీస్ టెర్రస్పైకి తీసుకెళ్లి ఉద్యోగులతో కొట్టించింది. అంతటితో ఆగకుండా చెప్పును నోటిలో పెట్టుకోవాలని బలవంతం చేసింది, జీతం డిమాండ్ చేసినందుకు క్షమాపణలు చెప్పాలని, మరోసారి కంపెనీ పరిసరాల్లో తిరగకూడదని వార్నింగ్ ఇచ్చింది.
ప్రస్తుతం నిలేష్ దల్సానియా మోర్బీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. డబ్బు దోపిడికి వచ్చినట్లు నీలేష్ ను ఒప్పుకోవాల్సిందిగా బలవంతం చేశారు. నిందితులందరిపై అట్రాసిటీ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ ప్రతిపాల్ సిన్హాజాలా తెలిపారు. నిందితులందరి ఇంట్లో సోదాలు చేసినప్పుడు ఎవరూ లేరని, వారి కోసం మూడు టీంలతో వెతుకుతున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
-
Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
-
Prices Hike: పాలు, ఫుడ్డు, సబ్బులు.. ఏదీ కొనేటట్టు లేదు బాబోయ్..పరిస్థితి ఇలాగే కొనసాగితే బతుకు బస్టాండే..!
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
Pawan Kalyan: మళ్ళీ స్టైలిష్ లుక్’లోకి పవన్ కళ్యాణ్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!