Teesta Setalvad: వెంటనే లొంగిపోవాలి తీస్తా సెతల్వాడ్కి హైకోర్టు ఆదేశం.. గుజరాత్ అల్లర్ల కేసులో కుట్ర..
Teesta Setalvad: 2002 గుజరాత్ అల్లర్ల కేసులో కల్పిత సాక్ష్యాలను సృష్టించడం, పలువురుని కేసులో ఇరికించేందుకు కుట్ర చేసిన కేసులో ప్రముఖ హక్కుల నేత తీస్తా సెలత్వాడ్ నిందితురాలిగా ఉన్నారు. తాజాగా ఈ కేసులో ఆమెను వెంటనే లొంగిపోవాలని, బెయిల్ తిరస్కరిస్తూ గుజరాత్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శనివారం వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. గతేడాది సెప్టెంబరులో ఆమెకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఇప్పటివరకు ఆమెను అరెస్టు చేయలేదు.
సుప్రీంకోర్డును ఆశ్రయించే ఉత్తర్వులపై స్టే విధించాలన్న ఆమె తరుపు న్యాయవాది అభ్యర్థను గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చింది. గుజరాత్ లో 2002 అల్లర్ల విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి(సిట్)కి తప్పుడు సమాచారం, సాక్ష్యాలు ఇచ్చారనే అభియోగాలపై ఆమెపై కేసు నమోదైంది. ఈ కేసులో అమాయకులను ఇరికించే కుట్ర పన్నారని ప్రధాన అభియోగం. గతంలో ఈ కేసులో తీస్తా సెతల్వాడ్ ను గుజరాత్ యాంటీ టెర్రర్ స్వ్కాడ్(ఏటీఎస్) ముంబాయిలో అరెస్ట్ చేసింది.
Also Read
Read Also: Morphing photos: వివాహిత ఫొటోలు మార్ఫింగ్.. భర్తకు పంపించిన ఓ దుర్మార్గుడు.. !
రెండు నెలల పాటు జైలులో ఉన్న ఈమె బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ సెషన్స్ కోర్టు, గుజరాత్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చాయి. అయితే దీనిపై తీస్తా సెతల్వాడ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గతేడాది సెప్టెంబర్ లో విచారించిన సుప్రీంకోర్టు ఆమెకు మధ్యంత బెయిల్ ఇచ్చింది. అప్పటి నుంచి ఆమె బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు సాధారణ బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరుపున న్యాయవాది గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా.. ఆమె అభ్యర్థనను తిరస్కరించిన న్యాయస్థానం లొంగిపోవాల్సిందిగా ఆదేశించింది.
కల్పిత సాక్ష్యాలు, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర వంటి ఆరోపణలపై తీస్తా సెతల్వాద్, మాజీ పోలీసు అధికారి ఆర్బి శ్రీకుమార్లను అరెస్టు చేశారు. 2002 గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన తర్వాత తీస్తా సెప్టెంబర్ 2022లో గుజరాత్లోని సబర్మతి జైలు నుండి విడుదలయ్యారు. సాక్షుల తప్పుడు వాంగ్మూలాలను తీస్తా సెతల్వాద్ రూపొందించారని, అల్లర్లపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటైన నానావతి కమిషన్ ముందు దాఖలు చేశారని గుజరాత్ ఏటీఎస్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ పేర్కొంది. ఎఫ్ఐఆర్ ప్రకారం, సెతల్వాద్ మరియు శ్రీకుమార్ తప్పుడు సాక్ష్యాలను కల్పించడం ద్వారా మరియు అమాయకులపై తప్పుడు మరియు దురుద్దేశపూరితమైన క్రిమినల్ ప్రొసీడింగ్లను ఏర్పాటు చేయడం ద్వారా చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడానికి కుట్ర పన్నారనే అభియోగాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో